తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి
అలిశెట్టి ప్రభాకర్ జన్మదినం 12, జనవరి
తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి అలిశెట్టి ప్రభాకర్ జన్మదినం 12, జనవరి

-సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339.
తెలుగు సాహిత్యంలో అజరామరమైన నూతన సాహిత్య విలువలను, సామాన్యుని గొంతుకను బలంగా వినిపించిన మహనీయుడు, ప్రజల మనిషిగా, జీవితాన్నే సాహిత్యానికి అంకితం చేసిన చిరుకవితల కవి, మరణించి మూడు దశాబ్దాలయినా, నేటికీ వినబడుతూనే ఉంది. కవిత్వం గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా, ఆయన పేరు లేకుండా కవిత్వంపై ప్రసంగం చేయలేని విధంగా, కవిత్వంలో తన ముద్ర వేసిన అతి సామాన్యుడు. ఆయన పేరు వినిపించినంతగా, ఈ శతాబ్దంలోని ఏ కవి పేరుకాని, ఆయన కవితలు కానీ చర్చల్లో కానీ, ఉదాహరణలో కానీ పేర్కొన్న కవి మరొకరు లేరంటే, కవితలుకానీ లేవంటే అతిశయోక్తి కాదు.
ఆడంభరాలకు, సన్మానాలకు, సభలకు, అవార్డులకు అర్రులు చాచకుండా, తన కాలం, కుంచె ఎప్పటికీ అత్తాడుగువర్గాల ప్రజలు, అణచివేతకు గురైన శ్రామికుల వెన్నంటే ఉంటుందని ఆచారణతో సహాయ ప్రకటించిన అనన్య ప్రతిభావంతుడు అలిశెట్టి. పేరులోన ప్రభాకరున్నీ ఉంచుకోవాడమే కాకుండా, ఆ ప్రభాకరునిలోని భాస్వర స్వభావ లక్షణాలను పునికి పుచ్చుకొని, తన రక్తాన్నే సిరాగా మార్చుకొని, సమాజంలోని అసంబద్ద సంప్రదాయాలను, కట్టుబాట్లను, రాజకీయాల్లోని కుళ్లును తన అక్షర యజ్ఞంతో దహించి వేసే ప్రయత్నం చేసిన అనల్పజీవి అలిశెట్టి ప్రభాకర్ .
తన కంటూ ఏమి మిగుల్చుకోవాలనే ఆశలు లేకుండా, తన చుట్టూ ఉన్న పేదల బతుకుల పట్ల ఈ సామాజిక, రాజకీయ వ్యవస్థ, తరతరాలుగా వ్యవహరిస్తున్న తీరును తన ప్రతి కవితలో నిశితంగా విమర్శించారు. అది రాజకీయ నాయకుడైనా, సమాజంలోని ఇతర పెద్దలైనా, మనిషి సృష్టించాడాని చెప్పుకొనే దేవుడైనా ఒకే రీతిలో వ్యవహరిస్తున్నారంటూ, సమాజం తనకు తానుగా మేలుకొంటే తప్ప, ఈ సమాజంలోని బడుగుల బతుకులు బాగుపడవని హెచ్చరించారు.
స్త్రీల పట్ల సమాజ వైఖరిని కూడా నిశితంగా ఖండిస్తూ, మహిళలను ఈ సమాజం ఆటవస్తువుగా, అంగడి బొమ్మలా వాడుకొంటున్నారని ఘోషించాడు. రాజ్యాంగాలు మారినా, ప్రభుత్వాలు మారినా, నేటికీ స్త్రీల పట్ల ఈ సమాజం ఇంకా ఆటవిక యుగం నాటి దృక్పథంతోనే ఉందని, స్త్రీని పురుషుడు తన అవసరాలకు అనుగుణంగా మలుచుకొని, తన లోని రాక్షసత్వానికి ప్రతీకగా చూస్తున్నారని ప్రకటించాడు. “విషాద సాక్షాత్కారం” శీర్షికన రాసిన దీర్ఘ కవితలో స్త్రీల బాధలను వివరంగా ప్రశ్నించారు.
