ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించాలి

- రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు

On
ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించాలి

ప్రతి ఒక్కరి సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయాలి

- జూలై నాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టుకోవాలి

- ఆయిల్ పామ్ పంట విస్తరణ కు కట్టుదిట్టమైన చర్యలు*

- రాబోయే మూడున్నర సంవత్సరాలలో శాచురేషన్ పద్దతిలో నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

- శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను వెంటనే ఇతర భవనాలకు తరలించాలి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, హౌసింగ్, పంచాయతీ రాజ్, పని తీరు పై సమీక్ష 

కరీంనగర్ జూన్ 22 (ప్రజా మంటలు):

IMG_20250622_203732

ప్రతి ఒక్కరి సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయాలనీ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఆదివారం మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియం హల్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, హౌసింగ్ తదితర శాఖల పని తీరు  పై రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్ & పబ్లిక్ రిలేషన్స్) హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, కోయ శ్రీ హర్ష, సందీప్ కుమార్ ఝ, సత్య ప్రసాద్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరెందర్ రెడ్డి, ఎమ్మెల్యే లు కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం, చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,   డాక్టర్ సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్య నారాయణ, గంగుల కమలాకర్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వర్షా భావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత,  రైతు భరోసా,  ఆయిల్ పామ్ సాగు,  ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్ జరిగిన ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, బడి బాట, మధ్యాహ్న భోజనం, తదితర అంశాల ను  ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వారీగా సంబంధిత జిల్లా కలెక్టర్ లు వివరించారు. 

ఈ సందర్భంగా *మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ,*  గత ఏడాదిన్నర కాలంగా గత పాలకుల హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేస్తున్నామని అన్నారు.  రాష్ట్రంలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను సరి చేస్తూ ఆర్థికపరమైన వెసులుబాటు చేసుకొని పాలన సాగిస్తున్నామని అన్నారు. 

IMG-20250622-WA0023

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా పని చేయాలని అన్నారు.  ప్రజలకు మేలైన పాలన అందించాలని, ఎక్కడా ఎటువంటి అవినీతి ఆస్కారం లేకుండా పాలన చేయాలని అన్నారు. 

జూలై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల స్టాక్ జిల్లాలో అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు.  యూరియా వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తక్కువ సరఫరా చేస్తుందని, అవసరమైన మేర మాత్రమే యూరియా వాడాలని, అధికంగా వాడటం వల్ల భూ సారం తగ్గిపోతుందని, భూమికి నష్టం జరుగుతుందని, దీని పై రైతులకు రెగ్యులర్ గా అవగాహన కల్పించాలని అన్నారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఆయిల్ పామ్ సాగు పై మరింత శ్రద్ద వహించాలని అన్నారు. ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యాలకు మించి ఆయిల్ పామ్ విస్తరణ చేపట్టాలని అన్నారు.  ఆయిల్ పామ్ పంట చేతికి వచ్చిన రైతుల అనుభవాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేయాలని అన్నారు.

హార్టికల్చర్ అధికారులతో పాటు వ్యవసాయ  శాఖలోని ఏ.ఈ.ఓ, ఏ.ఓ లు కూడా లక్ష్యాలు నిర్దేశించుకోని పని చేయాలని మంత్రి ఆదేశించారు.
నగరం పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగు పెద్ద ఎత్తున చేయాలని మంత్రి తెలిపారు.

విద్యా శాఖ పట్ల జిల్లా కలెక్టర్ లు శ్రద్ధ వహించాలని, ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్య అందాలని,  ప్రభుత్వ బడులలో విద్యార్థుల నమోదు పెంచాలని, మన ప్రభుత్వ పాఠశాలలో వస్తున్న మార్కులను ప్రజలకు వివరించాలని మంత్రి ఆదేశించారు.

IMG-20250622-WA0023

 జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్&బీ శాఖ, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించాలని, ఎక్కడైనా శిథిలావస్తలో పాఠశాలలు ఉంటే వెంటనే అక్కడి నుంచి తరలించాలని, వర్షా కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించవద్దని అన్నారు.

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సహాకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని, గతంలో జరిగిన అస్త్యవ్యస్థ పాలన ను సరిదిద్దాల్సిన అవసరం ప్రస్తుతం మన పై ఉందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రివ్యూ లకు జిల్లా అధికారులు మాత్రమే ఆహ్వానించాలని, కింది స్థాయిలో ఫీల్డ్ అధికారులను డిస్టర్బ్ చేయవద్దని అన్నారు. 

జిల్లాల పరిధి తగ్గిపోయిందని కలెక్టర్లు మరింత క్షేత్ర స్థాయిలో పనిచేసే అవకాశం లభించిందని దీనిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, పాలనపై దృష్టి సారించి మంచి ఫలితాలను సాధించాలని అన్నారు.

