<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3942/telangana-municipal-politics" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Telangana Municipal Politics - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3942/rss</link>
                <description>Telangana Municipal Politics RSS Feed</description>
                
                            <item>
                <title>కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకే? బీఆర్ఎస్ తప్పుకోవడంతో రాజకీయ ఉత్కంఠకు తెర</title>
                                    <description><![CDATA[<p><strong>కరీంనగర్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):</strong></p>
<p>కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు చివరి నిమిషంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.</p>
<p>మొత్తం <strong>66 డివిజన్లలో</strong></p>
<ul>
<li><strong>భారతీయ జనతా పార్టీ (బీజేపీ) – 30 స్థానాలు</strong>,</li>
<li><strong>కాంగ్రెస్ – 14</strong>,</li>
<li><strong>భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) – 9</strong>,</li>
<li><strong>స్వతంత్రులు – 8</strong>,</li>
<li><strong>AIMIM – 3</strong>,</li>
<li><strong>ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ – 2</strong><br />స్థానాలు గెలుచుకున్నాయి.</li>
</ul>
<p>ఈ నేపథ్యంలో స్వతంత్ర కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచించింది. అయితే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన సాయి జ్యోతి ఓటు ఎవరికి పడుతుందన్న అంశం రాజకీయంగా కీలకంగా మారింది.</p>
<p>ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10252/brs-ceding-karimnagar-mayoral-seat-to-bjp-is-the-scene"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/overlay-image-(10)-(1).jpg" alt=""></a><br /><p><strong>కరీంనగర్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):</strong></p>
<p>కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు చివరి నిమిషంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.</p>
<p>మొత్తం <strong>66 డివిజన్లలో</strong></p>
<ul>
<li><strong>భారతీయ జనతా పార్టీ (బీజేపీ) – 30 స్థానాలు</strong>,</li>
<li><strong>కాంగ్రెస్ – 14</strong>,</li>
<li><strong>భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) – 9</strong>,</li>
<li><strong>స్వతంత్రులు – 8</strong>,</li>
<li><strong>AIMIM – 3</strong>,</li>
<li><strong>ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ – 2</strong><br />స్థానాలు గెలుచుకున్నాయి.</li>
</ul>
<p>ఈ నేపథ్యంలో స్వతంత్ర కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచించింది. అయితే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన సాయి జ్యోతి ఓటు ఎవరికి పడుతుందన్న అంశం రాజకీయంగా కీలకంగా మారింది.</p>
<p>ఈ క్రమంలో మంత్రి <strong>పొన్నం ప్రభాకర్</strong> స్పందిస్తూ, “కరీంనగర్ మేయర్ పీఠం పోటీలో కాంగ్రెస్ కూడా చివరి వరకు ప్రయత్నం చేస్తుంది” అని ప్రకటించారు. దీంతో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీకి దిగుతాయన్న వార్తలు ఊపందుకున్నాయి.</p>
<p>అయితే, చివరి నిమిషంలో బీఆర్ఎస్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. మొత్తం 9 కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో ఓటుతో కలిపి 10 ఓట్లు ఉన్నప్పటికీ, <strong>కరీంనగర్ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది</strong>. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ వ్యూహాలు ఫలించకుండా పోయాయి.</p>
<p>బీఆర్ఎస్ తప్పుకోవడంతో రాజకీయ ఉత్కంఠకు తెరపడినట్లైంది. 30 కార్పొరేటర్లను గెలుచుకున్న బీజేపీకి, ఇద్దరు స్వతంత్రులు మరియు రెండు ఎక్స్ అఫిషియో ఓట్ల మద్దతుతో కలిపి <strong>మొత్తం 34 సభ్యుల బలం</strong> లభించింది. దీంతో మేయర్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన మెజారిటీ బీజేపీకి సమకూరింది.</p>
<p>ఈ పరిణామంతో <strong>తెలంగాణ చరిత్రలో తొలిసారి బీజేపీ కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం స్పష్టమైంది</strong>. కేంద్ర మంత్రి <strong>బండి సంజయ్</strong> వర్గంలో, అలాగే కాషాయ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.</p>
<p>అయితే రాజకీయాల్లో చివరి నిమిషం వరకు మార్పులు చోటుచేసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం నిజంగా బీజేపీకే దక్కుతుందా? లేదా చివరి క్షణంలో కొత్త సమీకరణలు తెరపైకి వస్తాయా? అన్నది ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే..</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10252/brs-ceding-karimnagar-mayoral-seat-to-bjp-is-the-scene</link>
