గద్వాల్ జిల్లాలో అక్షరాస్యత, రోడ్లు, సాగునీటి వైఫల్యాలపై కవిత తీవ్ర విమర్శలు
గద్వాల జిల్లాలో జాగృతి జనం బాట
గద్వాల్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
జోగులాంబ గద్వాల్ జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, నిర్వాసితుల సమస్యలు, రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు.
రాజకీయ మార్పే పరిష్కారం
“70 ఏళ్లుగా ఒకే కుటుంబానికి అధికారం ఇస్తే ఏం మారింది?కొత్త నాయకత్వం వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యం.
నడిగడ్డ ఎవరి అడ్డా కాదని ప్రజలు నిరూపించాలి” అని కవిత పిలుపునిచ్చారు.
గుడ్డెందొడ్డిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఫస్ట్ స్టేజ్ పంప్ హౌస్, గుడ్డెందొడ్డి ఇరిగేషన్ క్వార్టర్స్లో నిర్వహిస్తున్న ఎస్సీ బాలికల గురుకులం, మల్లాపూర్ తండాలో నిర్మాణంలో ఉన్న గట్టు ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ ను ఆమె సందర్శించారు. నిర్వాసిత రైతులతో మాట్లాడిన కవిత, పూర్తి స్థాయి పరిహారం ఇప్పించే బాధ్యత జాగృతి తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
గద్వాల్లో నిర్వహించిన ప్రెస్మీట్లో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.2029 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని, ఇకపై బీఆర్ఎస్లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
“ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలోనే ఉంటాం. ఎంపీగా ఉన్నప్పుడు కూడా ‘మన ఊరు–మన ఎంపీ’ కార్యక్రమంతో ప్రజల్లోనే ఉన్నా” అని గుర్తు చేశారు.
అక్షరాస్యతపై ఆందోళనఓ
గద్వాల్ జిల్లాలో అక్షరాస్యత పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో పురుషుల అక్షరాస్యత 49.8 శాతం, మహిళల అక్షరాస్యత 39.4 శాతం మాత్రమే ఉందని తెలిపారు.
కేతిదొడ్డి మండలంలో మహిళల అక్షరాస్యత కేవలం 23 శాతంకే పరిమితమైందని పేర్కొంటూ,
“దేశవ్యాప్తంగా మహిళల విద్య పెరుగుతుంటే తెలంగాణలో మాత్రం తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘రైజింగ్ తెలంగాణ’ అని ఎలా అంటారు?” అని ప్రశ్నించారు.
రోడ్లు, ఇసుక మాఫియాపై విమర్శలు
జిల్లాలో రోడ్ల పరిస్థితి భయంకరంగా ఉందని, స్కూల్ బస్సులు కూడా గ్రామాలకు రావడం లేదని కవిత తెలిపారు.
ఇసుక మాఫియా కారణంగానే రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆరోపించారు.
“సీఎం ఫోటోలు పెట్టుకొని టిప్పర్లతో ఇసుక దందా జరుగుతోంది. సీఎం గారికి సంబంధం లేకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం
నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కవిత విమర్శించారు.
తుమ్మిళ్ల ప్రాజెక్ట్ వద్ద మూడు మోటార్లలో ఒక్కటే నడుస్తోందని, కాలువల విస్తరణ, పైప్లైన్ అవసరమని వివరించారు.
“వివాదాలు లేని ఆర్డీఎస్ నీళ్లను కూడా సరిగా వాడుకోలేకపోతున్నారు” అని అన్నారు.
విత్తన పత్తి రైతుల సమస్యలు
జిల్లా కేంద్రంలో విత్తన పత్తి రైతులతో సమావేశమైన కవిత, రైతులు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండించారు.
కంపెనీలు ప్రకటించిన ధర కంటే తక్కువ చెల్లిస్తున్నారని, రైతులకు డైరెక్ట్ అగ్రిమెంట్లు, ప్రభుత్వ ఆధ్వర్యంలో టెస్టింగ్ వ్యవస్థ అవసరమని స్పష్టం చేశారు.
