వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా యశోద హాస్పిటల్స్ లో అవేర్నెస్
ప్రధాన అతిథిగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు):
వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రధాన అతిథిగా హాజరై, యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ — “బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడుకు రక్తప్రసరణకు అంతరాయం కలిగినప్పుడు సంభవించే అత్యవసర పరిస్థితి. దీని సంకేతాలను వెంటనే గుర్తించడం, తక్షణ వైద్య సహాయం పొందడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు” అని తెలిపారు. గత మూడు దశాబ్దాల్లో భారతదేశంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు 50%కు పైగా పెరిగాయని, వాయు కాలుష్యం, జీవనశైలి మార్పులు, ఒత్తిడి, మధుమేహం వంటి కారణాలు దీనికి దోహదమని పేర్కొన్నారు.
అలాగే స్ట్రోక్ సాధారణ లక్షణాలుగా — ఆకస్మిక బలహీనత, ముఖం లేదా చేయి తిమ్మిరి, మాట్లాడటంలో ఇబ్బంది, చూపు మందగించడం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయని, వీటిని గమనించగానే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.
యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ — “బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలో యశోద హాస్పిటల్స్ అత్యాధునిక ‘మెకానికల్ థ్రోంబెక్టమీ’ విధానాన్ని ప్రవేశపెట్టింది. రక్త నాళాలలో ఏర్పడిన గడ్డలను తొలగించి మెదడుకు రక్తప్రసరణను పునరుద్ధరించే ఈ సాంకేతికత ద్వారా అనేకమంది రోగులు తిరిగి సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు. స్ట్రోక్ లక్షణాలు కనిపించిన 24 గంటల లోపు ఈ చికిత్స చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి” అని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆర్. ఎన్. కోమల్ కుమార్, న్యూరో సర్జన్ డాక్టర్ అయ్యాదురై, సికింద్రాబాద్ యశోద యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
------
More News...
<%- node_title %>
<%- node_title %>
యాదాద్రి లో ఏసీబీ వలలో ఆలయ ఇంజనీరు
– రూ.1.90 లక్షల లంచం స్వీకరిస్తుండగా పట్టుబాటు
యాదాద్రి అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (యాదగిరిగుట్ట)లో అవినీతి కలకలం రేపుతోంది. ఆలయ ఇంజినీర్ (S.E) ఉడేపు రామారావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
📍 ... తెలంగాణలో ఎరుపు హెచ్చరిక – 8 జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం
అక్టోబర్ 30, (ప్రజా మంటలు):
తెలంగాణలో అతివృష్టి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
📍 రికార్డు స్థాయి వర్షపాతం
తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా ... తెలంగాణలో మొంథా బీభత్సం కొనసాగుతుంది –ములుగు, వరంగల్ జలదిగ్భంధం, రైతులు ఆందోళనలో
ప్రతి కుటుంబానికి ₹3,000 ప్రత్యేక సాయం
ప్రతి వ్యక్తికి ₹1,000 చొప్పున, గరిష్టంగా కుటుంబానికి ₹3,000 వరకు చెల్లింపు
జిల్లా కలెక్టర్లకు తక్షణ చెల్లింపుల అనుమతి
హైదరాబాద్ అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణపై మొంథా తుఫాన్ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ... ఆమె ధరించేది ఎవరు నిర్ణయించాలి? ఇరాన్లో హిజాబ్ చట్టాలపై మహిళల తిరుగుబాటు
ఇరాన్లో మహిళల తిరుగుబాటు
యూరప్లో విరుద్ధ పరిస్థితి
అక్టోబర్ 30, (ప్రజా మంటలు):
ఇరాన్లో మహిళలు హిజాబ్ తప్పనిసరి చట్టాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. మరోవైపు యూరప్లో మాత్రం కొత్త చట్టాలు హిజాబ్పై నిషేధాలు విధిస్తున్నాయి. దీంతో ఒక్క ప్రశ్న ముందుకు వస్తోంది — మహిళ ఏం ధరించాలో నిర్ణయించేది ఎవర
ఇరాన్లో మహిళల... అమెరికా–చైనా నేతల భేటీ: ఆరేళ్ల తర్వాత ట్రంప్–జిన్ పింగ్ ముఖాముఖి | సానుకూల సందేశాలు
6 ఏళ్ల తర్వాత ట్రంప్–జిన్ పింగ్ భేటీ
బుసాన్లో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు
అమెరికా–చైనా సంబంధాల మెరుగుదలకు సంకేతాలు
భూసాన్ (దక్షిణ కొరియా) అక్టోబర్ 30:ప్రజా మంటలు
దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ (Xi Jinping) ముఖాముఖీ భేటీ... గుర్రంపోడు: పెళ్లైన 14 రోజులు కూడా గడవక ముందే మృత్యువు ముంచుకొచ్చింది
నల్గొండ అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
ప్రేమించి వివాహం చేసుకున్న నవదంపతుల కలలు కళ్లముందే చిద్రమయ్యాయి. నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూష (22), చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్ ఇటీవలే ప్రేమవివాహం చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో కేవలం 14 రోజుల క్రితం గుడిలో దండలు మార్చుకున్నారు.
