<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4684/central-school" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>సెంట్రల్ స్కూల్ - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4684/rss</link>
                <description>సెంట్రల్ స్కూల్ RSS Feed</description>
                
                            <item>
                <title>జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ</title>
                                    <description><![CDATA[<h5><span style="background-color:rgb(191,237,210);color:rgb(186,55,42);"><strong>రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి కేటాయింపు – త్వరలో తాత్కాలిక భవనంలో తరగతుల ప్రారంభం</strong></span></h5>
<p>జగిత్యాల, జూలై 12 (ప్రజా మంటలు):</p>
<p>జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సంయుక్తంగా భూమిపూజ నిర్వహించారు.</p>
<p>ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. కేంద్రీయ విద్యాలయం కోసం గతంలో రైతులకు చెందిన భూమి కేటాయింపులో ఇబ్బందులు ఎదురైనా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కృషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలోని ఐదు ఎకరాల విలువైన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10854/bhumi-puja-for-the-construction-of-kendriya-vidyalaya-building-for"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260712-wa0000.jpg" alt=""></a><br /><h5><span style="background-color:rgb(191,237,210);color:rgb(186,55,42);"><strong>రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి కేటాయింపు – త్వరలో తాత్కాలిక భవనంలో తరగతుల ప్రారంభం</strong></span></h5>
<p>జగిత్యాల, జూలై 12 (ప్రజా మంటలు):</p>
<p>జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సంయుక్తంగా భూమిపూజ నిర్వహించారు.</p>
<p>ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. కేంద్రీయ విద్యాలయం కోసం గతంలో రైతులకు చెందిన భూమి కేటాయింపులో ఇబ్బందులు ఎదురైనా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కృషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలోని ఐదు ఎకరాల విలువైన భూమిని కేటాయించగలిగామని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.</p>
<p>ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,289 కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని, వాటిలో 13.51 లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. తెలంగాణకు 39 కేంద్రీయ విద్యాలయాలు మంజూరుకాగా, ప్రస్తుతం 37 పాఠశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు ప్రతీకలని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ దళాల సిబ్బంది పిల్లలతో పాటు స్థానిక విద్యార్థులకు కూడా ప్రవేశాల్లో అవకాశం ఉంటుందని వివరించారు. జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో ఐదు ఎకరాల భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.</p>
<p>ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం రావడం జిల్లాకు గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్కరణలను అమలు చేస్తోందని తెలిపారు.</p>
<p>జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతో జాతీయ రహదారి సమీపంలోని ఐదు ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించామని చెప్పారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనంలోనే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.</p>
<p>జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయం కోసం నిరంతరం కృషి చేసిన ఫలితంగానే ఈ విద్యాసంస్థ జిల్లాకు వచ్చిందన్నారు. జగిత్యాల పరిసర ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం వంటి విద్యాసంస్థలు ఒకే ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయని తెలిపారు.</p>
<p>చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎంపీ అరవింద్ చేసిన కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యా రంగంలో విస్తృత సంస్కరణలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.</p>
<p>కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్. దినేష్, జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, చలగల్ గ్రామ సర్పంచ్ జున్ను రాజేందర్, ఆర్డీఓ మధుసూదన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10854/bhumi-puja-for-the-construction-of-kendriya-vidyalaya-building-for</link>
                <guid>https://www.prajamantalu.com/article/10854/bhumi-puja-for-the-construction-of-kendriya-vidyalaya-building-for</guid>
                <pubDate>Sun, 12 Jul 2026 19:50:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260712-wa0000.jpg"                         length="207604"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        