<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3749/mallaari" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>mallaari - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3749/rss</link>
                <description>mallaari RSS Feed</description>
                
                            <item>
                <title> తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణి జమ్మ మల్లారి మృతి </title>
                                    <description><![CDATA[<h6><strong><span style="color:rgb(35,120,5);">తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు విగ్రహం</span></strong></h6>
<p><span style="color:rgb(42,66,239);"><strong>ఒగ్గు వనితకు వినమ్ర శ్రద్ధాంజలి</strong></span></p>
<p>మహిళాస్వరంతో మల్లన్న మేల్కొలుపు —<br />పురుషాధిక్య రంగంలో ధైర్యంగా సవారి చేసిన మల్లారి ఇక లేరు.</p>
<p>కళా ప్రపంచంలో ఆడవేషం కట్టిన పురుషులు అనేకమంది లబ్ధప్రతిష్ఠులుగా నిలిచారు. కానీ పురుష ఆహార్యాన్ని ధరించి, ఒక జానపద కళారూపాన్ని జీవితాంతం భుజాన మోసిన స్త్రీమూర్తుల కథలు అరుదుగా మాత్రమే వినిపిస్తాయి. అలాంటి అరుదైన, అపూర్వమైన ఒగ్గుకళాకారిణి <strong>జమ్మ మల్లారి</strong>.</p>
<p>ఉగ్గుపాల వయసు నుంచే ఒగ్గుకథల వైపు మొగ్గు చూపిన ఆమె, ఆరు దశాబ్దాలకు పైగా పురుష ఆహార్యంలోనే ఆ జానపద కళారూపాన్ని తన జీవితంగా మార్చుకుంది. అయితే కామరతి వంటి ప్రత్యేక కళారూప ప్రదర్శనల్లో మాత్రం స్త్రీమూర్తిగా కనువిందు చేసింది. ఒగ్గుకళకే జీవితాన్ని అంకితం చేసి, తెలంగాణలో తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణిగా గుర్తింపు పొందిన మహనీయురాలు జమ్మ మల్లారి.</p>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>నపీర నాదమై మోగిన కంచుకుతిక – జమ్మ మల్లారి.</strong></span></h6>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10126/first-female-comic-artist-jamma-mallari-passed-away"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/mallari_jamma-imageonline.co-merged.jpg" alt=""></a><br /><h6><strong><span style="color:rgb(35,120,5);">తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు విగ్రహం</span></strong></h6>
<p><span style="color:rgb(42,66,239);"><strong>ఒగ్గు వనితకు వినమ్ర శ్రద్ధాంజలి</strong></span></p>
<p>మహిళాస్వరంతో మల్లన్న మేల్కొలుపు —<br />పురుషాధిక్య రంగంలో ధైర్యంగా సవారి చేసిన మల్లారి ఇక లేరు.</p>
<p>కళా ప్రపంచంలో ఆడవేషం కట్టిన పురుషులు అనేకమంది లబ్ధప్రతిష్ఠులుగా నిలిచారు. కానీ పురుష ఆహార్యాన్ని ధరించి, ఒక జానపద కళారూపాన్ని జీవితాంతం భుజాన మోసిన స్త్రీమూర్తుల కథలు అరుదుగా మాత్రమే వినిపిస్తాయి. అలాంటి అరుదైన, అపూర్వమైన ఒగ్గుకళాకారిణి <strong>జమ్మ మల్లారి</strong>.</p>
<p>ఉగ్గుపాల వయసు నుంచే ఒగ్గుకథల వైపు మొగ్గు చూపిన ఆమె, ఆరు దశాబ్దాలకు పైగా పురుష ఆహార్యంలోనే ఆ జానపద కళారూపాన్ని తన జీవితంగా మార్చుకుంది. అయితే కామరతి వంటి ప్రత్యేక కళారూప ప్రదర్శనల్లో మాత్రం స్త్రీమూర్తిగా కనువిందు చేసింది. ఒగ్గుకళకే జీవితాన్ని అంకితం చేసి, తెలంగాణలో తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణిగా గుర్తింపు పొందిన మహనీయురాలు జమ్మ మల్లారి.</p>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>నపీర నాదమై మోగిన కంచుకుతిక – జమ్మ మల్లారి.</strong></span></h6>
<p>రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామం ఆమె జన్మస్థలం. జమ్మ గుండాలు–చెన్నమ్మ దంపతులకు ఏడుగురు ఆడకూతుళ్లు, ముగ్గురు కొడుకులు. వారిలో ఒకరు మల్లారి. తండ్రి గుండాలు స్వయంగా ఒగ్గుకళాకారుడు. దేవుడి లగ్గాలు చేస్తూ, ఒగ్గుకథలు చెప్తూ జీవితం సాగించిన వ్యక్తి.</p>
<p>ఇతర సంతానం అంతగా ఆసక్తి చూపకపోయినా, మల్లారి మాత్రం చిన్ననాటి నుంచే ఒగ్గుకథలపై అపారమైన మక్కువ పెంచుకుంది. తండ్రితో కలిసి దేవుడి లగ్గాలకు, ఒగ్గు ప్రదర్శనలకు వెళ్తూ తాళం కొట్టడం, డోలు వాయించడం, శృతి పట్టడం నేర్చుకుంది. అలా వారసత్వ కళ ఆమె చేతుల్లో నెమ్మదిగా బలపడింది.</p>