                <guid>https://www.prajamantalu.com/article/10252/brs-ceding-karimnagar-mayoral-seat-to-bjp-is-the-scene</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 10:20:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/overlay-image-%2810%29-%281%29.jpg"                         length="16252"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో కీలక మలుపు: చైర్మన్ పీఠం బీఆర్ఎస్‌కేనా?</title>
                                    <description><![CDATA[<p><strong>రాయికల్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):</strong></p>
<p>జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని వింత, కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి..రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఏకంకవలనే ప్రయత్నం ఆశ్చర్య పరుస్తోంది. అధిక సంఖ్యలో సీట్లు గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లాంటి వారు ఓటర్లుగా లేరు.</p>
<p>ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై పట్టణంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.</p>
<p>రాయికల్ మున్సిపల్ పరిధిలో మొత్తం <strong>12 కౌన్సిలర్ స్థానాలు</strong> ఉండగా,</p>
<ul>
<li><strong>బీజేపీ – 5 స్థానాలు</strong>,</li>
<li><strong>కాంగ్రెస్ – 3 స్థానాలు</strong>,</li>
<li><strong>బీఆర్ఎస్ – 3 స్థానాలు</strong>,</li>
<li><strong>స్వతంత్ర అభ్యర్థి – 1 స్థానం</strong><br />గెలుచుకున్నారు. దీంతో ఎవరికి సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో, స్వతంత్ర కౌన్సిలర్ పాత్ర కీలకంగా మారింది.</li>
</ul>
<p>ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10250/a-key-turning-point-in-raikal-municipal-politics-is-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/overlay-image-(9).jpg" alt=""></a><br /><p><strong>రాయికల్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):</strong></p>
<p>జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని వింత, కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి..రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఏకంకవలనే ప్రయత్నం ఆశ్చర్య పరుస్తోంది. అధిక సంఖ్యలో సీట్లు గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లాంటి వారు ఓటర్లుగా లేరు.</p>
<p>ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై పట్టణంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.</p>
<p>రాయికల్ మున్సిపల్ పరిధిలో మొత్తం <strong>12 కౌన్సిలర్ స్థానాలు</strong> ఉండగా,</p>
<ul>
<li><strong>బీజేపీ – 5 స్థానాలు</strong>,</li>
<li><strong>కాంగ్రెస్ – 3 స్థానాలు</strong>,</li>
<li><strong>బీఆర్ఎస్ – 3 స్థానాలు</strong>,</li>
<li><strong>స్వతంత్ర అభ్యర్థి – 1 స్థానం</strong><br />గెలుచుకున్నారు. దీంతో ఎవరికి సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో, స్వతంత్ర కౌన్సిలర్ పాత్ర కీలకంగా మారింది.</li>
</ul>
<p>ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ తన పట్టు నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, స్వతంత్ర కౌన్సిలర్లతో సంప్రదింపులు జరిపి, వారిని శిబిరానికి తరలించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.</p>
<p>ఇదిలా ఉండగా, ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ కూడా చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుని వ్యూహాలను ముమ్మరం చేసింది. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగుతోంది.</p>
<p>ఇప్పటికే అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, రేపు జరగనున్న మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో <strong>బీఆర్ఎస్ అభ్యర్థిగా కట్కమ్ రవి పేరు ఖరారైనట్లు</strong> తెలుస్తోంది. పార్టీ ఉన్నత నాయకత్వం సూచనలతో ఆయనను అధికారిక అభ్యర్థిగా నిలబెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.</p>
<p>మున్సిపల్ కౌన్సిలర్ల మెజారిటీ మద్దతు రవికే ఉన్నట్లు వార్తలు రావడంతో, ఎన్నిక దాదాపు ఏకగ్రీవంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాయికల్ పట్టణ రాజకీయాల్లో ఈ పరిణామం పెద్ద చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే విజయోత్సవాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.</p>
<p>అధికారిక ప్రకటన వెలువడితే, రాయికల్ మున్సిపల్ పాలనలో బీఆర్ఎస్ కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రజలంతా రేపటి చైర్మన్ ఎన్నికల ఫలితాలపైనే దృష్టి కేంద్రీకరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10250/a-key-turning-point-in-raikal-municipal-politics-is-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10250/a-key-turning-point-in-raikal-municipal-politics-is-the</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 09:27:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/overlay-image-%289%29.jpg"                         length="41199"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        