“కన్నీళ్లని ఏ భాషలోకి అనువాదించినా
విషాదం మూర్తీభవించిన స్త్రీయే
సాక్షాత్కరిస్తుంది” అని సిద్ధాంతీకరించారు.
ఇందులోనే “నాజీల అహం/నగ్నంగా స్త్రీలని ఊరేగించినా/ ఊచకోత జ్ఞాపకాల్లోంచీ/నాగరికత బ్లూఫిల్మై /బుసకొట్టే కామాకేళీ చిత్రాల్నుంచీ/ కన్నీళ్ళు ధారాపాతంగా ప్రవహించి / ఘనీభవించే వుంటాయ్” అంటూ మానవ జాతి చరిత్రలో ఎన్నియుగాలు మారినా, ఎంతమంది శాసనులు మారినా స్త్రీలు ఎదుర్కొన్న సమస్యలు మాత్రం రూపం మాయచుకొన్నాయే తప్ప వారికి స్వాతంత్ర్యం లభించలేదని పేర్కొంటూ, “ అశ్రు బిందువునించి/స్త్రీకినకా విముక్తి కాలగలేదంటే/నిజంగా కన్నీరు సముద్రమై/ నిజంగా కన్నీరు సముద్రమంత ఆవేశమై/ఉద్యమాల హోరెత్తితే గాని/ ఈ దోపిడీ దౌర్జన్యాల భూభాగాన్ని/ముంచెత్తాలేదని “స్పష్టంగా నేటి దుస్థితిని ప్రకటించారు. అందాల పోటీల గురించి రాస్తూ, “అక్షరాన్నివివస్త్రని గావించి/ అమ్ముకొనే/ఆశలీషా సాహిత్యం నుంచీ .. కన్నీళ్ళు ప్రవహిస్తూనే వుంటాయ్” అంటూ ఆవేదన చెందారు.
సాహిత్యకారులుగా, తెలుగు భాషకు తామే ప్రతినిధులుగా చెప్పుకొంటున్న కుహనా మేధావుల గురించి కూడా కుండబద్దలుకొట్టినట్లు తన అంతరంగాన్ని వెల్లడించారు. సమసమాజం కొరకంటూ ప్రచారం చేసుకొంటూ, ప్రభుత్వ అవార్డులకొరకు తమవంతు కృషి చేసుకొంటూ, తమ రచనలలో తీవ్రంగా వ్యతిరేకించిన పెట్టుబడిదారు వర్గాన్ని, రాజ్యాన్ని, రాజ్యాధినేతలను ప్రసన్నం చేసుకోవడానికి, అవార్డులు పొందడానికి చేసిన శ్రమను నిరసిస్తూ, అవహేళన చేశారు. అలాంటి వారి గురించి “ అర్భకుడైన కవి ఒకడు/ అవార్డులూ / సన్మానల కోసం / దేబారించడం తప్ప/ నగరంలో నేడు/ అవాంఛనీయ/ సంఘటనలేవీ జరగలేదు” అని స్పష్టంగా వరి మనస్తత్వాన్ని, వరైకి ప్రజల పట్ల సమాజంపట్ల ఉన్నదంతా పైపై ప్రేమేనని చెప్పినట్లుగా, కవితలో చెప్పారు.
సమాజంలో సమానావకాశాలు లేక, చిటికి పోయిన బతుకులను చూసిచూసి విసిగిపోయిన ఆరోషంలో నుండి చూస్తూ, నా కవిత అనే శీర్షికతో రాసిన దాంట్లో “ నా గుప్పిట్లో / మండుతున్న/ ఎన్నో గుండెలు/ ఒక్కో దాన్లో/ దూరి/ వాటిని చీరి / రక్తాశ్రువులు ఏరి/ పరిశీలిస్తాను/ నేను” అంటూ తన సిద్ధాంతాన్ని, విధానాన్ని స్పష్టంగా తెలియజెప్పిన సామాన్య అక్షర యోధుడు అలిశెట్టికి అక్షరాంజలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
జర్నలిస్టుల సంక్షేమం కోసం లెక్కలేనన్ని పోరాటాలు – టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీ
హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడింది ఏ ఒక్క సంఘమో అయితే, అది టీయూడబ్ల్యూజే (తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం) అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. బషీర్బాగ్లోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు... జగిత్యాల పాత్రికేయుడు శఫీని ఆస్పత్రిలో పరామర్శిన మంత్రి అడ్లూరి
హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల పాత్రికేయుడు షఫీ అనారోగ్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్లోని రెనోవా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బుధవారం ఆస్పత్రిలో ఆయనను పరామర్శించారు.
