కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్జి,తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో జగిత్యాల జిల్లా అభివృద్ధి పరుగులు పెట్టిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాల సమయం ఇచ్చినా ఆశించిన ఫలితాలు కనిపించలేదన్నారు. ధర్మపురిలో మంజూరైన వ్యవసాయ కళాశాల ఇతర ప్రాంతానికి తరలించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర్మపురి MCH 50 పడకల ఆసుపత్రి రెండేళ్లుగా పూర్తి అయి ఉన్నా ప్రారంభం చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు.
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, “ఏ అభివృద్ధి చేశారో చెప్పకుండా విజయోత్సవాలు చేసుకోవడం విడ్డూరం” అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్, హరీష్ రావు సహకారంతో జగిత్యాల జిల్లాలో విస్తృత అభివృద్ధి జరిగిందని చెప్పారు. కోరుట్ల, మెట్పల్లి మునిసిపాలిటీలకు TUFIDC ద్వారా రూ.15 కోట్లు మంజూరయ్యాయని గుర్తు చేశారు. దేవస్థానాలకు నిధులు, సంఘ భవనాలు, రోడ్ల నిర్మాణాలకు కేటాయింపులు జరిగినా ప్రస్తుత ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు.
ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కొరత
కోరుట్ల–మెట్పల్లి ఆసుపత్రికి రూ.6 కోట్లతో దాదాపు పనులు పూర్తయ్యాయని, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అస్తవ్యస్థంగా మారిందని, AMC ఆధునికీకరణ చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్నారు. గతంలో లోలెవెల్ బ్రిడ్జ్లను హై లెవెల్ బ్రిడ్జ్లుగా మార్చామని, వాటిలో కొన్ని ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని విమర్శించారు.
దావ వసంత సురేష్ మాట్లాడుతూ, జగిత్యాల నియోజకవర్గంలో “అభివృద్ధి” అనే మాట ఎమ్మెల్యేకు కేవలం నినాదంగా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్ల నిధులు కేటాయించినా వాటిని పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
యావర్ రోడ్ విస్తరణ, మోడల్ మార్కెట్ ప్రారంభం, మెడికల్ కాలేజీ నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పూర్తి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని చెప్పారు. అభివృద్ధి పనుల కాంట్రాక్టులలో షాడో కాంట్రాక్టర్గా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో ఉన్నాయని తెలిపారు. పట్టణంలో స్పీడ్ బ్రేకర్లు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు.
సుంకే రవి శంకర్ మాట్లాడుతూ, 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిరాశపరిచిందన్నారు. పెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాన్ని ఎత్తిచూపారు. బీఆర్ఎస్ పాలనలో చొప్పదండి నియోజకవర్గానికి భారీ నిధులు, కొండగట్టు దేవస్థానం తాగునీటి శాశ్వత పరిష్కారానికి కేటాయింపులు జరిగాయని, వాటిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు.
ఈ సమావేశంలో గోడిసెల రాజేశం గౌడ్, ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, లోక బాపు రెడ్డి, మారు సాయి రెడ్డి, దేవేందర్ నాయక్ రాథోడ్, శీలం ప్రవీణ్, వొళ్లెం మల్లేశం, ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు, చిట్ల రమణ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్
చౌలామద్ది డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
ఈరోజు జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌలామద్ది గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, తుల గంగవ్వ స్మారక ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని... గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత
సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్ఓడీ డా. జి. రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థినిగా, అదే కళాశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు.
నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్... తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.
జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు.... ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బలపరిచిన 70 మంది సర్పంచులు మరియు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందగా 65 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులను... రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే...గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లి డిసెంబర్ 15 (ప్రజా మంటలు :అంకం భూమయ్య)
గొల్లపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆవుల జమున సత్యం (ఉంగరం గుర్తు) ఓటు వేసి గెలిపించాలని కోరారు.సత్యం వెనుక బిఆర్ఎస్ పార్టీ, కొప్పుల ఈశ్వర్, కెటిఆర్,... సామాజిక తెలంగాణయే నా ధ్యేయం.. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: X "ఆస్క్ కవిత"లో కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
సామాజిక తెలంగాణ సాధననే తన ప్రధాన లక్ష్యంగా తీసుకున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉంటుందని వెల్లడించారు. సోమవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిర్వహించిన #AskKavitha కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఈ ఇంటరాక్షన్... వావ్...దంపతులిద్దరూ గెలిచారు... ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి..
సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోచమ్మల ప్రవీణ్(8వ వార్డు) మంజుల (10వ వార్డు) దంపతులు ఇద్దరు వేర్వేరు వార్డుల్లో పోటీ చేశారు. చిత్రం ఏమిటంటే ఇద్దరికి 98-98 ఓట్లు చొప్పున వచ్చాయి.
కాగా ప్రవీణ్ రామన్నపేట---... పాషం భాస్కర్ మృతిపై జి. రాజేశం గౌడ్ సంతాపం
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్, మండల అధ్యక్షుడిగా సేవలందించిన పాషం భాస్కర్ గారు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్ తన భార్య శ్యామలాదేవితో కలిసి పాషం... కవితమ్మపై తప్పుడు ప్రచారం ఆపాలి.. నిరాధార ఆరోపణలకు తీవ్ర పరిణామాలు: తెలంగాణ జాగృతి నేతలు
హైదరాబాద్ డిసెంబర్ 15. (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మపై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం జరుగుతోందని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ ఆరోపించారు. సోమవారం బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
వి. ప్రకాష్ అనే వ్యక్తి... మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)మోతే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్లుగా గెలుపొందిన పల్లెకొండ రాజేశ్వరి-ప్రశాంత్ , ధనపనేని నరేష్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, సునీల్,ప్రశాంత్ మరియు... పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 15(ప్రజా మంటలు) మండలం పొలాస గ్రామం నూతన ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ గెలుపొందగా ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలువగా గెలుపొందిన ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మిల్కూరి... భారత మార్కెట్లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్
న్యూఢిల్లీ డిసెంబర్ 14:భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–యూకే మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచడంతో పాటు సేవలను అప్గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
2026 నుంచి (అనుమతులకు లోబడి) లండన్ హీత్రో – న్యూఢిల్లీ మార్గంలో మూడో డైలీ... 