తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి

అలిశెట్టి  ప్రభాకర్ జన్మదినం 12, జనవరి

On
తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి

తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి అలిశెట్టి  ప్రభాకర్ జన్మదినం 12, జనవరి

IMG_20240111_221643

-సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339.

తెలుగు సాహిత్యంలో అజరామరమైన నూతన సాహిత్య విలువలను, సామాన్యుని గొంతుకను బలంగా వినిపించిన మహనీయుడు, ప్రజల మనిషిగా, జీవితాన్నే సాహిత్యానికి అంకితం చేసిన చిరుకవితల కవి, మరణించి మూడు దశాబ్దాలయినా, నేటికీ వినబడుతూనే ఉంది. కవిత్వం గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా, ఆయన పేరు లేకుండా కవిత్వంపై ప్రసంగం చేయలేని విధంగా, కవిత్వంలో తన ముద్ర వేసిన అతి సామాన్యుడు. ఆయన పేరు వినిపించినంతగా, ఈ శతాబ్దంలోని ఏ కవి పేరుకాని, ఆయన కవితలు కానీ చర్చల్లో కానీ, ఉదాహరణలో కానీ పేర్కొన్న కవి మరొకరు లేరంటే, కవితలుకానీ  లేవంటే అతిశయోక్తి కాదు.

ఆడంభరాలకు, సన్మానాలకు, సభలకు, అవార్డులకు అర్రులు చాచకుండా, తన కాలం, కుంచె ఎప్పటికీ అత్తాడుగువర్గాల ప్రజలు, అణచివేతకు గురైన శ్రామికుల వెన్నంటే ఉంటుందని ఆచారణతో సహాయ ప్రకటించిన అనన్య ప్రతిభావంతుడు అలిశెట్టి. పేరులోన ప్రభాకరున్నీ ఉంచుకోవాడమే కాకుండా, ఆ ప్రభాకరునిలోని  భాస్వర స్వభావ లక్షణాలను పునికి పుచ్చుకొని, తన రక్తాన్నే సిరాగా మార్చుకొని,  సమాజంలోని అసంబద్ద సంప్రదాయాలను, కట్టుబాట్లను, రాజకీయాల్లోని కుళ్లును తన అక్షర యజ్ఞంతో  దహించి వేసే ప్రయత్నం చేసిన అనల్పజీవి అలిశెట్టి ప్రభాకర్ . 

తన కంటూ ఏమి మిగుల్చుకోవాలనే ఆశలు లేకుండా, తన చుట్టూ ఉన్న పేదల బతుకుల పట్ల ఈ సామాజిక, రాజకీయ వ్యవస్థ, తరతరాలుగా వ్యవహరిస్తున్న తీరును తన ప్రతి కవితలో  నిశితంగా విమర్శించారు. అది రాజకీయ నాయకుడైనా, సమాజంలోని ఇతర పెద్దలైనా, మనిషి సృష్టించాడాని చెప్పుకొనే దేవుడైనా ఒకే రీతిలో వ్యవహరిస్తున్నారంటూ, సమాజం తనకు తానుగా మేలుకొంటే తప్ప, ఈ సమాజంలోని బడుగుల బతుకులు బాగుపడవని హెచ్చరించారు.

స్త్రీల పట్ల సమాజ వైఖరిని కూడా నిశితంగా ఖండిస్తూ, మహిళలను ఈ సమాజం ఆటవస్తువుగా, అంగడి బొమ్మలా వాడుకొంటున్నారని ఘోషించాడు. రాజ్యాంగాలు మారినా, ప్రభుత్వాలు మారినా, నేటికీ స్త్రీల పట్ల ఈ సమాజం ఇంకా ఆటవిక యుగం నాటి దృక్పథంతోనే ఉందని, స్త్రీని పురుషుడు తన అవసరాలకు అనుగుణంగా మలుచుకొని, తన లోని రాక్షసత్వానికి ప్రతీకగా చూస్తున్నారని ప్రకటించాడు. “విషాద సాక్షాత్కారం” శీర్షికన రాసిన దీర్ఘ కవితలో స్త్రీల బాధలను వివరంగా ప్రశ్నించారు.

“కన్నీళ్లని ఏ భాషలోకి అనువాదించినా

విషాదం మూర్తీభవించిన స్త్రీయే

సాక్షాత్కరిస్తుంది” అని సిద్ధాంతీకరించారు.

