సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి

పండగ ప్రత్యేకతపై కోట ఉమా శర్మ ప్రత్యేక వ్యాసం మీకోసం..

On
సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి


ముగ్గులు ఏ ప్రదేశాన్నైనా సౌందర్యవంతంగా మార్చడమే కాక, ఆ ఇంటిని లక్ష్మీ నివాసంగా మలిచే పవిత్ర చిహ్నాలు. రంగురంగుల డిజైన్లు మాత్రమే కాదు, ప్రతి ముగ్గు వెనుక దాగి ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మిక భావన, సామాజిక ఉద్దేశం చాలా లోతైనవి. రోజూ మనం చూసే ఒక సాధారణ ముగ్గుకే ప్రత్యేక అర్థం ఉంది. ఆ అర్థం, కారణం, ప్రభావం ఏమిటో సంక్రాంతి సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.IMG-20260113-WA1280

ధనుర్మాసం (డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు) ముగింపు దశలో వచ్చే భోగి, సంక్రాంతి, కనుమ—ఈ మూడు రోజులు తెలుగు సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా నిలుస్తాయి. ఈ సమయంలో ఇళ్ల ముందు వేసే పెద్ద పెద్ద ముగ్గులు, వాటిలో గొబ్బెమ్మలు, పసుపు–కుంకుమలు, పూల అలంకరణలు, మామిడి తోరణాలు—అన్నీ కలసి ఒక దైవిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. గాలిపటాలతో నిండిన ఆకాశం, ఉదయించే సూర్యునికి పోటీగా మెరిసే రంగులు ఈ పండుగ ప్రత్యేకత.
భోగినాడు భోగి మంటలు, పిల్లలకు భోగి పళ్లు, మహిళలకు పసుపు–కుంకుమలు, పూలు, గాజులు, చలిమిడి, కొత్త బట్టలు, తీపి పదార్థాలు—ఇవన్నీ ఆరోగ్యానికి, ఐక్యతకు, ఆనందానికి ప్రతీకలు. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడి, పౌష్టికాహారం అన్నీ ఈ ఆచారాల్లో దాగి ఉన్నాయి.


కనుమ నాడు వేసే స్వర్గద్వార ముగ్గులు ప్రత్యేకమైనవి. ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు, పదిహేను చుక్కలతో గీతల రూపంలో వేసే ఈ ముగ్గులు కేవలం కళ కాదు—అవి ధర్మ, అర్థ, కామ, మోక్ష మార్గాల సూచికలు. పద్మాలు, శంఖాలు, చక్రాలు, చతురస్రాలు వంటి ఆకృతులు దేవతల చిహ్నాలు. వీటిని బియ్యం పిండితో సహజసిద్ధంగా, పర్యావరణానికి హాని లేకుండా రూపొందించడం మన మహిళల అపార ప్రతిభకు నిదర్శనం.
ఈ సంప్రదాయంలో స్త్రీ శక్తి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురుగా మాత్రమే కాకుండా—సలహాదారిగా, ఉపాధ్యాయినిగా, కుటుంబ ఆర్థిక స్థంభంగా నిలుస్తూ కూడా, ఇంటిముందు ముగ్గుల రూపంలో సంస్కృతిని ఆవిష్కరించగలగడం ఆమె విశిష్టత. గణితం, శిల్పకళ, ఆధ్యాత్మికత—మూడు కలిసిన రూపమే ముగ్గు.
సంక్రాంతి రోజుల్లో హరిదాసుల రాక మరో ప్రత్యేక ఆకర్షణ.

‘హరి’ అంటే శ్రీమహావిష్ణువు, ‘దాసు’ అంటే ఆయన శిష్యుడు. రంగురంగుల దుస్తులు, గజ్జల సవ్వడి, చిరుతల నాదంతో హరిదాసు ముగ్గుల మధ్య నిలబడి కీర్తనలు చేయడం ఆ ఇంటికి మహా పుణ్యం. చిన్నారులు బియ్యం దోసిళ్లతో కలశంలో పోస్తూ ఆశీర్వాదం పొందే దృశ్యం—లక్ష్మీ స్వరూప దర్శనంలా ఉంటుంది.
ఇదే సమయంలో గంగిరెద్దుల సందడి కూడా కనిపిస్తుంది. నందీశ్వరుని ప్రతీకగా భావించే గంగిరెద్దును శంఖ–చక్రాల అలంకరణలతో ముంగిటికి తీసుకువచ్చి దర్శించుకోవడం శుభప్రదం. శివ–కేశవుల అభేద భావనకు ఇది ప్రతీక.
ఈ పండుగలో రైతు పాత్ర మరువలేనిది. కొత్త ధాన్యంతో పరమాన్నం చేసి భూమాతకు, అష్టదిక్పాలకులకు నైవేద్యం సమర్పించడం భారతీయ వ్యవసాయ సంస్కృతికి ప్రతీక. పల్లెల్లో ‘పాతర’ వేసే సంప్రదాయం భవిష్యత్తుపై ముందుచూపును చాటుతుంది.
స్వర్గద్వార ముగ్గుల ద్వారా దేవతలే కాక పితృదేవతల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని విశ్వాసం. ఈ విధంగా ముగ్గుల ద్వారా ఇంటిని స్వర్గధామంగా మలిచే శక్తి భారతీయ స్త్రీలోనే ఉంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతిల స్థిర నివాసానికి ఇదే మూలం.
సంప్రదాయం, శాస్త్రం, ఆధ్యాత్మికత—మూడు సమన్వయమే సంక్రాంతి ముగ్గులు. ఈ విలువలను నేటి తరం అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లడం కాల అవసరం.

