ధర్మపురిలో కాంగ్రెస్లో చేరికలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో బీఆర్ఎస్ నేతల పార్టీలో చేరిక
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్నతో పాటు మాజీ కౌన్సిలర్లు
ధర్మపురి, జనవరి 15 (ప్రజా మంటలు):
ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్మపురి పట్టణ మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్నతో పాటు మాజీ కౌన్సిలర్లు మయూరి వేణు, యూనుస్, సాంబు, స్తంభంకాడి రమేష్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాప్రయోజన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నామని అన్నారు. నూతనంగా పార్టీలో చేరిన వారితో పాటు పార్టీలోని సీనియర్ నాయకులందరినీ సమన్వయం చేస్తూ ప్రతి కార్యకర్త గౌరవాన్ని కాపాడుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో నేరుగా మార్పు తీసుకొచ్చేలా పలు చారిత్రక నిర్ణయాలు తీసుకుందని మంత్రి తెలిపారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు కొత్త రేషన్ కార్డులు, రైతులకు రైతు భరోసా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన వంటి పథకాలు ప్రజల్లో విశేష స్పందన పొందుతున్నాయని పేర్కొన్నారు.
అలాగే రాజీవ్ యువ వికాసం, చేయూత, ఆసరా పెన్షన్ల పునరుద్ధరణ, కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్, గృహ లక్ష్మి, అన్నపూర్ణ పథకాల ద్వారా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. విద్య, ఉపాధి రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని రెండేళ్లలో సుమారు 59 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ నియామకాలను పారదర్శకంగా నిర్వహించిందని చెప్పారు.
ధర్మపురి నియోజకవర్గంలో లక్ష్మీ నరసింహ సంస్కృత–ఆంధ్ర కళాశాల పునఃప్రారంభం, ఎల్లంపల్లి ముంపు బాధితులకు మిగిలిన రూ.18 కోట్ల పరిహారం పంపిణీ, మంజూరైన డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాలు, గోదావరి సివరేజ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వివరించారు.
ఈ నెల 20న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధర్మపురి మండలానికి రానున్నారని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ధర్మపురి నియోజకవర్గంలో స్పష్టమైన అభివృద్ధి ప్రజలకు కనబడేలా పనిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 2027లో జరిగే ధర్మపురి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
Epstein Files వివాదం: పార్లమెంట్లో రాహుల్ ఆరోపణలు – మంత్రి హర్దీప్ సింగ్ స్పందన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
పార్లమెంట్లో బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ “Epstein files” అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ మరియు ప్రధాని నరేంద్ర మోదీ పేర్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి... మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ప్రధాన పుణ్యక్షేత్రాలకు భారీగా బస్సులు కేటాయించారు.... ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు వలసవాదులకు మధ్య ప్రస్తుత ఎన్నికలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి
జగిత్యాల పట్టణంలో 23 వార్డులో ఎస్ కె ఎన్ ఆర్ గౌట్ జూనియర్ బాయ్స్ కాలేజీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు.
అనంతరం... రేపే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ – బాగ్ లింగంపల్లిలో నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఫిబ్రవరి 12న (గురువారం) ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించనున్నారు. వివిధ ఉద్యమ సంఘాల నాయకులు, తెలంగాణ... జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగింపు
జగిత్యాల, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
జగిత్యాల మున్సిపాలిటీ వివరాలు
మొత్తం వార్డులు: 50
ఓటర్లు: 94,800
అభ్యర్థులు: 254
పోలింగ్ కేంద్రాలు: 149
పోలింగ్ సిబ్బంది: 745... ఘనంగా శ్రీ వాణి జూనియర్ కళాశాల ఫేర్వెల్ వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణము లోని శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గత విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.... మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు)ఎన్నికలు నిర్వహణకు 900 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు,సిబ్బందితో... దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10:
ఈ సాయంత్రం దేశవ్యాప్తంగా UPI ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. సుమారు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో డబ్బు పంపడం, QR కోడ్ స్కాన్ చేయడం వంటి UPI లావాదేవీలు పనిచేయలేదు.
గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి ప్రధాన చెల్లింపు యాప్లలో సమస్య తలెత్తడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు... జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం
జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 50 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు ముగ్గురు ఇతర పోలింగ్ అధికారులను... ధర్మపురిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి – మంత్రి లక్ష్మణ్ కుమార్కు కొప్పుల ఈశ్వర్ సవాల్
జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):
మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ, ధర్మపురిలో జరిగిన అభివృద్ధి కళ్లకు కనిపించకపోతే తాను ఏం చేయలేనన్నారు.
ధర్మపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ఒకటని,... జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్లో పత్రికా స్వేచ్ఛ క్షీణత
హాంకాంగ్ ఫిబ్రవరి 10:చైనా ప్రభుత్వానికి తీవ్ర విమర్శకుడిగా పేరుగాంచిన, హాంకాంగ్కు చెందిన ప్రజాస్వామ్య అనుకూల మీడియా వ్యాపారవేత్త జిమ్మీ లైకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు హాంకాంగ్లో పత్రికా స్వేచ్ఛ తీవ్రంగా క్షీణిస్తున్నదన్న ఆందోళనలకు మరింత బలం చేకూర్చింది.
యాపిల్ డైలీ పత్రిక వ్యవస్థాపకుడైన జిమ్మీ లై, బీజింగ్... మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమైందని తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నీరు, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ప్రెస్మీట్లో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే... 