భండారు విజయ కథా సంపటాల పరిచయ సభ

On
భండారు విజయ కథా సంపటాల పరిచయ సభ

హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):


హైదరాబాద్ విమెన్ రైటర్స్ మరియు హస్మిత ప్రచురణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో జనవరి 23 సాయంత్రం భండారు విజయ సంపాదకత్వంలో రూపొందిన ‘పరిష్కృత’ (కథా సంకలనం) మరియు ఆమె స్వీయ కథా సంపుటి ‘సహజాత’ పుస్తకాల పరిచయ సభ ఘనంగా జరిగింది.IMG-20260124-WA1069

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వరంగల్ అరసం అధ్యక్షులు శ్రీ నిధి గారు వేదికపైకి ప్రముఖులను ఆహ్వానించి, భండారు విజయ స్త్రీవాద రచనలు, ఆమె సాహిత్య ప్రయాణం, రాబోయే రచనలపై పరిచయం చేశారు.

సభాధ్యక్షులు, తెలంగాణ బీసీ కమిషన్ తొలి కమిషనర్, శతాధిక రచయిత శ్రీ బి.ఎస్. రాములు  మాట్లాడుతూ—
భండారు విజయ కథలు రాయడమే కాకుండా, ఇతర రచయితలతో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ ‘పరిష్కృత’ వంటి కథా సంకలనాలను తీసుకురావడం అభినందనీయమన్నారు. కథలు రాసేటప్పుడు పాటించాల్సిన నియమాలను తాను మూడు దశాబ్దాల క్రితమే ‘కథల బడి’ పుస్తకంగా ప్రచురించానని, అది ప్రతి రచయిత చదవాల్సిన గ్రంథమని పేర్కొన్నారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న కవి ఏనుగు నర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ—
స్త్రీవాదాన్ని భూమికగా చేసుకుని భండారు విజయ చేస్తున్న రచనలు సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రత్యేకతను తెలియజేసే ‘జిగర్’ కవిత్వ సంకలనాన్ని అనిశెట్టి రజితతో కలిసి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, తన మిత్రురాలు కీ.శే. అనిశెట్టి రజితకు అంకితమిస్తూ ‘సహజాత’ను తీసుకురావడం గొప్ప విషయమన్నారు. భాషా సాంస్కృతిక శాఖ తరపున ఆమెకు అభినందనలు తెలిపారు.

‘సహజాత’ పుస్తక పరిచయం

ప్రముఖ సాహిత్య విమర్శకురాలు పి. జ్యోతి మాట్లాడుతూ—
‘సహజాత’లోని 21 కథలు వస్తుపరంగా విభిన్నంగా ఉండి, ప్రతి కథ కొత్త దృక్కోణాన్ని అందిస్తుందని తెలిపారు. సమస్యలను విక్టిమైజ్డ్ మోడ్‌లో చూపిస్తూ, పరిష్కారాలను సైకోథెరపీ, కౌన్సిలింగ్ పద్ధతుల్లో ఆలోచింపజేసేలా ఉన్నాయని చెప్పారు.
IVF ద్వారా సంతానం, సింగిల్ మహిళల మాతృత్వం, కులాంతర వివాహాలు, NRI పెళ్లిళ్ల వైఫల్యాలు వంటి అంశాలు కథల్లో బలంగా ప్రతిఫలించాయని అన్నారు. ‘అమ్మగది’, ‘దేవుడమ్మలు’ కథలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. యువత తప్పక చదవాల్సిన కథలుగా పేర్కొన్నారు.

దళిత రచయిత జూపాక సుభద్ర మాట్లాడుతూ—
ఈ కథలు ‘సర్వే జన సుఖినో భవంతు’ అన్న భావనతో ముగుస్తాయని, తెలంగాణ ఉద్యమం, ట్రాన్స్ కమ్యూనిటీ సమస్యలు, కుటుంబ వ్యవస్థలోని అంతర్గత సంఘర్షణలను సున్నితంగా చిత్రించాయని అన్నారు. ‘సీతామహాలక్ష్మి’, ‘దేవుడమ్మ’ కథలు తనకు బాగా నచ్చాయని చెప్పారు.