షఫీ ఆరోగ్య పరిస్థితిని మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని, వెంటనే విధినిర్వహణలో ఉన్న వైద్యులతో మాట్లాడారు. ఆయనకు ... మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి - చీరల పంపిణీ
హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు):తె లంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా, లోపాలు లేకుండా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఈ పథకంపై సీఎం సచివాలయం నుంచి... ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు
మెట్టుపల్లి నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా.మెట్టుపల్లి లోని సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది మరియు రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్... డ్రగ్స్.సైబర్ నేరాలపై అవగాహన సదస్సు.
ఇబ్రహీంపట్నం నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం ఎస్... వేములకుర్తి పాఠశాల కు పురిపైడ్,నిటి ట్యాంక్ అందచేత
ఇబ్రహీంపట్నం నవంబర్ 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాల (బండమిది బడి) విధ్యర్డుల కు తాగునీరు అందిచాలని బుదవారం 2005- 06 పదవతరగతి పుర్వవిధ్యరుల అధ్వర్యంలో పురిపైడ్,మరియు గంగపుత్ర యుత్ అధ్వర్యంలో నిటి ట్యాంక్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగమణి కీ ఎర్పాటు... రాంగోపాల్పేట్ లో ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ
సికింద్రాబాద్, నవంబర్ 19 (ప్రజామంటలు ):
దేశానికి సేవలందించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చేసిన మేలును దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ అన్నారు. రాంగోపాల్పేట్ డివిజన్ అధ్యక్షుడు దుండిగల్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ అంబేడ్కర్నగర్లో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ నూతన విగ్రహాన్ని బుధవారం ఆమె జయంతి... అమెరికాలో 2017 నాటి శశికళ–అనీష్ హత్య కేసులో అసలు నిందితుడికి చేరుకున్న విచారణ
హైదరాబాద్ నవంబర్ 19:
అమెరికాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన శశికళ నర్రా (Sasikala Narra) మరియు ఆమె ఏడేళ్ల కుమారుడు అనీష్ సాయి నర్రా 2017లో జరిగిన దారుణ హత్య కేసు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ సంచలనంగా మారింది. న్యూజెర్సీలో జరిగిన ఈ ద్విప్రమాణ హత్యలో నిజమైన నిందితుడిని అధికారులు గుర్తించినట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఎలా... మహిళా అభ్యున్నతీకి కాంగ్రెస్ పార్టీ కృషి. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు):రాష్ట్రంలోని మహిళ సోదరిమణుల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు.
ఇందిరా గాంధీ జన్మదినం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక భగినీ నివేదిత ఆశ్రమంలో ఆల్... జగిత్యాలలో ASMITA కిక్బాక్సింగ్ లీగ్ రాష్ట్ర స్థాయి పోటీలు
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్స్ లో ఖేలో ఇండియా కార్యక్రమం భాగంగా నిర్వహిస్తున్న ASMITA కిక్ బాక్సింగ్ లీగ్ 2025–26 రాష్ట్ర స్థాయి కిక్బాక్సింగ్ పోటీలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.
రాష్ట్ర స్థాయి లీగ్ పోస్టర్ ఆవిష్కరణ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిసెంబర్... ఎమ్మెల్యేను కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కే. రాజశేఖర్, డైరెక్టర్ సాయి కృష్ణ మర్యాద పూర్వక భేటీ చేశారు. ఇటీవల ఎన్నికైన అర్బన్ బ్యాంక్ నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు... ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇందిరా భవన్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ
కార్యక్రమంలో భాగంగా... 