<h5><strong><span style="color:rgb(186,55,42);">పదహారేళ్లకే తొలి ప్రదర్శన</span></strong></h5>
<p>పదహారేళ్ల వయసులోనే తొలిసారి స్వయంగా ఒగ్గుకథ చెప్పింది మల్లారి. ఆ తొలి ప్రదర్శనే ప్రేక్షకులను కట్టిపడేసింది. అలా మొదలైన ప్రస్థానం జీవితాంతం ఆగలేదు. బీరప్ప కథ, మల్లన్న కథ, ఎల్లమ్మ వ్యథ — ఏ గాథనైనా అనర్గళంగా, అద్భుతమైన లయ సమన్వయంతో ఆమె కథాగానం చేసేది.</p>
<p>పురుషులే ఆధిపత్యం చెలాయించిన రోజుల్లో గజ్జె కట్టి, తలపాగా చుట్టి, భుజాన గొంగళి వేసుకొని పురుష ఆహార్యంలోనే వేదికపై నిలబడింది. ఆమె కథ మొదలైతే చాలు… జనాలు పనులన్నీ వదిలిపెట్టి ప్రదర్శన వద్ద మైమరచిపోయేవారు. సొంత ఊరిలో మొదలైన ప్రదర్శనలు క్రమంగా ఇతర గ్రామాలకు, జిల్లాలకు విస్తరించాయి. వేలాది వేదికలపై తెలంగాణ ఒగ్గుకథకు ఆమె అపూర్వమైన ప్రతిష్ఠ తీసుకొచ్చింది.</p>
<h6><span style="color:rgb(42,66,239);">దేవుడికే అంకితం చేసిన జీవితం</span></h6>
<p>సాధారణ కుటుంబ జీవితం వైపు తిరగలేదు మల్లారి. పద్దెనిమిదో ఏట బీరప్ప స్వామినే భర్తగా స్వీకరించి, తన జీవితాన్ని దేవుడికే అంకితం చేసింది. ఒగ్గుకథనే తన సంతానంగా భావించి పెంచింది.</p>
<p>తెలంగాణలో ఎక్కడ బీరప్ప కల్యాణం జరిగినా “మల్లారి ఉండాల్సిందే” అన్నంతగా ఆమెకు గుర్తింపు వచ్చింది. వేలాది దేవుడి లగ్గాలు చేయించి భక్తి పరంపరను నిలబెట్టింది.</p>
<h6><span style="color:rgb(35,111,161);">అనర్గళ గాత్రం… అప్రతిహత నిబద్ధత</span></h6>
<p>చదువుకోలేకపోయినా, తండ్రి చెప్పిన ప్రతి కథను మస్తిష్కంలో చెక్కించుకుంది. గంటల తరబడి సాగే కథలను ఎలాంటి పుస్తకం చూడకుండా వినిపించే అపూర్వ సామర్థ్యం ఆమె సొంతం.</p>
<p>“నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు ఒగ్గుకథ చెబుతాను” అని 80 ఏళ్ల వయసులోనూ చెప్పిన ఆమె వినమ్రత అందరినీ ఆకట్టుకుంది. ఆరోగ్యం సహకరించకపోయినా, కథకు పిలుపు వస్తే శక్తినంతా కూడదీసుకుని వేదికపై నిలబడేది.</p>
<h5><span style="color:rgb(132,63,161);">తెలంగాణ తర్వాతే దక్కిన గౌరవం</span></h5>
<p>దశాబ్దాలపాటు కళా సేవ చేసినప్పటికీ గుర్తింపు ఆలస్యంగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ప్రభుత్వం జానపద కళలకు ప్రోత్సాహం ఇచ్చిన తర్వాతే మల్లారికి తగిన గౌరవం దక్కింది. భాషా సాంస్కృతిక శాఖ అప్పటి సంచాలకులు <strong>Dr. Harikrishna Mamidi</strong> గారి చొరవతో<br /><strong>2020 మార్చి 8న</strong> రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. లక్ష రూపాయల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించారు.</p>
<p>పురస్కారం స్వీకరించినప్పుడు మల్లారి అన్న మాటలు నేటికీ చిరస్మరణీయం:<br /><strong>“ఇది నాకు జరిగిన సన్మానం కాదు… మన ఒగ్గు కళకు జరిగిన గౌరవం.”</strong></p>
<h5><strong><span style="color:rgb(35,120,5);">శివైక్యం… కానీ శిఖరం శాశ్వతం</span></strong></h5>
<p><strong>07-02-2026</strong> న జమ్మ మల్లారి శివైక్యం చెందడం ఒగ్గు సమాజానికి తీరని లోటు.<br />అయితే ఆమె గాత్రం, ఆమె వినిపించిన గాథలు, ఆమె నిబద్ధత తెలంగాణ జానపద చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.</p>
<p>“నేను బతికున్నంతకాలం ఒగ్గుకథ చెబుతా… ఈ జీవితానికి ఇది సాలు” అని చెప్పిన మల్లారి జీవితం నిజంగా అజరామరం.</p>
<p><strong>తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం, తెలంగాణ బిసి కమీషన్ తొలి మాజీ  చైర్మన్ బి ఎస్ రాములు మల్లారి మృతికి సంతాపం తెలిపారు.</strong></p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                            <category>Entertainment </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10126/first-female-comic-artist-jamma-mallari-passed-away</link>
                <guid>https://www.prajamantalu.com/article/10126/first-female-comic-artist-jamma-mallari-passed-away</guid>
                <pubDate>Sun, 08 Feb 2026 14:23:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/mallari_jamma-imageonline.co-merged.jpg"                         length="47732"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        