‘పరిష్కృత’ పుస్తకాన్ని పరిచయం చేసిన ప్రముఖ రచయిత, కార్టూనిస్టు నెల్లుట్ల రమాదేవి
మారుతున్న కాలాల్లో మహిళల సమస్యలు కొత్త రూపాలు దాల్చుతున్నాయని, గృహహింసపై ఈ సంకలనంలో 16 కథలు ఉండటం విశేషమన్నారు. ఈ కథలు పాఠకుల్లో సమస్యలపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు.

రచయిత కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ—
గృహహింస, లింగ వివక్ష, వరకట్నం, సంతాన సమస్యలు వంటి అంశాలు ఈ కథల్లో హృదయవిదారకంగా ఉన్నాయని, ముఖ్యంగా కాలేజీ విద్యార్థులకు ఇవి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సత్కారం, ఇతర కార్యక్రమాలు

తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి మాట్లాడుతూ—
సాహిత్యం పరిష్కార దిశగా ఉన్నప్పుడే సమాజానికి ఉపయోగపడుతుందని అన్నారు. స్త్రీవాద దృక్పథంతో కథలు రాస్తూ, ఇతర రచయితలను ప్రోత్సహిస్తున్న భండారు విజయకు అకాడమీ తరపున అభినందనలు తెలిపారు. అనంతరం ఆమెను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమ బస్ యాత్ర (ఫిబ్రవరి 1న ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రారంభమై ఫిబ్రవరి 3న అమరావతిలో ముగింపు) పోస్టర్‌ను ఆవిష్కరించారు.

చివరగా గిరిజ పైడిమర్రి గారి వందన సమర్పణతో లో కార్యక్రమం ముగిసింది.

Join WhatsApp

More News...

Crime  State News 

నాంపల్లి రోడ్‌లో ఫర్నిచర్ షాప్ భవనంలో అగ్నిప్రమాదం

నాంపల్లి రోడ్‌లో ఫర్నిచర్ షాప్ భవనంలో అగ్నిప్రమాదం హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): హైదరాబాద్ నాంపల్లి రోడ్‌లోని ఓ బహుళ అంతస్తుల ఫర్నిచర్ షాప్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు మంటల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఫర్నిచర్ షాప్‌కు చెందిన సెల్లార్‌లో ముందుగా అగ్ని...
Read More...
Filmi News 

అత్యంత వైభవంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల

అత్యంత వైభవంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల హైదరాబాద్, జనవరి 24: శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్ పతాకంపై పురిపండ వి. వెంకటరమణ మూర్తి శర్మ నిర్మాతగా, విజయమిత్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘100 డేస్ లవ్ స్టోరీ’. ‘అతి ప్రేమ భయానకం’ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను శుక్రవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా విడుదల చేశారు....
Read More...
National 

బడ్జెట్ పార్లమెంట్ 28 నుండి, సమావేశాలకు ముందు రోజు అఖిలపక్ష సమావేశం

బడ్జెట్ పార్లమెంట్ 28 నుండి, సమావేశాలకు ముందు రోజు అఖిలపక్ష సమావేశం న్యూఢిల్లీ జనవరి 24 (ప్రజా మంటలు): పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనవరి 27న అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సంప్రదాయం ప్రకారం, సమావేశాలు ప్రారంభమయ్యే ముందు అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరపనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు రెండు దశలుగా ఏప్రిల్...
Read More...
National  Entertainment   State News 

ఫిబ్రవరి 3 నుంచి ప్రజల కోసం రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్

ఫిబ్రవరి 3 నుంచి ప్రజల కోసం రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్ న్యూఢిల్లీ జనవరి 24, (ప్రజా మంటలు):ఢిల్లీ వాసులు, పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఉన్న ప్రసిద్ధ అమృత్ ఉద్యాన్ (Amrit Udyan) ఫిబ్రవరి 3 నుంచి సాధారణ ప్రజల సందర్శనకు తెరవనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఉద్యాన్ మార్చి 31 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏడాది...
Read More...
National  International   State News 

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభం ప్రభావం డాలర్ కుదేలు… భారత్‌లో ₹1.56 లక్షలకు చేరిన బంగారం ధర

