తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి

అలిశెట్టి  ప్రభాకర్ జన్మదినం 12, జనవరి

On
తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి

తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి అలిశెట్టి  ప్రభాకర్ జన్మదినం 12, జనవరి

IMG_20240111_221643

-సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339.

తెలుగు సాహిత్యంలో అజరామరమైన నూతన సాహిత్య విలువలను, సామాన్యుని గొంతుకను బలంగా వినిపించిన మహనీయుడు, ప్రజల మనిషిగా, జీవితాన్నే సాహిత్యానికి అంకితం చేసిన చిరుకవితల కవి, మరణించి మూడు దశాబ్దాలయినా, నేటికీ వినబడుతూనే ఉంది. కవిత్వం గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా, ఆయన పేరు లేకుండా కవిత్వంపై ప్రసంగం చేయలేని విధంగా, కవిత్వంలో తన ముద్ర వేసిన అతి సామాన్యుడు. ఆయన పేరు వినిపించినంతగా, ఈ శతాబ్దంలోని ఏ కవి పేరుకాని, ఆయన కవితలు కానీ చర్చల్లో కానీ, ఉదాహరణలో కానీ పేర్కొన్న కవి మరొకరు లేరంటే, కవితలుకానీ  లేవంటే అతిశయోక్తి కాదు.

ఆడంభరాలకు, సన్మానాలకు, సభలకు, అవార్డులకు అర్రులు చాచకుండా, తన కాలం, కుంచె ఎప్పటికీ అత్తాడుగువర్గాల ప్రజలు, అణచివేతకు గురైన శ్రామికుల వెన్నంటే ఉంటుందని ఆచారణతో సహాయ ప్రకటించిన అనన్య ప్రతిభావంతుడు అలిశెట్టి. పేరులోన ప్రభాకరున్నీ ఉంచుకోవాడమే కాకుండా, ఆ ప్రభాకరునిలోని  భాస్వర స్వభావ లక్షణాలను పునికి పుచ్చుకొని, తన రక్తాన్నే సిరాగా మార్చుకొని,  సమాజంలోని అసంబద్ద సంప్రదాయాలను, కట్టుబాట్లను, రాజకీయాల్లోని కుళ్లును తన అక్షర యజ్ఞంతో  దహించి వేసే ప్రయత్నం చేసిన అనల్పజీవి అలిశెట్టి ప్రభాకర్ . 

తన కంటూ ఏమి మిగుల్చుకోవాలనే ఆశలు లేకుండా, తన చుట్టూ ఉన్న పేదల బతుకుల పట్ల ఈ సామాజిక, రాజకీయ వ్యవస్థ, తరతరాలుగా వ్యవహరిస్తున్న తీరును తన ప్రతి కవితలో  నిశితంగా విమర్శించారు. అది రాజకీయ నాయకుడైనా, సమాజంలోని ఇతర పెద్దలైనా, మనిషి సృష్టించాడాని చెప్పుకొనే దేవుడైనా ఒకే రీతిలో వ్యవహరిస్తున్నారంటూ, సమాజం తనకు తానుగా మేలుకొంటే తప్ప, ఈ సమాజంలోని బడుగుల బతుకులు బాగుపడవని హెచ్చరించారు.

స్త్రీల పట్ల సమాజ వైఖరిని కూడా నిశితంగా ఖండిస్తూ, మహిళలను ఈ సమాజం ఆటవస్తువుగా, అంగడి బొమ్మలా వాడుకొంటున్నారని ఘోషించాడు. రాజ్యాంగాలు మారినా, ప్రభుత్వాలు మారినా, నేటికీ స్త్రీల పట్ల ఈ సమాజం ఇంకా ఆటవిక యుగం నాటి దృక్పథంతోనే ఉందని, స్త్రీని పురుషుడు తన అవసరాలకు అనుగుణంగా మలుచుకొని, తన లోని రాక్షసత్వానికి ప్రతీకగా చూస్తున్నారని ప్రకటించాడు. “విషాద సాక్షాత్కారం” శీర్షికన రాసిన దీర్ఘ కవితలో స్త్రీల బాధలను వివరంగా ప్రశ్నించారు.

“కన్నీళ్లని ఏ భాషలోకి అనువాదించినా

విషాదం మూర్తీభవించిన స్త్రీయే

సాక్షాత్కరిస్తుంది” అని సిద్ధాంతీకరించారు.

