కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం_ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటేయాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల జనవరి 4( ప్రజా మంటలు)
స్థానిక సంస్థల్లో ఆదిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటాయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, డీ సీ సీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ప్రత్యేక ఆహ్వానితులు వెంకట స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.
1987 నుండి 2019 మినహా జగిత్యాల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండావేగురవేసినం అన్నారు.
బీ ఆర్ ఎస్ పాలనలో ఐదేళ్ల మున్సిపల్ పాలనలో 16 మంది కమిషనర్లు మార్చిన బీ ఆర్ ఎస్ ఘనత. ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు
ఎనిమిది మంది అధికారులు జైలు పాలయ్యారు. బీ ఆర్ ఎస్ పాలనకు అద్దం పట్టింది.
కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆదర్శంగా నిలిచింది.
నిత్యం త్రాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు.
వై ఎస్ పాలనలో జగిత్యాలలో కేవలం 200 కే ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చినాము అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అంగడి చిట్టి లేని ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అని తెలిపారు.
వేలాదిమంది నిరుపేదలు ఆర్థిక భారం లేకుండా అంగడి చిట్టి రద్దు చేసినం అన్నారు.
పాత బస్టాండ్, అంగడి బజార్,టౌన్ హాల్ గదులు నిర్మించి, ఏటా రెండు కోట్ల ఆదాయం సమకూర్చినం అన్నారు.
దళితులకు సామూహిక భవనాల కోసం
ఆత్మ గౌరవం నిలబెట్టేలా స్థలాలు కేటాయించినం.
దగ్గులమ్మ గుడి ప్రత్యేక స్థలం కేటాయించి, అభివృద్ధికి తోడ్పడినం.
గంగపుత్రుల కోసం కొత్త బస్టాండ్ వద్ద చేపల విక్రయ కేంద్రం ఏర్పాటు చేసినం.
అన్నపూర్ణ చౌరస్తాలో కూడా చేపల విక్రయ కేంద్రం ఏర్పాటు చేసినం..
బస్తీ దవాఖానాలు 20 ఏళ్ల క్రితం గాంధీ నగర్, ఖిల్లా గడ్డ, మిషన్ కాంపౌండ్ వద్ద అర్బన్ దవాఖాన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు
కటిక సోదరులకు చింతకుంట వద్ద స్లాటర్ హౌస్ ఏర్పాటు చేసినం అన్నారు.
బీఆర్ ఎస్ పాలనలో
పదేళ్లు నిద్ర పోయి.. జేబు నింపుకున్నారు.
అభివృద్ధి అంటే నాయకుల జేబులు నింపేందుకు కాదనీ
జగిత్యాల మున్సిపాలిటీపై గౌరీ శంకర్ కు మున్సిపల్ పవర్ ఆఫ్ ఆటార్ని రాసి ఇచ్చారా అని ప్రశ్నించారు.
మున్సిపల్ పనులు ఎవరు చేస్తున్నారు..
గౌరీ శంకర్ కన్స్ట్రక్షన్ మినహా ఎవరు చేయవద్దు..అన్న రీతిలో వ్యవహరిస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గౌరీ శంకర్ చెప్పినట్టు చేయకపోతే బదిలీలు.. ఇది జగిత్యాల మున్సిపల్ లో ధైన్య పరిస్థితి.
ఎన్నడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టని వారు
అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదు..
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలకు
స్వయం ప్రతిపత్తి కల్పించారు.
మున్సిపల్ పై పాలక మండలి కి ఉండాలి..
ఎమ్మెల్యేలకు కాదు... సలహాదారులుగా మాత్రమే ఉండాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు నిధులు కేటాయించడం ఇప్పుడు కొత్త కాదు.
పనులు చేపట్టడం పై పాలక మండలి ఆధిపత్యం ఉండాలి..
కాంగ్రెస్ పార్టీ పాలనలో పాలక మండలికి స్వేచ్ఛ నీచ్చినం.
ఆరు సార్లు ఎమ్మెల్యేగా నేను ఏనాడు పాలక మండలి లో జోక్యం చేసుకోలేదనీ గుర్తు చేశారు.
మున్సిపల్ ఛైర్పర్సన్ స్వతంత్ర్యం గా వ్యవహరించాలి.
యావర్ రోడ్డు విస్తరణ.. 1994 లో ఎన్నికలకు ముందు.. నా బాధ్యత నిర్వహించాలని అందరిని ఒప్పించి, మెప్పించి 60 ఫీట్లు విస్తరించిన అన్నారు
యావర్ రోడ్డు అక్రమ నిర్మాణాలు..అనుమతులకు భిన్నంగా నిర్మించుకున్న భవనాలు తొలగించమంటే.. పట్టించుకోవడంలేదు అని తెలిపారు.
కొత్త బస్టాండ్ వద్ద కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా నిర్మించినవి తొలగించడంలో నోరుమేదపడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యా నగర్ ఆలయ భూమిని ఆక్రమణలకు గురి అవుతుంటే అడ్డుకుని, కాపాడిన.