బుధవారం సాయంత్రం దంపతులు ద్విచక్ర... జగిత్యాలలో ₹100 కోట్ల ప్రభుత్వ భూమి వివాదం – బాధ్యత గల పౌరుడిగా భూ ఆక్రమణను వెలుగులోకి తెచ్చిన - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో కాంగ్రెసు నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.
₹100 కోట్ల విలువ గల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని ఆరోపణల నేపథ్యంలో, జీవన్... న్యాయవాదులపై అనుచిత ప్రవర్తన కేసు - మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు
మానవ హక్కుల కమిషన్ లో అడ్వకేట్ రామారావు ఫిర్యాదు జనగాం పోలీసులపై ఎఫ్ఐఆర్
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు) :
గతంలో జనగాం సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించిన రఘుపతి, ఎస్ఐ తిరుపతి లపై న్యాయవాద దంపతులు గద్దల అమృత్రావు, కవితలతో అనుచిత ప్రవర్తన చేసిన ఘటనకు సంబంధించి జనగాం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు... గాంధీ రోగి సహాయకుల విశ్రాంతి భవన నిర్వాహణకు చేయూత
నిత్యవసరాలు, బ్లాంకెట్లు అందచేసిన ఎస్బీఐ లేడీస్ క్లబ్
సికింద్రాబాద్, అక్టోబర్ 29 ( ప్రజామంటలు):
గాంధీ ఆస్పత్రిలోని జనహిత సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న రోగి సహాయకుల విశ్రాంతి భవనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్, హైదరాబాద్ సభ్యులు బుధవారం సందర్శించారు. షెల్టర్ హోమ్లో ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు.లబ్ధిదారులు మాట్లాడుతూ... ఎన్కౌంటర్ భయం వ్యక్తం చేసిన గ్యాంగ్స్టర్ జగ్గు భగవాన్పురియా — హైకోర్ట్లో పిటిషన్ దాఖలు
చండీగఢ్ అక్టోబర్ 39:
పంజాబ్కు తరలించే ముందు కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్ జగ్గు భగవాన్పురియా తన ప్రాణ భయాన్ని వ్యక్తం చేస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు.
తనను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చే అవకాశం ఉందని భగవాన్పురియా తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో హైకోర్టు, పంజాబ్ ప్రభుత్వాన్ని నోటీసు జారీ చేస్తూ, రాష్ట్రం నుండి వివరణ... చాచల్లో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల ఆందోళన — వేతన సమానత్వం సహా డిమాండ్లు
గౌహతి అక్టోబర్ 29:
గువహటి నగరంలోని చాచల్ ప్రాంతంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగుల సంఘం మరియు అఖిల అసోం హెల్త్ అండ్ టెక్నికల్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది.
ఉద్యోగులు సమాన వేతనాలు, సేవా భద్రత, అలాగే ముఖ్యమంత్రి డా. హిమంత బిశ్వ శర్మ ఇచ్చిన హామీలను... “భారత్తో యుద్ధం చేస్తే నష్టపోయేది పాకిస్తానే” -పాకిస్తాన్కు అమెరికా మాజీ సీఐఏ అధికారి హెచ్చరిక
వాషింగ్టన్/న్యూ ఢిల్లీ, అక్టోబర్ 29:భారత్తో యుద్ధానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) మాజీ అధికారి జాన్ కిరియాకో (John Kiriakou) హెచ్చరించారు. తన 15 ఏళ్ల కౌంటర్టెరరిజం సేవా కాలంలో సగం కాలాన్ని పాకిస్తాన్లో గడిపిన ఆయన, పాకిస్తాన్ నిరంతరం భారతదేశాన్ని ప్రేరేపించడం... 