*ఐటి పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ,*  రాబోయే 3.5 సంవత్సరాల వ్యవధిలో సాచురేషన్ పద్దతిలో నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న నిరుపేదల జాబితాను కలెక్టర్ లకు అందిస్తే ఇందిరమ్మ కమిటీ లో ద్వారా స్క్రూటినీ చేయించి, అర్హులైన నిరు పేదలైతే పార్టీలకతీతంగా తప్పనిసరిగా మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.  వరికంటే రెండింతల ఆదాయం వచ్చే పంటలను రైతులకు సూచించాలని,  రైతులను ఒప్పిస్తూ కూరగాయల పంట విస్తరణ చేయాలని అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు.

విద్యా, వైద్యం, వ్యవసాయం ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.  ఉపాధ్యాయులకు అవసరమైన బోధన శిక్షణ కూడా అందించడం జరుగుతుందని అన్నారు. IMG-20250622-WA0026

బడి బాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గోన్నాలని, ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థుల నమోదు సంఖ్య పెంచాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాల కల్పన పట్ల స్థానిక ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులతో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలో రివ్యూ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. 
కరీంనగర్ లో ఉన్న జ్యోతి బా పూలే  గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించి అక్కడ పరిస్థితుల పై నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు. 

**మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,*  9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలిపారు.  రైతులు పూర్తిస్థాయిలో కాకపోయినా తమకు ఉన్న పొలంలో కొంతమేర వరి నుంచి ఆయిల్ పామ్ వంటి పంటలకు విస్తరించాలని అన్నారు. మొదటి మూడు సంవత్సరాలు అంతర్ పంటల ద్వారా ఆదాయం వస్తుందని, పెద్ద రైతులను గుర్తించి వారిచే ముందు కన్వెర్ట్ చేయాలని అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక గుంట భూమి కూడా పడావు పడకుండా వ్యవసాయ సాగు జరగాలని అన్నారు.  వరి మాత్రమే కాకుండా క్యాష్ క్రాప్స్, హార్టికల్చర్ పంటలను  పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అన్నారు. 

బడి బాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెంచాలని అన్నారు.  విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తుల మొదటి రోజులోనే పంపిణీ చేయాలని అన్నారు.  రాజకీయాల కతీతంగా గ్రామం మొత్తం ఐక్యంగా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచేందుకు కృషి చేయాలని అన్నారు.

పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయాలని, ఎక్కడ అనర్హులకు ఇండ్లు రావద్దని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నామని, పేదలకు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల  రుణాలు అందించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభమయ్యేలా చూస్తున్నామని అన్నారు. 
 
**ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,*  మొదటి ఏడాది 62 వేల కోట్ల రూపాయల రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు.  ఎరువుల కొరత ఎక్కడా లేదని, ప్రతి మండలం వద్ద అవసరమైన స్టాక్ అందుబాటులో పెడ్తున్నామని అన్నారు.  రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశామని, రైతు భరోసా నిధులు కూడా రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయని అన్నారు. 

వేములవాడ లో సూరమ్మ ప్రాజెక్టు, శ్రీపాద నారాయణ పురం ప్రాజెక్టు అవసరమైన భూ సేకరణ చేసేందుకు నిధులు విడుదల చేయాలని అన్నారు. 

*కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ,*  భారత దేశం అవసరాల కోసం పెద్ద ఎత్తున ఎడిబుల్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని, దీనిని తగ్గించేందుకు ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణ ప్రోత్సహించడం చాలా మంచి పరిణామమని అన్నారు. 

ప్రతి రైతుకు వరి పంట సాగు చేయడం వల్ల సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది, ఆయిల్ పామ్ పంటతో ఎంత ఆదాయం వస్తుందో స్పష్టంగా తేడా తెలిసేలా అధికారులు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. తాను వేసిన 48 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట నేడు చాలా బాగా దిగుబడి వస్తుందని ‌ అన్నారు.ఆయిల్ పామ్ సాగు కట్టింగ్ కు నైపుణ్య శిక్షణ పెంచాలని, ఆయిల్ పామ్ కంపెనీలను స్థానికంగా చిగురు మామిడిలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. 

 కరీంనగర్లో  గతంలో సీఎం స్పెషల్ ఫండ్ క్రింద 350 కోట్ల నిధులతో 120 రోడ్ల నిర్మాణ పనులు స్టార్ట్ చేశామని, గత ఏడాదిన్నర కాలంగా ఆ పనులు ఆగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని, ఉమ్మడి కరీంనగర్ ఇంచార్జి మంత్రి వర్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ రోడ్ల పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కేబుల్ బ్రిడ్జి డైనమిక్ లైటింగ్ వ్యవస్థ పని తీరు పర్యవేక్షించాలని అన్నారు. 

*జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ,*. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. జగిత్యాల జిల్లాలో అధిక మొత్తంలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, ఆయిల్ ఫామ్ పంటకు ధర పెంచేలా చూడాలని అన్నారు. 

**కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ,*  ఇందిరమ్మ ఇండ్లను పేదలకు త్వరితగతిన మంజూరు చేయాలని అన్నారు.  విద్యార్థుల నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అన్నారు.  మెట్టపల్లి హై స్కూల్ శిథిలావస్థలో ఉందని, పక్కన ఉన్న జూనియర్ కళాశాల భవనం 80% పూర్తయిందని, దానిని వేగవంతంగా పూర్తి చేసి ఈ పిల్లలను ఆ భవనానికి తరలించాలని అన్నారు. 
మెట్టపల్లి ప్రాంతంలో ఉర్దూ ప్రభుత్వ పాఠశాల పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని కోరారు.

**పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ,*   రైతులకు వ్యవసాయ సాగు పై గ్రామాలలో సదస్సులు పెట్టి అవసరమైన సలహాలు, సూచనలు ఆదర్శ రైతులు, శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కల్పించామని అన్నారు.  పంట మార్పిడి విధానం పట్ల విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.  గత 5 సంవత్సరాల కాలంలో చాలా మంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి పంట తగ్గిపోతుందని, వరి సాగు విపరీతంగా పెరుగుతుందని అన్నారు. 

గ్రామాలలో శాస్త్రవేత్తలను పంపి రైతులను చైతన్యవంతం చేయాలని, వివిధ రకాల పంటల సాగు, భూ సారం పెంచడం, తప్పుడు పద్దతుల వల్ల కలిగే నష్టాల పట్ల రెగ్యులర్ గా అవగాహన కల్పించాలని అన్నారు. 

**రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ,* తమ ప్రాంతంలో చేపట్టిన ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం వల్ల అంతర్గం పాలకుర్తి మండలాలు తొలిసారి సాగునీరు వచ్చిందని అన్నారు. గతం కంటే రైతులకు రెండింతల పంట పండిస్తున్నారని, పూర్తి స్థాయిలో గానే మద్దతు ధరతో కొనుగోలు చేశామని, రైతులకు రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ జరిగిందని అన్నారు. 

విద్యారంగంలో మంచి అభివృద్ధి పెద్దపల్లి జిల్లాలో జరుగుతుందని, పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పన , నూతన ఉపాధ్యాయుల నియామకం జరిగిందని అన్నారు.  సింగరేణి ప్రాంతంలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ పై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అన్నారు.  సింగరేణి, ఎన్టిపిసి, ఆర్.ఎఫ్.సి.ఎల్ , కేశోరాం సిమెంట్ వంటి సంస్థల డి.ఎం.ఎఫ్.టి నిధులు జిల్లాకు రావడం లేదని అన్నారు.

సింగరేణి, ఎన్టిపిసి యాజమాన్యాల ద్వారా రామగుండం మంథని ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు మౌలిక వస్తువుల కల్పన, అదనపు ఉపాధ్యాయుల ఏర్పాటు చేయాలని అన్నారు. 

*మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ,*   పాఠశాలలోని విద్యార్థులకు చదవడం రాయడం, సామాన్య గణితం వంటి విద్యా ప్రమాణాలు వచ్చే విధంగా చూడాలని అన్నారు. వృత్తి విద్యా కోర్సుల ద్వారా యువతను ప్రయోజకులను చేసేందుకు తమ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ని స్థాపిస్తున్న విషయం గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యలో బడి మానేసిన పిల్లలకు దృష్టి పెట్టాలని, ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.

**చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ,* 9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేయడం వల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు.  శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు క్రింద నారాయణ పురం రిజర్వాయర్ క్రింద 43 కోట్లు భూ సేకరణ కోసం పెండింగ్ ఉందని, వీటిని  విడుదల చేస్తే  చొప్పదండి, వేములవాడ ప్రాంతానికి ఉపయోగపడుతుందని అన్నారు.

చొప్పదండి ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికుల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలని,  గంగాధర మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతనంగా మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. నాణ్యతతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలలలో అందేలా చూడాలని అన్నారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు  జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు...
Read More...
Crime  State News 

విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్

విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్ వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన...
Read More...
Local News 

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం...
Read More...
Local News 

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు): సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.  తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా...
Read More...
Local News 

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్‌ రమేష్‌ 

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్‌ రమేష్‌     సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు): టీఎన్‌జీవో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్‌ పల్లాటి రమేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  టీఎన్‌జీవో యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో  సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం  సికింద్రాబాద్,  ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):  హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ...
Read More...
Local News 

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000...
Read More...
National  Filmi News 

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది. ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల...
Read More...
Crime 

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు   గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో...
Read More...
Local News 

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు  సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర...
Read More...
Local News 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు  జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)  పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు. మహాత్మ జ్యోతిరావు పూలే  ఆశయాలు భారత సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, సామాజిక సంస్కరణల మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన ఆలోచనలు చాలా ముందుచూపుతో కూడినవిఅన్నారు.     ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి
Read More...
Local News 

కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)  ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం.. జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్..   రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ...
Read More...