<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/4626/thank-you-for-purchasing" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>ధన్యం కొనుగోలు - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/4626/rss</link>
                <description>ధన్యం కొనుగోలు RSS Feed</description>
                
                            <item>
                <title>వడ్ల కొనుగోళ్లలో రూ.107 కోట్ల అవినీతి: మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి ప్రతిస్పందిస్తూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.</p>
<p>మంత్రి లక్ష్మణ్ కుమార్ తరచూ “రాజీనామా చేస్తా” అనే వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేసిన కొప్పుల ఈశ్వర్, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు.</p>
<p>జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించిన ఆయన, ఇప్పటికీ అనేక కొనుగోలు కేంద్రాల్లో సుమారు 20 శాతం వడ్లు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి వడ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.</p>
<p>40 కిలోల బస్తాకు 3.3 నుంచి 3.4 కిలోల వరకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10794/ex-minister-koppula-ishwar-challenges-minister-laxman-kumar-for-rs-107"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260610-wa0008.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి ప్రతిస్పందిస్తూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.</p>
<p>మంత్రి లక్ష్మణ్ కుమార్ తరచూ “రాజీనామా చేస్తా” అనే వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేసిన కొప్పుల ఈశ్వర్, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు.</p>
<p>జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించిన ఆయన, ఇప్పటికీ అనేక కొనుగోలు కేంద్రాల్లో సుమారు 20 శాతం వడ్లు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి వడ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.</p>
<p>40 కిలోల బస్తాకు 3.3 నుంచి 3.4 కిలోల వరకు కటింగ్ చేసిన ఘటనలు జరిగాయని, ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లినా రైతులు ఈ విషయాన్ని చెబుతారని ఆయన అన్నారు. వడ్లు పోసిన తర్వాత నెలల తరబడి రైతులు కల్లాల వద్ద వేచి ఉండాల్సి వచ్చిందని, కాంటాలు ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరిగిందని ఆరోపించారు.</p>
<p>గ్రేడ్ పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని, ప్రభుత్వం నిర్ణయించిన ఏ-గ్రేడ్ ధరకు బదులుగా బీ-గ్రేడ్‌గా చూపించి తక్కువ ధరకు కొనుగోలు చేశారని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. హమాలీ చార్జీలు గతంలో బస్తాకు రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.40 వరకు వసూలు చేశారని, లారీ రవాణా పేరిట అదనపు వసూళ్లు చేశారని పేర్కొన్నారు.</p>
<p>రైస్ మిల్లర్ల వద్ద తరుగు పేరిట ఒక లారీకి నాలుగు క్వింటాళ్ల వరకు కట్ చేశారని, ఇవన్నీ అవినీతి చర్యలేనని విమర్శించారు. రైతులు భయాందోళనల కారణంగా తక్కువ ధరలకు ధాన్యాన్ని విక్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేవని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు ఉండేవని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.</p>
<p>ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్‌కు 7 నుంచి 8 కిలోల వరకు తరుగు పేరుతో కోత విధించారని, మొత్తం జిల్లాలో సుమారు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంపై ఈ కోతల ద్వారా రూ.107 కోట్ల మేర రైతుల నష్టం జరిగిందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.</p>
<p>చివరగా మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు సవాల్ విసురుతూ, “అవినీతి జరగలేదని చెబుతున్న మీరు ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. లేకుంటే రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10794/ex-minister-koppula-ishwar-challenges-minister-laxman-kumar-for-rs-107</link>
                <guid>https://www.prajamantalu.com/article/10794/ex-minister-koppula-ishwar-challenges-minister-laxman-kumar-for-rs-107</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 19:34:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0008.jpg"                         length="82634"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        