<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4745/auto-driver" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>auto driver - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4745/rss</link>
                <description>auto driver RSS Feed</description>
                
                            <item>
                <title>ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>హైదరాబాద్ ఆగస్టు 12 (ప్రజా మంటలు):</p>
<p><br />ఆటో కార్మికుల జీవితాలను దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ) అనుబంధ ఆటో కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడపాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించారు.</p>
<p>ఆటో కార్మికులకు అన్యాయం చేసే జీవో 263ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 20 మంది ఆటో కార్మికులు దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలకు పాల్పడితే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-08/img_20260812_181520.jpg" alt="IMG_20260812_181520" width="1200" height="1200" /></p>
<p>ఆటో డ్రైవర్లతో పెట్టుకుంటే పుట్టగతులుండవు: రూప్ సింగ్</p>
<p>టీఆర్ఎస్ సీనియర్ నేత రూప్ సింగ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉచిత బస్సు పథకం ప్రభావంతో ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిందని, అయినప్పటికీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10947/demand-to-withdraw-proposal-of-electric-autos-in-rtc"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260812-wa0716.jpg" alt=""></a><br /><p> </p>
<p>హైదరాబాద్ ఆగస్టు 12 (ప్రజా మంటలు):</p>
<p><br />ఆటో కార్మికుల జీవితాలను దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ) అనుబంధ ఆటో కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడపాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించారు.</p>
<p>ఆటో కార్మికులకు అన్యాయం చేసే జీవో 263ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 20 మంది ఆటో కార్మికులు దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలకు పాల్పడితే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-08/img_20260812_181520.jpg" alt="IMG_20260812_181520" width="1275" height="1510"></img></p>
<p>ఆటో డ్రైవర్లతో పెట్టుకుంటే పుట్టగతులుండవు: రూప్ సింగ్</p>
<p>టీఆర్ఎస్ సీనియర్ నేత రూప్ సింగ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉచిత బస్సు పథకం ప్రభావంతో ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిందని, అయినప్పటికీ వారు ప్రభుత్వంపై భారం పడకుండా తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారని అన్నారు.</p>
<p>ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడపాలన్న నిర్ణయం ఆటో కార్మికుల జీవితాలపై మరో భారం మోపినట్లవుతుందని ఆయన అన్నారు. ఆటో కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలదొక్కుకోలేదని వ్యాఖ్యానిస్తూ, ఎలక్ట్రిక్ ఆటోల ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు.</p>
<p>5 లక్షల మంది ఆటో డ్రైవర్లకు అన్యాయం చేయొద్దు: బోడ జనార్థన్</p>
<p>రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్థన్ అన్నారు. ఆటో కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకునే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.</p>
<p>ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం మేలు చేయకపోయినా, వారి జీవనోపాధికి నష్టం కలిగించే చర్యలు చేపట్టడం సరికాదన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడపాలన్న ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు.</p>
<p>జీవో 263 రద్దు చేయాలి</p>
<p>ఆటో డ్రైవర్లకు నష్టం కలిగించే జీవో 263ను వెంటనే రద్దు చేయాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్.వి.ఆర్. ప్రసాద్, నరేష్ ప్రజాపతి డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వారు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.</p>
<p>కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పడాల మనోజ గౌడ్, వీరన్న, ఆటో యూనియన్ నాయకులు ఎం.ఏ. సలీం, నజీరోద్దీన్, మహేందర్ నాయక్, శ్రీధర్, శివ ప్రసాద్, అబ్దుల్ గని, టీఆర్టీయూ నాయకులు, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10947/demand-to-withdraw-proposal-of-electric-autos-in-rtc</link>
                <guid>https://www.prajamantalu.com/article/10947/demand-to-withdraw-proposal-of-electric-autos-in-rtc</guid>
                <pubDate>Wed, 12 Aug 2026 18:14:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260812-wa0716.jpg"                         length="195611"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        