ఇందులోనే “నాజీల అహం/నగ్నంగా స్త్రీలని ఊరేగించినా/ ఊచకోత జ్ఞాపకాల్లోంచీ/నాగరికత బ్లూఫిల్మై /బుసకొట్టే కామాకేళీ చిత్రాల్నుంచీ/ కన్నీళ్ళు ధారాపాతంగా ప్రవహించి / ఘనీభవించే వుంటాయ్” అంటూ మానవ జాతి చరిత్రలో ఎన్నియుగాలు మారినా, ఎంతమంది శాసనులు మారినా స్త్రీలు ఎదుర్కొన్న సమస్యలు మాత్రం రూపం మాయచుకొన్నాయే తప్ప వారికి స్వాతంత్ర్యం లభించలేదని పేర్కొంటూ, “ అశ్రు బిందువునించి/స్త్రీకినకా విముక్తి కాలగలేదంటే/నిజంగా కన్నీరు సముద్రమై/  నిజంగా కన్నీరు సముద్రమంత ఆవేశమై/ఉద్యమాల హోరెత్తితే గాని/ ఈ దోపిడీ దౌర్జన్యాల భూభాగాన్ని/ముంచెత్తాలేదని “స్పష్టంగా నేటి దుస్థితిని ప్రకటించారు. అందాల పోటీల గురించి రాస్తూ,    “అక్షరాన్నివివస్త్రని గావించి/ అమ్ముకొనే/ఆశలీషా సాహిత్యం నుంచీ .. కన్నీళ్ళు ప్రవహిస్తూనే వుంటాయ్” అంటూ ఆవేదన చెందారు. 

సాహిత్యకారులుగా, తెలుగు భాషకు తామే ప్రతినిధులుగా చెప్పుకొంటున్న కుహనా మేధావుల గురించి కూడా కుండబద్దలుకొట్టినట్లు తన  అంతరంగాన్ని వెల్లడించారు. సమసమాజం కొరకంటూ ప్రచారం చేసుకొంటూ, ప్రభుత్వ అవార్డులకొరకు తమవంతు కృషి చేసుకొంటూ, తమ రచనలలో తీవ్రంగా వ్యతిరేకించిన పెట్టుబడిదారు వర్గాన్ని, రాజ్యాన్ని, రాజ్యాధినేతలను ప్రసన్నం చేసుకోవడానికి, అవార్డులు పొందడానికి చేసిన శ్రమను నిరసిస్తూ, అవహేళన చేశారు. అలాంటి వారి గురించి “ అర్భకుడైన కవి ఒకడు/ అవార్డులూ / సన్మానల కోసం / దేబారించడం తప్ప/ నగరంలో నేడు/ అవాంఛనీయ/ సంఘటనలేవీ జరగలేదు” అని స్పష్టంగా వరి మనస్తత్వాన్ని, వరైకి ప్రజల పట్ల సమాజంపట్ల ఉన్నదంతా పైపై ప్రేమేనని చెప్పినట్లుగా, కవితలో చెప్పారు.

సమాజంలో సమానావకాశాలు లేక, చిటికి పోయిన బతుకులను చూసిచూసి విసిగిపోయిన ఆరోషంలో నుండి చూస్తూ, నా కవిత అనే శీర్షికతో రాసిన దాంట్లో “ నా గుప్పిట్లో / మండుతున్న/ ఎన్నో గుండెలు/ ఒక్కో దాన్లో/ దూరి/ వాటిని చీరి / రక్తాశ్రువులు ఏరి/ పరిశీలిస్తాను/ నేను” అంటూ తన సిద్ధాంతాన్ని, విధానాన్ని స్పష్టంగా తెలియజెప్పిన సామాన్య అక్షర యోధుడు అలిశెట్టికి అక్షరాంజలి.

Tags
Join WhatsApp

More News...

Local News 

వయోవృద్ధులకు టాస్కా ఆసరా

వయోవృద్ధులకు టాస్కా ఆసరా మూగ మహిళకు వస్త్రాలు,దుప్పట్లు అందిస్తున్న హరి ఆశోక్ కుమార్ అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 35వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం .   జగిత్యాల అక్టోబర్ 01 (ప్రజా మంటలు):    వయో వృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉందని,వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ...
Read More...
Local News 

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 2( ప్రజా మంటలు)జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలోని టవర్ సర్కిల్ లోని ధర్మస్థల్ లో కాషాయ ధ్వజనికి  ప్రత్యేక పూజలు నిర్వహించి కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించిన విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్.. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు....
Read More...
Local News 

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ 

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  జగిత్యాల అక్టోబర్ 2 ( ప్రజా మంటలు)మహాత్మాగాంధీ జయంతి వేడుకలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ  గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ... గాంధీజీ సూచించిన శాంతి, అహింస, సత్యం...
Read More...
Local News 

