<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4765/fees-reimbursement" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>fees reimbursement - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4765/rss</link>
                <description>fees reimbursement RSS Feed</description>
                
                            <item>
                <title>గురుకులాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం- కొప్పుల </title>
                                    <description><![CDATA[<p><span>జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):</span></p>
<p>తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించిన విద్యా అవకాశాలను ప్రస్తుత ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. సోమవారం జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ లోక బాపురెడ్డి తదితర బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.</p>
<p>గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలే ప్రధాన ఆధారమని, రాష్ట్రంలో దాదాపు 2,000 పాఠశాలలు మూతపడటం లేదా సక్రమంగా పనిచేయకపోవడంతో అడ్మిషన్లు సుమారు 1.26 లక్షల మేర తగ్గాయని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కేసీఆర్‌ హయాంలో 1,023 గురుకులాలను ఏర్పాటు చేసి 7 నుంచి 8 లక్షల మంది విద్యార్థులకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/11000/6a8c10a9bb8e0"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/8545bf4c-b845-4316-aa22-4a94ffb41f78.jpeg" alt=""></a><br /><p><span>జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):</span></p>
<p>తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించిన విద్యా అవకాశాలను ప్రస్తుత ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. సోమవారం జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ లోక బాపురెడ్డి తదితర బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.</p>
<p>గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలే ప్రధాన ఆధారమని, రాష్ట్రంలో దాదాపు 2,000 పాఠశాలలు మూతపడటం లేదా సక్రమంగా పనిచేయకపోవడంతో అడ్మిషన్లు సుమారు 1.26 లక్షల మేర తగ్గాయని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కేసీఆర్‌ హయాంలో 1,023 గురుకులాలను ఏర్పాటు చేసి 7 నుంచి 8 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరిపై ఏడాదికి సుమారు రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్య అందించామని తెలిపారు.</p>
<p>ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు, నాణ్యమైన భోజనం కూడా అందడం లేదని ఆయన ఆరోపించారు. వివిధ కారణాలతో 107 మంది విద్యార్థులు మృతి చెందినప్పటికీ వాటికి దారితీసిన కారణాలను సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. గురుకుల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని అన్నారు.</p>
<p>కేసీఆర్‌ హయాంలో గురుకుల పాఠశాలలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రస్తుత ముఖ్యమంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గురుకుల వ్యవస్థను దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. గురుకులాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పిల్లలను అక్కడ చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.</p>
<p>‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ విధానం తీసుకురావడం వెనుక ఉన్న గురుకుల వ్యవస్థను బలహీనపరిచే ఉద్దేశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.15,600 కోట్ల అంచనా వ్యయంతో కొత్త భవనాల నిర్మాణం చేపట్టడం ద్వారా నాయకులు, కాంట్రాక్టర్లకు ప్రయోజనం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఉన్న గురుకులాలను అభివృద్ధి చేయకుండా కొత్త విధానాల పేరుతో విద్యార్థులను, విద్యా వ్యవస్థను గందరగోళానికి గురిచేయడం సరికాదన్నారు.</p>
<p>ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకం ద్వారా వేలాది మందికి ప్రయోజనం కలిగిందని తెలిపారు. 2014 నాటికి సుమారు 9,000 మందికి ఉన్న అవకాశాలను తమ ప్రభుత్వ హయాంలో 26,000 మందికి విస్తరించామని చెప్పారు. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలోని 236 పాఠశాలలకు సుమారు రూ.250 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.</p>
<p>ఫీజులు చెల్లించకపోవడంతో కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను గేట్ల వద్ద నిలబెడుతున్నాయని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కొప్పుల ఈశ్వర్ అన్నారు. పుస్తకాలు, దుస్తులు, షూలు కూడా విద్యార్థులే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.11,300 కోట్లకు చేరుకున్నాయని, దీంతో విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకోలకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.</p>
<p>పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 కూడా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని 59 ప్రభుత్వ, 97 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులకు లభిస్తున్న విద్యా అవకాశాలను ఈ నిర్ణయం దెబ్బతీస్తుందని అన్నారు. పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం పూర్తి చేసిన అనంతరం నేరుగా బీటెక్‌లో చేరే అవకాశాలు కూడా విద్యార్థులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.</p>
<p>పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థను లేబర్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఐటీఐలు, స్కిల్‌ యూనివర్సిటీతో అనుసంధానం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దీనివల్ల విద్యార్థులతో పాటు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 400 మందికి పైగా కాంట్రాక్ట్‌ లెక్చరర్లను పర్మినెంట్‌ చేసి, ప్రమోషన్లు కల్పిస్తూ పాలిటెక్నిక్‌ వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు.</p>
<p>జీవో 97ను వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా, సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.</p>
<p>ప్రభుత్వ వ్యవస్థలు బలహీనపడటంతో పేదలు, కూలీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయని ఆయన అన్నారు. సామాన్యుల పిల్లల చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితిపై ప్రజలు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలని కొప్పుల ఈశ్వర్ కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/11000/6a8c10a9bb8e0</link>
                <guid>https://www.prajamantalu.com/article/11000/6a8c10a9bb8e0</guid>
                <pubDate>Mon, 24 Aug 2026 15:13:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/8545bf4c-b845-4316-aa22-4a94ffb41f78.jpeg"                         length="192890"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        