ఇందులోనే “నాజీల అహం/నగ్నంగా స్త్రీలని ఊరేగించినా/ ఊచకోత జ్ఞాపకాల్లోంచీ/నాగరికత బ్లూఫిల్మై /బుసకొట్టే కామాకేళీ చిత్రాల్నుంచీ/ కన్నీళ్ళు ధారాపాతంగా ప్రవహించి / ఘనీభవించే వుంటాయ్” అంటూ మానవ జాతి చరిత్రలో ఎన్నియుగాలు మారినా, ఎంతమంది శాసనులు మారినా స్త్రీలు ఎదుర్కొన్న సమస్యలు మాత్రం రూపం మాయచుకొన్నాయే తప్ప వారికి స్వాతంత్ర్యం లభించలేదని పేర్కొంటూ, “ అశ్రు బిందువునించి/స్త్రీకినకా విముక్తి కాలగలేదంటే/నిజంగా కన్నీరు సముద్రమై/  నిజంగా కన్నీరు సముద్రమంత ఆవేశమై/ఉద్యమాల హోరెత్తితే గాని/ ఈ దోపిడీ దౌర్జన్యాల భూభాగాన్ని/ముంచెత్తాలేదని “స్పష్టంగా నేటి దుస్థితిని ప్రకటించారు. అందాల పోటీల గురించి రాస్తూ,    “అక్షరాన్నివివస్త్రని గావించి/ అమ్ముకొనే/ఆశలీషా సాహిత్యం నుంచీ .. కన్నీళ్ళు ప్రవహిస్తూనే వుంటాయ్” అంటూ ఆవేదన చెందారు. 

సాహిత్యకారులుగా, తెలుగు భాషకు తామే ప్రతినిధులుగా చెప్పుకొంటున్న కుహనా మేధావుల గురించి కూడా కుండబద్దలుకొట్టినట్లు తన  అంతరంగాన్ని వెల్లడించారు. సమసమాజం కొరకంటూ ప్రచారం చేసుకొంటూ, ప్రభుత్వ అవార్డులకొరకు తమవంతు కృషి చేసుకొంటూ, తమ రచనలలో తీవ్రంగా వ్యతిరేకించిన పెట్టుబడిదారు వర్గాన్ని, రాజ్యాన్ని, రాజ్యాధినేతలను ప్రసన్నం చేసుకోవడానికి, అవార్డులు పొందడానికి చేసిన శ్రమను నిరసిస్తూ, అవహేళన చేశారు. అలాంటి వారి గురించి “ అర్భకుడైన కవి ఒకడు/ అవార్డులూ / సన్మానల కోసం / దేబారించడం తప్ప/ నగరంలో నేడు/ అవాంఛనీయ/ సంఘటనలేవీ జరగలేదు” అని స్పష్టంగా వరి మనస్తత్వాన్ని, వరైకి ప్రజల పట్ల సమాజంపట్ల ఉన్నదంతా పైపై ప్రేమేనని చెప్పినట్లుగా, కవితలో చెప్పారు.

సమాజంలో సమానావకాశాలు లేక, చిటికి పోయిన బతుకులను చూసిచూసి విసిగిపోయిన ఆరోషంలో నుండి చూస్తూ, నా కవిత అనే శీర్షికతో రాసిన దాంట్లో “ నా గుప్పిట్లో / మండుతున్న/ ఎన్నో గుండెలు/ ఒక్కో దాన్లో/ దూరి/ వాటిని చీరి / రక్తాశ్రువులు ఏరి/ పరిశీలిస్తాను/ నేను” అంటూ తన సిద్ధాంతాన్ని, విధానాన్ని స్పష్టంగా తెలియజెప్పిన సామాన్య అక్షర యోధుడు అలిశెట్టికి అక్షరాంజలి.

Tags

More News...

Local News 

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్  సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్  సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం యొక్క ధ్యేయం-మంత్రి అడ్లూరి గొల్లపల్లి జూన్ 29 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో  కళ్యాణ లక్ష్మి షాది ముబారక్  సీఎం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతులుగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ,వృద్ధుల మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ అదేవిధంగా...
Read More...
Local News 

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ జూన్ 29 (ప్రజా మంటలు): నిజామాబాదు లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం నిమిత్తము కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వచ్చారు.  బేగంపేట్ ఎయిర్ పోర్ట్ పోర్టులో విమానం దిగిన అమిత్ షా కు అభివాదం చేసిన మాజీ మంత్రి, NDMA వైస్ ప్రెసిడెంట్ మర్రి శశిధర్...
Read More...
Local News 