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం 

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం  జగిత్యాల అక్టోబర్ 1 ( ప్రజా మంటలు)  జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో కొలువై ఉన్న సనాతన దుర్గ దేవి మంటపం వద్ద సిరిసిల్ల వారి పూర్వీకుల నివాసంలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతుండగా బుధవారం మహర్నవమి ని పురస్కరించుకొని సాయంత్రం ప్రదోష పూజా అనంతరం నంబి వాసుదేవ ఆచార్యచే దేవీ భాగవత ప్రవచనామృతం...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి సికింద్రాబాద్,  అక్టోబర్ 02 (ప్రజా మంటలు):  గాంధీ మెడికల్ కళాశాలలో గురువారం గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర కాలేజీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ పేరుతో ఏర్పాటుచేసిన గాంధీ మెడికల్ కళాశాలను రాష్ట్రంలో అన్ని కళాశాలలో కంటే అత్యున్నతమైన వైద్య ప్రమాణాలు అందించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు...
Read More...
Local News  Spiritual   State News 

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు   ,(రామ కిష్టయ్య సంగన భట్ల 944059549 'శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశినీ, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ' ...భారత, రామాయణాది పౌరాణిక గాధలలో శమీ వృక్షానికి విశేష ప్రాధాన్యత కల్పించ బడింది. శమీకే అపరాజిత అనిపేరు. అంటే ఓటమి నెరుగని మాతయని అర్థం. అమెయే విజయ నామాంకితయైన జగజ్జనని. శరన్నవరాత్రి వేడుక లలో...
Read More...
Local News  Spiritual  

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు.. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పూజలు సికింద్రాబాద్, అక్టోబర్ 01 (ప్రజామంటలు): బల్కంపేట శ్రీఎల్లమ్మ, శ్రీపొచమ్మ దేవస్తానంలో దేవి నవరాత్రోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పదవరోజు అమ్మవారు శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.  బుధవారం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే.శివసేనా రెడ్డి, మాజీ...
Read More...
Local News  Spiritual  

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు   - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు   - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం హాజరైన ఎండోమెంట్ కమిషనర్ శైలజా రామయ్యర్ సికింద్రాబాద్, అక్టోబర్ 01 (ప్రజామంటలు) ::దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో బుధవారం మహా‌నవమి సంధర్బంగా చండీహోమం, పూర్ణాహుతి హోమం నిర్వహించారు. పూర్ణాహుతి హోమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ,దేవాదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, ఫౌండర్...
Read More...
Local News 

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి జగిత్యాల అక్టోబర్ 1(ప్రజా మంటలు)   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పాఠశాల విద్యకి పెద్ద ప్రోత్సాహని అందించిందన్నారు. తెలంగాణకు ఈ సహకారం అందించినందుకు  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ జి కి, కేంద్ర విద్యాశాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ జి కి మరియు కేంద్ర విశ్వవిద్యాలయం జగిత్యాల(చలిగల్) లో ఏర్పాటు...
Read More...
Local News 

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు. 33 జిల్లాల్లో వాసవి క్లబ్ సేవ కార్యక్రమాలు బేష్    రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి    జింఖానా గ్రౌండ్ లో వాసవి క్లబ్ ఫౌండేషన్ డే    డ్రగ్స్ కు వ్యతిరేకంగా  గాల్లోకి లక్ష బెలూన్స్.. సికింద్రాబాద్, అక్టోబర్ 01 (ప్రజామంటలు) : ప్రపంచంలో చాలా మంది బిజినెస్  మెన్స్ ఛారిటీ చేస్తారని, ఛారిటీ చేసే వారు...
Read More...
Crime  State News 

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ అక్టోబర్ 01 (ప్రజా మంటలు) ఏ లక్ష్యంలో నన్ను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తామని. డీజీపీ గా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి శివధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఉదయం 9.45 గంటలకు నూతన డీజీపీ గా బాధ్యతలు స్వీకరించిన  శివధర్ రెడ్డి, తర్వాత పత్రికలతో మాట్లాడారు.శివధర్ రెడ్డి మాట్లాడుతూ.... లోకల్ బాడీ ఎన్నికలు...
Read More...
National 

ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!

ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే! న్యూ ఢిల్లీ అక్టోబర్ 01 (ప్రజా మంటలు): కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే బుధవారం ఆసుపత్రిలో చేరారు.మల్లికార్జున ఖర్గే (83 సంవత్సరాలు) అనారోగ్యం కారణంగా ఈ ఉదయం బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ సమాచారాన్ని ధృవీకరిస్తూ, ఖర్గే కుమారుడు మరియు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇలా అన్నారు: "ఖర్గే...
Read More...