<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3760/b" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>b - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3760/rss</link>
                <description>b RSS Feed</description>
                
                            <item>
                <title>ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి పనులు ఆగబోవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి చేసిన విమర్శలకు స్పందించారు.</p>
<p>జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శలుగా కాకుండా ద్వేషపూరితంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. కార్యకర్తలను పక్కన పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రహస్యంగా కలుస్తూ మరోవైపు రాజకీయంగా భిన్నమైన వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత పదేళ్లపాటు కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలాభిషేకం చేశారని గుర్తుచేశారు.</p>
<p>ప్రజల కోసం పనిచేస్తున్న తనను ‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా అభివర్ణించడం విడ్డూరంగా ఉందని సంజయ్ కుమార్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం కూడా ప్రైవేట్ కంపెనీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/11033/mla-dr-sanjay-kumar-said-that-no-matter-how-many"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260830-wa0820(2).jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి పనులు ఆగబోవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి చేసిన విమర్శలకు స్పందించారు.</p>
<p>జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శలుగా కాకుండా ద్వేషపూరితంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. కార్యకర్తలను పక్కన పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రహస్యంగా కలుస్తూ మరోవైపు రాజకీయంగా భిన్నమైన వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత పదేళ్లపాటు కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలాభిషేకం చేశారని గుర్తుచేశారు.</p>
<p>ప్రజల కోసం పనిచేస్తున్న తనను ‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా అభివర్ణించడం విడ్డూరంగా ఉందని సంజయ్ కుమార్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం కూడా ప్రైవేట్ కంపెనీ నడపడం అవుతుందా అని ప్రశ్నించారు.</p>
<p><strong>ఇందిరమ్మ కాలనీపై 17 ఏళ్ల తర్వాతే దృష్టి</strong></p>
<p>2008లో శంకుస్థాపన చేసిన ఇందిరమ్మ కాలనీని ఇన్నేళ్లుగా పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. 17 ఏళ్ల తర్వాత తాను కాలనీ సమస్యలపై దృష్టి సారించి ఇళ్ల నిర్మాణం చేపట్టానని తెలిపారు. ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయడం వల్ల అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.34 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు.</p>
<p>రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 1,500 చొప్పున డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరైతే, జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం సుమారు 4,500 ఇళ్ల నిర్మాణంలో తన పాత్ర ఉందని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల్లో మంజూరైన ఇళ్లలో సగం కూడా నిర్మించలేదని ఆయన అన్నారు.</p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఎనిమిది నెలలు ఉన్న సమయంలో ఇందిరమ్మ కాలనీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం జీవన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాలనీ వాసులకు ఉగాది నాటికి బూరెలు తినిపిస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.</p>
<p>రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందనేది వాస్తవమని, అయితే వాటి నిర్మాణం విషయంలో స్థానికంగా ఎంత పని జరిగిందన్నదే ముఖ్యమని సంజయ్ కుమార్ అన్నారు.</p>
<p><strong>వైద్య, విద్య రంగాలకు ప్రాధాన్యం</strong></p>
<p>జగిత్యాల వైద్య కళాశాల ఏర్పాటులో తన కృషి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణలో వైద్య కళాశాల, ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల ఒకే ప్రాంతంలో ఉన్న జిల్లాగా జగిత్యాల నిలిచిందన్నారు. 334 మంది వైద్యులు, 366 మంది నర్సులు, 730 పడకల ఆసుపత్రికి అనుమతులు వచ్చినట్లు తెలిపారు.</p>
<p>నియోజకవర్గంలో ప్రస్తుతం 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, కొన్ని ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. మరో 2,000 ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత పాఠశాల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.</p>
<p>గొల్లపల్లి రోడ్డులో మహిళా డిగ్రీ కళాశాల విషయంలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో జీవన్‌రెడ్డి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తాటిపల్లి–చల్గల్ ఎత్తిపోతల పథకం పనుల పరిస్థితి ఏమిటో కూడా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.</p>
<p><strong>కొత్త బస్టాండ్ పెట్రోల్ బంక్ వివాదంపై ప్రశ్నలు</strong></p>
<p>జగిత్యాల కొత్త బస్టాండ్, పెట్రోల్ బంక్ వివాదానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే స్పందించారు. జీవన్‌రెడ్డి అనుచరులు మున్సిపల్‌లో ఉన్న సమయంలోనే సంబంధిత అనుమతులు ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు. పాత బస్టాండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ బంక్ అంశంపై తాను ఆలస్యం చేశానని విమర్శిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాటు ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అంతకుముందు మంత్రిగా ఉన్న సమయంలో ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు.</p>
<p>గత నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. తుఫిడ్క్ నిధులు గత ప్రభుత్వం మున్సిపల్‌లో డిపాజిట్ చేయకపోవడం వల్ల కొన్ని పనులు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.</p>
<p><strong>విమర్శలకు గత చరిత్రే సమాధానం</strong></p>