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం సికింద్రాబాద్, జూన్ 29 (ప్రజామంటలు): సికింద్రాబాద్ చిలకలగూడ లోని కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సర్వసభ్య సమావేశం ఆదివారం ఆలయ ఆవరణలో నిర్వహించారు. ఆషాడ బోనాల ఉత్సవాల నేపద్యంలో భక్తుల సౌకర్యార్థమై చేయాల్సిన ఏర్పాట్లు, తదితర అంశాలపై హక్కుదారులు చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఏడాది ఆలయ హక్కుదారులు అమ్మవారికి తొలిబోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది....
Read More...
Local News 

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి భీమదేవరపల్లి, జూన్ 29 (ప్రజామంటలు) : ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి మరియు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వ్యవస్థాపక అధ్యక్షులు, సహకారోద్యమానికి ప్రాణం పోసిన కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39వ వర్ధంతిని ఆదివారం ఉదయం సంఘ ఆవరణలో శ్రద్ధాంజలుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సంఘ ప్రస్తుత అధ్యక్షులు ఎ. ప్రవీణ్ రెడ్డి...
Read More...
Local News 

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి    జగిత్యాల జూన్ 29 (ప్రజా మంటలు) పట్టణం విశ్వకర్మ సంఘం వారి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల జాతర సందర్భంగా మహిళలతో కలిసి డప్పు చప్పుల్ల మధ్యలో బోనం ఎత్తుకున్న, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  సరైన సమయంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పోచమ్మ...
Read More...
Local News 

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

భీమదేవరపల్లి, జూన్ 29 (ప్రజామంటలు) :    ముల్కనూర్ లోని విశ్వశాంతి విద్యాలయం 2010-11 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఒక ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మళ్లీ ఒకచోట చేరి గురువుల పట్ల కృతజ్ఞతలు తెలిపి, మిత్రుల మధ్య మధురానుభూతులు పంచుకున్నారు. “గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః...” శ్లోకంతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో, జీవితానికి మార్గదర్శకులైన...
Read More...
Local News 

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి 

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి  సికింద్రాబాద్, జూన్ 29 (ప్రజామంటలు): జూలై 13, 14న జరగనున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను వైభవంగా నిర్వహిద్దామని, అందుకు ప్రభుత్వ అధికారులు,పార్టీలకతీతంగా నాయకులు,భక్తులు సహకరించాలని దక్కన్ మానవ సేవాసమితి కోరింది.ఈ మేరకు వారు ఆదివారం మహంకాళి ఆలయ ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ అధ్యక్షతన...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ సికింద్రాబాద్,  జూన్ 29 (ప్రజా మంటలు): హైదరాబాద్ రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు ఆదివారం పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు, స్వేటర్లు పంపిణి చేశారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్నవారికి ఔషదాలు కూడ అందచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు  డాక్టర్. వై....
Read More...
Local News  State News 

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు 

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు  మృతదేహం తరలింపు ప్రక్రియలో పురోగతి - మరో రెండు రోజుల్లో ఇజ్రాయిల్ నుంచి ఇండియాకు చేరనున్న మృతదేహం  జగిత్యాల జూన్ 29 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణానికి చెందిన రేవెల్ల రవీందర్ (57) ఈ నెల 16న ఇజ్రాయిల్‌లో గుండె సంబంధిత అనారోగ్యంతో మరణించారు. అదే సమయంలో ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న...
Read More...
Local News 

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్  జూన్ 29 (ప్రజా మంటలు): మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆదయ్య ఎక్స్ రోడ్ ఫుట్ పాత్  పై పడి ఉన్న దాదాపు 45 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు ఎలాంటి వివరాలు...
Read More...
Local News  State News 

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జూన్ 28 (ప్రజా మంటలు) :  జూలై 1 వ తేదీసాయంత్రం 5:30గంటలకు స్ధానిక స్వామి వివేకానంద మినీ స్టేడియం లో జగిత్యాల జిల్లా బాస్కెట్ బాల్ జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించబడునని అసోసియేషన్ కార్యదర్శి డా. వేణు గోపాల్ రెడ్డి...
Read More...
Local News  State News 

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి. జగిత్యాల 28 జూన్ (ప్రజా మంటలు) :  భారత ప్రధానమంత్రిగా బహుభాషావేత్తగా భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహులుగా పేరొందిన పాములపర్తి వేంకట నరసింహారావు గారి నూట నాల్గవ జయంతి సందర్భంగా రాయికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అందించిన ప్రత్యేక కథనం. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని...
Read More...