రచయిత్రి
-కోట ఉమా శర్మ
9958144884

Tags
Join WhatsApp

More News...

ఘనంగా శ్రీ వాణి జూనియర్ కళాశాల ఫేర్వెల్ వేడుకలు

ఘనంగా శ్రీ వాణి జూనియర్ కళాశాల ఫేర్వెల్ వేడుకలు   జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణము లోని శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గత విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు....
Read More...

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు)ఎన్నికలు నిర్వహణకు 900 మంది పోలీస్ లతో  పటిష్ట బందోబస్తు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు,సిబ్బందితో...
Read More...

దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం

దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఈ సాయంత్రం దేశవ్యాప్తంగా UPI ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. సుమారు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో డబ్బు పంపడం, QR కోడ్ స్కాన్ చేయడం వంటి UPI లావాదేవీలు పనిచేయలేదు. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన చెల్లింపు యాప్‌లలో సమస్య తలెత్తడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు...
Read More...
Local News 

జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 50 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌తో పాటు ముగ్గురు ఇతర పోలింగ్ అధికారులను...
Read More...
Local News  State News 

ధర్మపురిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి – మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు కొప్పుల ఈశ్వర్ సవాల్

ధర్మపురిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి – మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు కొప్పుల ఈశ్వర్ సవాల్ జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు): మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ధర్మపురిలో జరిగిన అభివృద్ధి కళ్లకు కనిపించకపోతే తాను ఏం చేయలేనన్నారు. ధర్మపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ఒకటని,...
Read More...
National  International   Crime 

జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ క్షీణత

జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ క్షీణత హాంకాంగ్ ఫిబ్రవరి 10:చైనా ప్రభుత్వానికి తీవ్ర విమర్శకుడిగా పేరుగాంచిన, హాంకాంగ్‌కు చెందిన ప్రజాస్వామ్య అనుకూల మీడియా వ్యాపారవేత్త జిమ్మీ లైకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ తీవ్రంగా క్షీణిస్తున్నదన్న ఆందోళనలకు మరింత బలం చేకూర్చింది. యాపిల్ డైలీ పత్రిక వ్యవస్థాపకుడైన జిమ్మీ లై, బీజింగ్...
Read More...
State News 

మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత

మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు): మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమైందని తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నీరు, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే...
Read More...

 ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకే ఫ్లాగ్ మార్చ్:డిఎస్పి రఘు చందర్

 ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకే ఫ్లాగ్ మార్చ్:డిఎస్పి రఘు చందర్   జగిత్యాల ఫిబ్రవరి 9 (ప్రజా మంటలు)ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో  ఎన్నికలు  నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది....
Read More...
Local News 

అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కడతారని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతినిధులను గెలిపిస్తేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 200 కోట్ల...
Read More...
National  Filmi News 

మళ్ళీ సెన్సార్ కు జన నాయకన్ సినిమా: కోర్టులో కేసు ఉపసంహరణ

మళ్ళీ సెన్సార్ కు జన నాయకన్ సినిమా: కోర్టులో కేసు ఉపసంహరణ చెన్నై – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): TVK పార్టీ నాయకుడు దలపతి నటించిన ‘జననాయకన్’ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును చిత్ర బృందం ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసింది. ఇంతవరకు ఉన్న ఈ చిత్ర సెన్సార్ పై ఉన్న సందేహాలను...
Read More...
National  International  

సీషెల్స్‌కు 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయం ప్రకటించిన భారత్

సీషెల్స్‌కు 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయం ప్రకటించిన భారత్ న్యూఢిల్లీ – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): భారతదేశానికి ఆరు రోజుల అధికారిక పర్యటనకు వచ్చిన సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుళ రంగాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో వాణిజ్యం, ఆర్థిక సహకారం, భద్రతా అంశాలపై పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ చర్చల అనంతరం,...
Read More...