చేనేతలు, ఆరోగ్యం, విద్యపై డిమాండ్లు
గద్వాల్ చేనేత పరిశ్రమకు ప్రత్యేక స్థలం కేటాయించాలని, చేనేత కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
300 పడకల ఆసుపత్రి ఉన్నా సరైన వైద్యసౌకర్యాలు లేవని, ప్రజలు కర్నూల్కు వెళ్లాల్సి వస్తోందని విమర్శించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
హరిహరాలయంలో ఘనంగా మూలమూర్తికి అభిషేకం
జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పుష్య మాసము తొలి సోమవారం సాయంత్రం మూలమూర్తికి వివిధ ఫల రసాధులచే అభిషేకం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు వేద ఆశీర్వచనం చేశారు
ఇదిలా ఉండగా ఏ ఎస్ ఐ... రూ.3855.02 కోట్ల వ్యాపారానికి చేరుకున్న గాయత్రి బ్యాంకు : కొడిమ్యాలలో 68వ శాఖ ప్రారంభం
జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్నది. గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. కొడిమ్యాల మండల కేంద్రంలో బ్యాంకు 68వ శాఖను జగిత్యాల జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ బి. సత్యప్రసాద్ ఐఏఎస్ చేతుల మీదుగా సోమవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా... కస్టడీ మృతిపై తీవ్ర ఆరోపణలు: విచారణకు ఆదేశించిన TGHRC
హైదరాబాద్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
కర్లా రాజేష్ కస్టడీ మృతికి సంబంధించి వచ్చిన తీవ్ర ఆరోపణలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) పరిగణనలోకి తీసుకుంది. SR నెం.4129, 4130 ఆఫ్ 2025 కేసుల్లో అక్రమ నిర్బంధం, కస్టడీలో చిత్రహింసలు, తప్పుడు కేసు నమోదు వల్లే రాజేష్ మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయని కమిషన్... ప్రజా సమస్యలను పట్టించుకొని కేసీఆర్ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు
కరీంనగర్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
కరీంనగర్ ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుడ ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుతూ కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని తెలిపారు. మాజీ సీఎం... ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చొరవ చూపాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు)
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి... జగిత్యాలలో నూతన సర్పంచులకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
జగిత్యాల, డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గంలోని లక్ష్మిపూర్, నర్సింగపూర్, చల్గల్, దరూర్, సింగారవుపేట్, అల్లిపూర్, ఉప్పమడుగు, అయోధ్య, మహితపూర్ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాలతో తనకు... సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్: అభినందించి రివార్డ్ అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి స్పృహ కోల్పోగా,
అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్ చంద్రశేఖర్ ను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శాలువతో సన్మానించి రివార్డును... గద్వాల్ జిల్లాలో అక్షరాస్యత, రోడ్లు, సాగునీటి వైఫల్యాలపై కవిత తీవ్ర విమర్శలు
గద్వాల్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
జోగులాంబ గద్వాల్ జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, నిర్వాసితుల సమస్యలు, రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు.
రాజకీయ మార్పే పరిష్కారం
“70 ఏళ్లుగా... యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:?
జగిత్యాల / హైదరాబాద్ డిసెంబర్ 22 ప్రజా మంటలు:
జగిత్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సందర్భంగా యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతా అని ఎమ్మెల్యే... TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సౌజన్యంతో కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం, అదనపు క్లాస్రూమ్స్ను ప్రారంభించారు. టిడిఎఫ్–మన తెలంగాణ బడి ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అందించిన ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి.... గద్వాల జిల్లా ప్రజల సమస్యలపై కవిత ఘాటు ప్రశ్నలు
జోగులాంబ గద్వాల జిల్లా డిసెంబర్ 21(ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గద్వాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బీచుపల్లి బ్రిడ్జి వద్ద జాగృతి నాయకులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీచుపల్లి... 