మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్
మరో ఆరుగురు మావోయిస్ట్ లు కూడా :31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లీ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి. హిడ్మా భార్య, కీలక నాయకులు, PLGA సభ్యుల మరణం. AP ఇంటెలిజెన్స్ ధృవీకరణతో పూర్తి వివరాలు.
31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన
పోలీసులు
హిడ్మా – నలుగురు రాష్ట్రాలను వణికించిన మావోయిస్టు కమాండర్
విజయవాడలో ఉద్రిక్తత – మావోయిస్టుల కదలికలపై అలర్ట్
మారేడుమిల్లీ / విజయవాడ నవంబర్ 18 (ప్రజా మంటలు):

ఆంధ్రప్రదేశ్–ఛత్తీస్గఢ్–ఒడిశా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతం మరోసారి ఉదయం క్షణాల్లోనే యుద్ధభూమిగా మారింది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య మారేడుమిల్లీ పరిధిలో జరిగిన తీవ్ర ఎదురు కాల్పుల్లో మావోయిస్టుల అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
ఈ ఎన్కౌంటర్ను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా అధికారికంగా ధృవీకరించారు.
ఎన్కౌంటర్ వివరాలు
- మొదట ఏ ఓ బీ మావోయిస్టు టీమ్ – పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం.
- అనంతరం పీپلز లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బృందం కూడా కాల్పుల్లో పాల్గొన్నట్లు నిర్ధారణ.
- మృతి చెందిన వారిలో:
- మద్వి హిడ్మా (కేంద్ర కమిటీ సభ్యుడు)
- హిడ్మా భార్య రాజే (రాధ)
- చెల్లూరి నారాయణ రావు (ముఖ్య నాయకుడు)
- గడ్డం లక్ష్మణ్ (పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు)
- మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.
- రెండు మహిళల్లో ఒకరు హిడ్మా భార్య కాగా, మరో మహిళా సభ్యురాలి గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

హిడ్మా – నలుగురు రాష్ట్రాలను వణికించిన మావోయిస్టు కమాండర్
హిడ్మా పేరు చెప్పగానే పోలీసు విభాగాల్లో భయం. ఆయన నడిపిన భారీ దాడులు నాలుగు రాష్ట్రాలను సంవత్సరాలుగా కుదిపేశాయి.
ప్రధాన కేసులు
- 2007 – సుక్మా, ఉర్పల్మేట: సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి
- 2010 – తడ్మెట్ల మాస్కేర్: 76 మంది జవాన్లు మృతి
- 2013 – జీరామ్ ఘాటీ దాడి: కాంగ్రెస్ నేతల ఊచకోతలో కీలక పాత్ర
- 2017 – సుక్మా: 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల హత్య
- 2021 – తరేమ్ అంబుష్: 23 మంది భద్రతా సిబ్బంది మృతి
మొత్తం 26 ప్రధాన నక్సలైట్ దాడుల్లో హిడ్మా కీలక నిందితుడు.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యాఖ్యలు
“హిడ్మా స్కెచ్ వేస్తే శత్రువులకు నూకలు చెల్లినట్టే…
ఈ ఎన్కౌంటర్ మావోయిస్టులకు తట్టుకోలేని దెబ్బ,” అని డీజీపీ పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్చంద్ర లడ్డా తెలిపారు. మంగళవారం ఉదయం 6.30-7.00 గంటల మధ్య భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. ఎన్ కౌంటర్ వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్తో కలిసి ఆయన వెల్లడించారు. గత రెండు రోజులుగా ఇంటెలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టామని మహేశ్చంద్ర లడ్డా తెలిపారు.
కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. మావోయిస్టుల నుంచి వివిధ రకాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
మరోవైపు కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు.
Latest News
M

