<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3896/unannounced-alliance" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Unannounced alliance - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3896/rss</link>
                <description>Unannounced alliance RSS Feed</description>
                
                            <item>
                <title>ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడంతోనే కాంగ్రెస్ గెలిచింది - కవిత </title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మున్సిపల్ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ <strong>అంబటి జోజిరెడ్డి</strong>, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి <strong>రియాజ్ అహ్మద్</strong> పాల్గొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ,<br />మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే ఎక్కువ స్థానాలు గెలుచుకుందని విమర్శించారు. మరోవైపు, ప్రజలు తమకు గుడులు కట్టారంటూ ప్రచారం చేసుకునే <strong>బీఆర్ఎస్</strong> చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకు పరిమితమైందన్నారు. గతంలో 90 శాతం మున్సిపాలిటీల్లో గెలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 16 మున్సిపాలిటీలకే పరిమితమైందని తెలిపారు.</p>
<p>ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డాయని కవిత అభిప్రాయపడ్డారు. తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వని <strong>బీజేపీ</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10216/congress-won-because-there-was-no-alternative-party-for-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260214-wa0911.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మున్సిపల్ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు <strong>కల్వకుంట్ల కవిత</strong> స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ <strong>అంబటి జోజిరెడ్డి</strong>, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి <strong>రియాజ్ అహ్మద్</strong> పాల్గొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ,<br />మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే ఎక్కువ స్థానాలు గెలుచుకుందని విమర్శించారు. మరోవైపు, ప్రజలు తమకు గుడులు కట్టారంటూ ప్రచారం చేసుకునే <strong>బీఆర్ఎస్</strong> చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకు పరిమితమైందన్నారు. గతంలో 90 శాతం మున్సిపాలిటీల్లో గెలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 16 మున్సిపాలిటీలకే పరిమితమైందని తెలిపారు.</p>
<p>ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డాయని కవిత అభిప్రాయపడ్డారు. తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వని <strong>బీజేపీ</strong> కరీంనగర్ మేయర్ స్థానం తప్ప మిగతా చోట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తమలాంటి కొత్త తరహా రాజకీయ శక్తులను ప్రజలు ఆదరించారని చెప్పారు.</p>
<p>త్వరలోనే రాజకీయ పార్టీగా మారుతామని ప్రకటించినప్పటికీ, సమయం తక్కువగా ఉండటంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి పోటీ చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో జాగృతి–ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసిన అభ్యర్థుల్లో మొత్తం 40 మంది గెలిచారని, అధికారికంగా 33 స్థానాలు వచ్చినప్పటికీ బీ–ఫామ్ సమస్యల కారణంగా మరో ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులే గెలిచారని వివరించారు.</p>
<p>మున్సిపల్ ఎన్నికల్లో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని, ప్రభుత్వ ఖర్చుతోనే ప్రచారం జరిగిందని కవిత ఆరోపించారు. అయినప్పటికీ ఎన్నికల సంఘం, ప్రతిపక్షాలు స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య నార్త్ తెలంగాణలో అప్రకటిత పొత్తు ఉందని, మున్సిపల్ ఎన్నికలు ఆ పొత్తుకు తొలి మెట్టు అని అన్నారు.</p>
<p>ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్‌లోనూ జాగృతి–ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. వడ్డెపల్లి మున్సిపాలిటీని ఇరు పార్టీలూ కలిసే గెలుచుకున్నామని, దీనిపై ఎలాంటి గందరగోళం అవసరం లేదన్నారు.</p>
<p>హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, రామగుండం ఎమ్మెల్యే తమ అభ్యర్థులను బెదిరించారని ఆరోపించారు. ఉత్తర తెలంగాణలో సీపీఐ రాజకీయంగా పూర్తిగా బలహీనమైందని, భవిష్యత్‌లో కార్మికుల కోసం నిజంగా పోరాడే శక్తులకే ప్రజలు మద్దతు ఇస్తారని చెప్పారు.</p>
<p>ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌వీఆర్ ప్రసాద్, జాగృతి ప్రధాన కార్యదర్శి ఎల్. రూప్ సింగ్, నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10216/congress-won-because-there-was-no-alternative-party-for-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10216/congress-won-because-there-was-no-alternative-party-for-the</guid>
                <pubDate>Sat, 14 Feb 2026 16:08:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260214-wa0911.jpg"                         length="233071"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        