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభం ప్రభావం డాలర్ కుదేలు… భారత్‌లో ₹1.56 లక్షలకు చేరిన బంగారం ధర లండన్ / న్యూఢిల్లీ జనవరి 24(ప్రజా మంటలు): గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, యూరోపియన్ దేశాలపై టారిఫ్ హెచ్చరికలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అనిశ్చితిని పెంచాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు పరుగులు తీయడంతో బంగారం ధరలు 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత అత్యుత్తమ...
Read More...
State News 

భండారు విజయ కథా సంపటాల పరిచయ సభ

భండారు విజయ కథా సంపటాల పరిచయ సభ హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): హైదరాబాద్ విమెన్ రైటర్స్ మరియు హస్మిత ప్రచురణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో జనవరి 23 సాయంత్రం భండారు విజయ సంపాదకత్వంలో రూపొందిన ‘పరిష్కృత’ (కథా సంకలనం) మరియు ఆమె స్వీయ కథా సంపుటి ‘సహజాత’ పుస్తకాల పరిచయ...
Read More...

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో చెలరేగిన హింస – నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో చెలరేగిన హింస – నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు ఉజ్జయిని జనవరి 23 (ప్రజా మంటలు): మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ వీఎచ్‌పీ (VHP) నాయకుడిపై జరిగిన దాడి అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారి అల్లర్లు చెలరేగినట్లు సమాచారం. ఆందోళనకారులు పలుచోట్ల బస్సులకు నిప్పు పెట్టడంతో పాటు ఇళ్లపై రాళ్లు రువ్వినట్లు అధికారులు తెలిపారు. హింస తీవ్రత పెరగడంతో పోలీసులు భారీగా...
Read More...
National 

శ్రీనగర్‌లో మంచుపాతం రవాణా, విద్యుత్ అంతరాయం

శ్రీనగర్‌లో మంచుపాతం  రవాణా, విద్యుత్ అంతరాయం శ్రీనగర్‌ జనవరి 23: శ్రీనగర్‌ నగరం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తాజాగా మంచు కురిసింది. పర్వతాలు పూర్తిగా మంచుతో కప్పబడి అందంగా కనిపిస్తున్నాయి. డాల్ లేక్‌ సరస్సు కూడా శీతాకాలపు అందాన్ని ప్రతిబింబిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.   మంచు పరిస్థిత శ్రీనగర్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు స్థాయిలో మంచు పడింది. ఎత్తైన ప్రాంతాల్లో మాత్రం...
Read More...
Local News  State News 

కేటీఆర్‌, హరీష్ రావులకు సంఘీభావం తెలిపిన దావ వసంత సురేష్

కేటీఆర్‌, హరీష్ రావులకు సంఘీభావం తెలిపిన దావ వసంత సురేష్ హైదరాబాద్, జనవరి 23 (ప్రజా మంటలు): సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జిల్లా బీఆర్ఎస్ పార్టీ...
Read More...

పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి  కొరకు నిధులు కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య

పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి  కొరకు నిధులు కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య జగిత్యాల జనవరి 23 ( ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని,జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య  ని కలిసిన జగిత్యాల పద్మశాలి సేవా సంఘం సభ్యులు.  జగిత్యాల పట్టణంలో పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని మరియు పద్మశాలి విద్యార్థుల సంక్షేమం కోసం హాస్టల్,సంఘానికి కళ్యాణ
Read More...
Local News  State News 

సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్

సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్ బిఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు? జగిత్యాల, జనవరి 23 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే గత పాలనలో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలు తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేదంటే ప్యాకేజీలకు లొంగుతాడా? లేక ధైర్యంగా చర్యలు తీసుకుంటాడా? అనే...
Read More...
Crime  State News 

భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్ ఖాదీర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ

 భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్ ఖాదీర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ భద్రాచలం, జనవరి 23 (ప్రజా మంటలు): భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్ షేక్ ఖాదీర్‌ను అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. బూర్గంపాడు సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో భూ రిజిస్ట్రేషన్లలో భారీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గత ఏడాది కాలంగా విచారణ కొనసాగుతోంది. ఏసీబీ ఖమ్మం రేంజ్ డీఎస్పీ వై. రమేష్...
Read More...