<p>ప్రతి అభివృద్ధి పనిని విమర్శించాలనుకుంటే గతంలో జరిగిన వ్యవహారాలపై పూర్తి చిట్టా తన వద్ద ఉందని సంజయ్ కుమార్ అన్నారు. తనపై విమర్శలు చేసే ముందు గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనుల పరిస్థితిని ప్రజలకు వివరించాలని సూచించారు.</p>
<p>తన హయాంలో అభివృద్ధి కంటే అణచివేత ధోరణికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని జీవన్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. మాజీ జెడ్పీ చైర్మన్‌పై విజిలెన్స్ కేసు పెట్టించారని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని భూ కబ్జాదారుడిగా విమర్శించారని గుర్తుచేశారు. దశాబ్ద కాలం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన విషయాలను ఇప్పుడు మర్చిపోయారా అని ప్రశ్నించారు.</p>
<p>జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రతిరోజూ అభివృద్ధి పనులకు భూమిపూజలు చేస్తున్నామని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. <strong>ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాలలో అభివృద్ధి మాత్రం ఆగదని</strong> ఆయన అన్నారు.</p>
<p>ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య, సీనియర్ నాయకుడు బండ శంకర్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, కౌన్సిలర్లు ప్రశాంత్ రావు, పిట్ట ధర్మరాజు, మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, నాయకులు కప్పల శ్రీకాంత్, రామకృష్ణారెడ్డి, మ్యానపురి మహేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/11033/mla-dr-sanjay-kumar-said-that-no-matter-how-many</link>
                <guid>https://www.prajamantalu.com/article/11033/mla-dr-sanjay-kumar-said-that-no-matter-how-many</guid>
                <pubDate>Sun, 30 Aug 2026 20:42:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260830-wa0820%282%29.jpg"                         length="82326"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్యారంటీల పేర మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించండి - కొప్పుల ఈశ్వర్ </title>
                                    <description><![CDATA[<p><strong>ధర్మపురి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):</strong></p>
<p>ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మాజీ మంత్రి <strong>కొప్పుల ఈశ్వర్</strong> గారు 15, 4, 7, 9, 8, 1 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.</p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, <strong>420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని</strong>, అందువల్ల ఈ ప్రభుత్వానికి ఓటు అడిగే అర్హత లేదన్నారు. ఎన్నికల్లో జూట మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గాలను మోసం చేశారని విమర్శించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260208-wa1467.jpg" alt="IMG-20260208-WA1467" width="1200" height="552" /></p>
<p>ఉద్యోగాల పేరుతో యువతను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మోసం చేసిందని, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను దగాచేసిందన్నారు. రేవంత్ పాలనలో మళ్లీ <strong>యూరియా కష్టాలు</strong> మొదలయ్యాయని, గతంలోలా చెప్పులు క్యూలైన్లలో పెట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.</p>
<p>రెండేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి లేక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10137/defeat-the-congress-that-cheated-in-the-name-of-guarantees"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260208-wa1461.jpg" alt=""></a><br /><p><strong>ధర్మపురి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):</strong></p>
<p>ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మాజీ మంత్రి <strong>కొప్పుల ఈశ్వర్</strong> గారు 15, 4, 7, 9, 8, 1 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.</p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, <strong>420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని</strong>, అందువల్ల ఈ ప్రభుత్వానికి ఓటు అడిగే అర్హత లేదన్నారు. ఎన్నికల్లో జూట మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గాలను మోసం చేశారని విమర్శించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260208-wa1467.jpg" alt="IMG-20260208-WA1467" width="1228" height="552"></img></p>
<p>ఉద్యోగాల పేరుతో యువతను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మోసం చేసిందని, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను దగాచేసిందన్నారు. రేవంత్ పాలనలో మళ్లీ <strong>యూరియా కష్టాలు</strong> మొదలయ్యాయని, గతంలోలా చెప్పులు క్యూలైన్లలో పెట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.</p>
<p>రెండేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి లేక ప్రజలు గోసపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదన్నారు. ఆశపడటం తప్పు కాదని, కానీ ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి మోసం చేయడం తప్పని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ‘అభయహస్తం’ అన్నారు గానీ, అది అభయహస్తం కాదని <strong>భస్మాసుర హస్తమని</strong> ధ్వజమెత్తారు.</p>
<p>ధర్మపురి పట్టణంలో తాను సుమారు <strong>రూ.9 కోట్లతో మాతా–శిశు ఆసుపత్రిని నిర్మించి ప్రారంభించానని</strong>, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆసుపత్రిలో ఫర్నిచర్, డాక్టర్లు, సిబ్బంది ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు.</p>
<p>ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను <strong>అఖండ మెజార్టీతో గెలిపించాలని</strong> ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10137/defeat-the-congress-that-cheated-in-the-name-of-guarantees</link>
                <guid>https://www.prajamantalu.com/article/10137/defeat-the-congress-that-cheated-in-the-name-of-guarantees</guid>
                <pubDate>Sun, 08 Feb 2026 20:02:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260208-wa1461.jpg"                         length="186837"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        