విజయవాడలో ఉద్రిక్తత – మావోయిస్టుల కదలికలపై అలర్ట్
హిడ్మా నెట్వర్క్కు చెందిన 27 మంది మావోయిస్టులు విజయవాడ ఆటోనగర్లో ఒక భవనాన్ని షెల్టర్గా ఉపయోగిస్తున్నారని ఇంటెలిజెన్స్ నివేదికలు తెలిపాయి.
- భవనాన్ని ఆక్టోపస్ పోలీసులు చుట్టుముట్టారు
- భారీగా అయుధాలు డంప్ చేసిన ఆనవాళ్లు దొరికినట్లు సమాచారం
- వీరిలో కొందరు హిడ్మా క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ సభ్యులుగానే అనుమాnనం .
మారేడుమిల్లీ ఎన్కౌంటర్లో హిడ్మా సహా ఆరుగుర మావోయిస్టులు మృతి చెందడం మావోయిస్టుల ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బగా భద్రతా వ్యవస్థ భావిస్తోంది. ప్రత్యేక దళాలు, గ్రేహౌండ్లు, కేంద్ర బలగాలతో కలిసి సరిహద్దు ప్రాంతాల్లో కాంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
కలెక్టరేట్లో 'నషా ముక్త్ భారత్ ' అభియాన్ ప్రతిజ్ఞ డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ పాటుపడలి –జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) బి. రాజ గౌడ్
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా అధికారులు ,కలెక్టరేట్ సిబ్బంది , విద్యార్థులచే మాదక ద్రవ్య నిరోధక ప్రతిజ్ఞ
డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ పేర్కొన్నారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశమందిరంలో... అంగరంగ వైభవంగా శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతర స్వామి కళ్యాణ వేడుకలు
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయము లో ఘనంగా శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మంగళ వారం కార్తీక మాసం శుక్ల పక్షం త్రయోదశి ఉ. సుప్రభాత సేవ మరియు మూలవిరాట్టుకు అభిషేకములు నిర్వహించారు. భక్తులు... ప్రజల్లో చైతన్యం కోసం పోలీసుల కళా ప్రదర్శనలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గ్రామీణ ప్రాంతాలలో విస్తృత కార్యక్రమాలతో సామాజిక అంశాల పై అవగాహన
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సత్ఫలితాలిస్తున్న అవగాహన కార్యక్రమాలు- మూఢ విశ్వాసాల పై ప్రజలలో కనిపిస్తున్న మార్పు
జగిత్యాల జిల్లా ప్రజల్లో సామాజిక అంశాల పై చైతన్యం పెంపొందించేందుకు పోలీసులు నిరంతరం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, తెలిపారు.
2016 నుoడి జగిత్యాల పోలీస్ కళా బృందం జిల్లా వ్యాప్తంగా... మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లీ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి. హిడ్మా భార్య, కీలక నాయకులు, PLGA సభ్యుల మరణం. AP ఇంటెలిజెన్స్ ధృవీకరణతో పూర్తి వివరాలు. హరిహరాలయంలో కార్తీక సోమవారం ఘనంగా పరమ శివునికి అభిషేకాలు
జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు)జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో కార్తీక సోమవారం చివరి సోమవారం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి చేరుకొని పరమ శివునికి పంచామృతాలతో అభిషేకించి కార్తీకదీపంలు వెలిగించారు.
ఈ సందర్భంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయ అధ్యక్షులు చాకుంట వేణుమాధవ రావు దంపతులు సాంబశివునికి వివిధ... ఖమ్మం జిల్లా లో–జాగృతి జనంబాట పర్యటనలో మాడల్ స్కూల్ ను సందర్శించిన కవిత
ఖమ్మం నవంబర్ 18 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు సందర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
స్కూల్ హాస్టల్ భవనంలో పెచ్చులూడిన గోడలు, పైకప్పు ఊడిపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితి నెలకొన్నట్లు... హైదరాబాద్లో బంగారం–వెండి ధరల్లో స్వల్ప మార్పులు
హైదరాబాద్, నవంబర్ 18 (ప్రజా మంటలు):హైదరాబాద్లో బంగారం మరియు వెండి ధరలు ఈరోజు స్వల్ప మార్పులతో స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఊగిసలాట, రూపాయి మార్పిడి విలువ, స్థానిక డిమాండ్ వంటి అంశాలు నగర రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. ధరలను స్థానిక వ్యాపారులతో మాట్లాడి సరిపోల్చుకోండి. ఇవి సమాచారం కొరకు మాత్రమే. వాస్తవ... ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ను కలిసిన కొత్త రూరల్ ఎస్ఐ
జగిత్యాల (రూరల్), నవంబర్ 18 (ప్రజా మంటలు):జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్ నూతన ఉపనిర్వాహక అధికారి (SI)గా ఉమా సాగర్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, సన్మాన సూచికగా మొక్కను అందజేశారు.
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమా సాగర్,... బేగంపేట్లో రోడ్డు ప్రమాదం: థార్ వాహనం నుజ్జునుజ్జు, ట్రక్ బోల్తా
బేగంపేట్ బస్ స్టాప్ వద్ద థార్ వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టిన హెవీ లోడ్ ట్రక్ బోల్తా. గాయపడిన వారు ఆసుపత్రికి తరలింపు. పోలీసులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వికటించిన ఐవీఎఫ్ చికిత్స… శంషాబాద్లో భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య
శంషాబాద్లో ఐవీఎఫ్ చికిత్స వికటించడంతో ఎనిమిదో నెల గర్భిణి శ్రావ్య, గర్భంలోని కవలలు మృతి. షాక్ తట్టుకోలేక భర్త విజయ్ ఆత్మహత్య. కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసిన హృదయ విదారక ఘటన పూర్తి వివరాలు. ఐ–బొమ్మ పైరసీ వెబ్సైట్ లో సంచలన ప్రకటన
హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):
ఇన్నాళ్లు పోలీసులను చాలెంజ్ చేసిన ibomma సంచలన ప్రకటనను తన వెబ్సైట్ లో పోస్ట్ చేసింది.
ఐ–బొమ్మ తన ప్రకటనలో, “ఈ మధ్యలో మీరు మా గురించి విన్నే ఉంటారు… మొదటి నుంచీ మా విశ్వసనీయ అభిమానులుగా ఉన్నారు… కానీ ఇప్పుడు మా సేవలను నిలిపివేస్తున్నాం. దేశవ్యాప్తంగా మా... ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాగృతి జనంబాటలో భాగంగా కవిత పర్యటన. మోడల్ స్కూల్ సమస్యలు, సీతారామ ఎత్తిపోతల పథకం ఆలస్యం, సింగరేణి కార్మికుల ఇబ్బందులు, వైరా మార్కెట్ సమస్యలు, ప్రజా సమస్యలపై కీలక వ్యాఖ్యలు. సమగ్ర కథనం 