<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/418/%23ndrf" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>#NDRF - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/418/rss</link>
                <description>#NDRF RSS Feed</description>
                
                            <item>
                <title>మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం — అన్ని శాఖలకు ఆదేశాలు</title>
                                    <description><![CDATA[<p><strong>డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ - నిలిపివేత</strong></p>
<p><strong>హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మొంథా తుపాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరి కోతల సమయం కావడంతో పాటు పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.</p>
<p>ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తుపాన్ ప్రభావం అధికంగా ఉండగా, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.</p>
<p>మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారిమళ్లించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/7660/cm-revanth-reddy-alerted-on-montha-typhoon-%E2%80%94-orders-to"><img src="https://www.prajamantalu.com/media/400/2025-10/img-20250829-wa0022.jpg" alt=""></a><br /><p><strong>డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ - నిలిపివేత</strong></p>
<p><strong>హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మొంథా తుపాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరి కోతల సమయం కావడంతో పాటు పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.</p>
<p>ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తుపాన్ ప్రభావం అధికంగా ఉండగా, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.</p>
<p>మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారిమళ్లించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.</p>
<p>తుపాన్ ప్రభావం ఉన్న జిల్లాల్లో <strong>ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సమన్వయంతో పనిచేయాలని</strong>, జిల్లా కలెక్టర్లు మార్గదర్శకత్వం వహించాలని ఆదేశించారు. వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు.</p>
<p><strong>నీటి పారుదల శాఖ</strong> రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని నిరంతరం పరిశీలిస్తూ, అవసరమైనప్పుడు నీటి విడుదలపై కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.</p>
<p><strong>రవాణా భద్రత పరంగా</strong>, రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాలు, లో లెవల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలు వంటి చోట్ల రాకపోకలను నిషేధించాలని, పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు.</p>
<p><strong>పారిశుద్ధ్య పరంగా</strong>, వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, క్రిమికీటకాలు విస్తరించే అవకాశం ఉన్నందున పురపాలక, గ్రామ సిబ్బంది తక్షణమే శుభ్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.</p>
<p><strong>వైద్యారోగ్య శాఖ</strong> అవసరమైన మందులు నిల్వ ఉంచి, అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం, పశునష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.</p>
<p>రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలతో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సమగ్రంగా పని చేయాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు <strong>జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖలు</strong> వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/7660/cm-revanth-reddy-alerted-on-montha-typhoon-%E2%80%94-orders-to</link>
                <guid>https://www.prajamantalu.com/article/7660/cm-revanth-reddy-alerted-on-montha-typhoon-%E2%80%94-orders-to</guid>
                <pubDate>Wed, 29 Oct 2025 20:38:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-10/img-20250829-wa0022.jpg"                         length="30836"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        