<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4752/minorities" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Minorities - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4752/rss</link>
                <description>Minorities RSS Feed</description>
                
                            <item>
                <title>హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, ఆగస్టు 13:</p>
<p>హిందూ–ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇరువర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.</p>
<p>హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన వారితో పాటు నీట్, ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 782 మంది మైనారిటీ అభ్యర్థులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.</p>
<p>విద్యతో పాటు నైపుణ్యాలు అవసరం</p>
<p>చదువు ఒక్కటే భవిష్యత్తును మార్చగల శక్తి అని రేవంత్ రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యపై దృష్టి పెట్టడంతో పాటు, ఆ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10959/hindu-muslims-are-like-two-eyes-to-me-cm-revanth-reddy"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260813-wa0005(1).jpg" alt=""></a><br /><p>హైదరాబాద్, ఆగస్టు 13:</p>
<p>హిందూ–ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇరువర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.</p>
<p>హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన వారితో పాటు నీట్, ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 782 మంది మైనారిటీ అభ్యర్థులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.</p>
<p>విద్యతో పాటు నైపుణ్యాలు అవసరం</p>
<p>చదువు ఒక్కటే భవిష్యత్తును మార్చగల శక్తి అని రేవంత్ రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యపై దృష్టి పెట్టడంతో పాటు, ఆ తర్వాత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నైపుణ్యాలు ఉన్న యువతకు దేశంలోనే కాకుండా జర్మనీ, జపాన్ వంటి దేశాల్లోనూ అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.</p>
<p>యువతను నైపుణ్యాల దిశగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. చిన్న కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.</p>
<p>4 శాతం రిజర్వేషన్లపై సీఎం వ్యాఖ్యలు</p>
<p>మైనారిటీలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి విజయవంతం కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. మైనారిటీల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా మైనారిటీ వర్గాలకు కూడా గణనీయమైన ప్రయోజనం లభిస్తోందని పేర్కొన్నారు.</p>
<p>గత ప్రభుత్వంపై విమర్శలు</p>
<p>గత ప్రభుత్వ హయాంలో గ్రూప్–1తో పాటు ఇతర ఉద్యోగ నియామకాలు సక్రమంగా జరగలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. గ్రూప్–1 పరీక్షా పత్రాలు మార్కెట్‌లో విక్రయించబడ్డాయని ఆరోపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అర్హత, నైపుణ్యం కలిగిన వ్యక్తులను సభ్యులుగా నియమించాల్సిన అవసరం ఉందని అన్నారు.</p>
<p>ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌తో పాటు నిపుణులతో సంప్రదింపులు జరిపి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేసి నియామకాలను పూర్తి చేశామని చెప్పారు.</p>
<p>కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీజీఎంఆర్‌ఈఐఎస్ అధ్యక్షుడు మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10959/hindu-muslims-are-like-two-eyes-to-me-cm-revanth-reddy</link>
                <guid>https://www.prajamantalu.com/article/10959/hindu-muslims-are-like-two-eyes-to-me-cm-revanth-reddy</guid>
                <pubDate>Thu, 13 Aug 2026 20:48:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260813-wa0005%281%29.jpg"                         length="270639"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        