ధరూర్ లో
జై శ్రీరామ్..జై హనుమాన్ అంటూ నినాదించి,
కోదండ రామాలయం భూములు కాపాడినామన్నారు.
నాటి నుండి నేటి వరకు ధర్మానికి కట్టుబడి ఉన్నా..
ఎవరైనా రాజ్యంగ నిబంధనలు గౌరవించాలి
కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదు.అని హెచ్చరించారు.
జేబు నింపుకోవాలి తాపత్రాయపడే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త..
పదేళ్లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొట్లాడినాము.
రాజకీయం..పదవి అంటే సేవ చేయాలని కోరుకుంటున్నాం.. మీ లాగ జేబులు నింపుకుంటలేము పరోక్షంగా ఎమ్మెల్యేకు చురక అంటించారు
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియదు..
మున్సిపల్ ఎన్నికల్లో
టిక్కెట్లు పంచుకోవటానికి నీ సొత్తు కాదు.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కు.
టార్గెట్ 50..మున్సిపల్ లో 50 స్థానాల్లో గెలిచి, మున్సిపల్ పై జెండా ఎగుర వేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు
నేను ప్రజా జీవితంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం పోరాటం చేస్తానన్నారు.
శ్రీరాముడు ధర్మానికి కట్టుబడి..రావణాసురుడిని సంహరించాడు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చదువుకో.. 10 షెడ్యూలు లో ఏం ఉందో..చదువుకోవాలి..
అన్ని మతాలు గౌరవించడం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత.
ఇందిరా గాంధీ చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతా అన్నారు..
నేను చివరి శ్వాస వరకు కార్యకర్తల హక్కుల కోసం పోరాడుతా..
ధర్మానికి కట్టుబడి ఉండే వారికి మంచి రోజులు వస్తాయన్నారు.
నాకు మీరు అండ.. నేను మీకు అండ.. మనకు కాంగ్రెస్ జెండా అండ...అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
జగిత్యాల మున్సిపల్ అభివృద్ధి పై ఏ చర్చ. కైనా సిద్ధం..
మీ లాగా జేబులు నింపుకోవడం కోవడం..
ప్రజా సేవ ముఖ్యం..ప్రజల హక్కులు కాపాడుతాం..ప్రజా సంక్షేమానికి కృషి చేస్తాం
నూకపల్లి అర్బన హౌసింగ్ ఏ టీమ్ అయింది.
జగిత్యాల పట్టణ నిరుపేదల కోసం 4000 ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తే, డబుల్ బెడ్రూం తెర పైకి తీసుకు వచ్చినారు.
నూకపల్లి డబుల్ బెడ్రూం లో మౌలిక వసతుల సదుపాయాల కొరతన..ఎందుకు చేరడం లేదు..
వార్డు పునర్విభజన పై సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు వెంకట్ స్వామి మాట్లాడుతూ.
నిజమైన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు
వలస వచ్చిన వారు.. ఎంజాయ్ చేస్తున్నారు.
తప్పుడు సమాచారం తో వలసలు..
రాజ్యంగ విరుద్ధమైనవి మేము సమర్థించడం లేదు..
కాంగ్రెస్ పార్టీ కోసం జీవన్ రెడ్డి పోరాటం చేస్తున్నారన్నారు
రాహుల్ గాంధీ కోసం
పని చేస్తున్నారన్నారు
పార్టీ ఏదైనా ఆయారం.. గయరాంతో నడవదు..
జీవన్ రెడ్డి వంటి వాళ్ళతో పార్టీ బతుకుతది అన్నారు.
నిజంగా జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయాలి.. కష్ట కాలం లో పార్టీని కాపాడారు..
పదేళ్ల బీ ఆర్ ఎస్ పాలనలో చేయని ఒత్తిడి
లేదు..
సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు.
ఒత్తిడికి తలవంచితే జీవన్ మినిస్టర్ గా ఉండేవాడు..
జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడి ఉంటారు..
నిజమైన కార్యకర్తలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక నాయకులు, కార్యకర్తల వల్లే స్థానిక సంస్థల్లో గెలుపొందారు.
మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల మాదిరిగా విజయం సాధించడం అంత సులువు కాదు..
గాంధీ భవన్ ఎదుట కూర్చొని, నిజమైన కార్యకర్తల కోసం కోట్లాడుతా..
తెలంగాణ కోసం తెగించి కోట్లడిన్నం..అదే విధముగా మున్సిపల్ ఎన్నికల్లో తెగించి కొట్లాడి జగిత్యాల లో కాంగ్రెసు పార్టీ జెండా ఎగుర వేయాలి..
ప్రతి వార్డులో గెలిచి, జగిత్యాలలో జెండా ఎగుర వేయాలి..
