మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
అదిలాబాద్ జూన్ 29 :
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆకస్మికంగా కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని,మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో తుది శ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు
మొదట హుటాహుటీన కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్లు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ను పార్టీ నుంచి టీపీసీసీ సస్పెండ్ చేయడంతో,ఆయన కూడా కాంగ్రెస్ను వదిలేశారు.
లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన రమేశ్రాథోడ్, బీజేపీలో చేరిపోయారు. రమేష్ రాథోడ్ 2009లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2018లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీచేసి ఓడిపోయారు.
షెడ్యూల్ తెగలకు చెందిన రమేష్ రాథోడ్, అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడుగా ఎదుగుతూ వచ్చారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. అతను 1999లో ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2006–2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి 2009–2014 ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
అనంతరం ఖానాపూర్ అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రమేశ్ రాథోడ్. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. జూన్ 2021 లో ఈటెల రాజేందర్ తోపాటు భారతీయ జనతా పార్టీలో చేరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రాఫిక్ నిబంధనల పై యమధర్మరాజు అవగాహన : ట్రాఫిక్ పోలీసులతో కలిసిరోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) : రోడ్డు ప్రమాదాల పై అవగాహన కలిగించేందుకు నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతివేగం, రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా యమధర్మ రాజు వేషదారితో ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారులకు అవగాహన కలిగిస్తున్నారు.... చలనచిత్ర రంగ అభివృద్ధికి పూర్తి సహకారం — సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వము పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 రెండో... రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ
హైదరాబాద్ డిసెంబర్ 09 (ప్రజా మంటలు):
భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను విర్చువల్గా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో... గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఎమర్జెన్సీ వార్డు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 45-50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. అయితే సదరు... పోష్ యాక్ట్–2013పై అవగాహన ర్యాలీ
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) :
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు కఠినంగా అమలు అవుతున్న పోష్ యాక్ట్–2013 గురించి అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా కమిటీ, యాక్షన్ ఎయిడ్, భరోసా సంయుక్తంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించింది. న్యూ బోయిగూడ నుంచి గాంధీ ఆస్పత్రి ఎదురుగా... రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి.
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 9 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మోడల్ స్కూల్ నందు గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి సందర్శించినారు, మరియు అలాగే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి హనుమాన్ చెక్ పోస్ట్ ని కూడా "అవినీతిని నిర్మూలిద్దాం- దేశాన్ని అభివృద్ధి చేద్దాం’’ 1064 టోల్ ఫ్రీ నెంబర్ తో అవినీతికి అడ్డుకట్ట జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 9 (ప్రజా మంటలు)అవినీతి నిరోధక వారోత్సవాలు పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ అశోక్... ఆదం సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్..
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు):
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఇంచార్జీ అదం సంతోష్ కుమార్ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్, పండ్ల పంపిణీ,... బన్సీలాల్ పేట లో సోనియమ్మ 79వ జన్మదిన వేడుకలు
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు):
సికింద్రాబాద్, బన్సీలాల్పేట్ డివిజన్లోని జబ్బర్ కాంప్లెక్స్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీపక్ జాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఐత చిరంజీవి ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు.... ఎన్నికల కోడ్ నియమాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి :ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 09 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడంతో నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఎస్ఐ,కృష్ణ సాగర్ రెడ్డి మళవారం మండలంలోని రాఘవపట్నం ,గుంజపడుగు, వెలుగుమట్ల ,చందోలి, దమ్మన్నపేట శ్రీరాములపల్లి గ్రామాలలో పర్యటించి ప్రజలకు ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అలాగే ఎన్నికల సమయంలో వాట్స్అప్... 4, 21 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 9 ( ప్రజా మంటలు)
పట్టణ 21వ వార్డులో 15 లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి,4వ వార్డులో చెరువు కట్ట పోచమ్మ ఆలయం దగ్గర 4 లక్షల తో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అంతకుముందు వార్డు అభివ్రుద్ది... గండి హనుమాన్ చెక్పోస్ట్ను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
జగిత్యాల డిసెంబర్ 9(ప్రజా మంటలు)సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ శ్రీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన గండి హనుమాన్ చెక్పోస్ట్ ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ... 