పిసిసి దగ్గర జగిత్యాల జిల్లా పరిస్థితులు వివరిస్తాను.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించినవారు జీవన్ రెడ్డి ఒక్కరే.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి, రెండు ఇల్లు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నామా..అధికారంలో ఉన్నామా.. ఎక్కడా ఉన్నామో తెలియనీ పరిస్థితి ఉంది.
నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి తో ఉన్నా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కస్టపడి పనిచేసి, గెలిపించారు.
న్యాయం పక్షనా..నిజమైన కార్యకర్తల పక్షాన నిలబడి..కలబడుతా..అని వేంకట స్వామి ఉద్ఘాటించారు.
జీవన్ రెడ్డి మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాం.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య మాట్లాడుతూ..
కలిసికట్టుగా కృషి చేసి, జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగుర వేయాలి..
జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేసేలా కృషి చేస్తానని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొండగట్టు క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు
కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ముందుగా బేతాళ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకున్నారు. టెంకాయ మొక్కులు చెల్లించి తమ... మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు
కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు)
బొజ్జనపెల్లి గణేష్ కొండగట్టు
కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.... మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు
కొండగట్టు జనవరి 6 ( ప్రజా మంటలు)బొజ్జన పెల్లి గణేష్ (కొండగట్టు)
కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన... ప్రపంచ తెలుగు మహాసభల్లో జగిత్యాల వాసి సముద్రాల రాములు కు అరుదైన గౌరవం
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు( అమరావతి) లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో భారతదేశ వ్యాప్తంగా ఎంపికైన 120 మంది గాయని గాయకులలో జగిత్యాల వాసి సముద్రాల రాములు ఒకరిగా ఎంపికయ్యారు.
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సెక్రటరీ చెల్లాపురం శ్రీకాంత్ సముద్రాల రాములు గూర్చి మాట్లాడుతూ... నోడల్ అధికారులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)
జిల్లాలోని 5 మున్సిపల్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కొరకు భాగంగా నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ తో కలిసి... శ్రీ జంబి హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా, లలితా చాలీసా పారాయణం
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)శ్రీ జంబి హనుమాన్ ఆలయంలో మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం, లలితా చాలీసా పారాయణం సామూహికంగా భక్తులచే సాయంత్రం 7 గంటల నుండి సామూహిక పారాయణం కొనసాగింది.
.అనంతరం మంగళహారతి, మంత్రపుష్పం ,తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి నామస్మరణతో... మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం
జగిత్యాల డిసెంబర్ 5 ( ప్రజా మంటలు)ఇటీవల జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఎన్నికైన నూతన కార్యవర్గం సభ్యులు సోమవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు.
ఈ సందర్బంగా నూతన కార్యవర్గానికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలుపుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియా అని... కొండగట్టు గిరిప్రదక్షిణ కొరకు రోడ్డు పరిశీలన అరుణాచలం, సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రణాళిక రూపకల్పన - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
మల్యాల జనవరి 5 (ప్రజామంటలు)ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో భక్తులు గిరిప్రదక్షిణ చేయడానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సోమవారం కొండగట్టు లోని రోడ్డు మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... అగ్రవర్ణ పేదలకు సంక్షేమ పథకాలు అందజేయాలి జనాభా ప్రాతిపధికన రిజర్వేషన్లు కల్పించాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారిలో అలసత్వం వద్దు ప్రజావాణిలో కలెక్టర్ కు ఓసి జేఏసీ నాయకుల వినతి
జగిత్యాల జనవరి 5 (ప్రజా మంటలు)అగ్ర వర్ణాలోని పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలనీ ఓసి జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్కు ఓ.సి.జెఏసీ నాయకులు ఓ.సి వర్గాలకు సంబంధించిన పలు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని సోమవారం ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు
ఈనెల... రోడ్డు భద్రతే జీవన రక్షణ విద్యార్థులే మార్పుకు దూతలు సూర్య గ్లోబల్ పాఠశాలలో రోడ్డు భద్రత పై అవగాహన జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్
జగిత్యాల జనవరి 5 ( ప్రజా మంటలు)
రోడ్డు భద్రతే జీవన రక్షణ విద్యార్థులే మార్పుకు దూతలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు రవాణా భద్రత గూర్చి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న రవాణా... కొండగట్టుఆంజనేయ స్వామి ఆలయంలో, జిల్లా కేంద్రంలో పలు ఆలయాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పూజలు
జగిత్యాల/మల్యాల జనవరి 5 (ప్రజా మంటలు)
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి వారి కుటుంబ సమేతాన దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి
జగిత్యాల పట్టణంలోని జాంబిగద్దె సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయంలో కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
ఈ... నిషేధిత చైనా మాంజా ను అమ్మిన, వినియోగించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు* జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 5 ( ప్రజా మంటలు)జిల్లా పరిధిలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు.
జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైనా మంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు.చైనా మాంజా తో... 