<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3707/bellampally" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>బెల్లంపల్లి - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3707/rss</link>
                <description>బెల్లంపల్లి RSS Feed</description>
                
                            <item>
                <title>దళిత విద్యార్థినులకు పురుగుల అన్నం! ఆస్పత్రిలో 40 మంది విద్యార్థినులు</title>
                                    <description><![CDATA[<p><strong>మంచిర్యాల ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):</strong></p>
<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న <strong>ఎస్సీ బాలికల వసతి గృహంలో</strong> అమానుష ఘటన చోటుచేసుకుంది. వసతి గృహంలో భోజనం చేసిన <strong>సుమారు 40 మంది దళిత విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు.</strong> ఒక్కసారిగా విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పులతో తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో హాస్టల్‌లో కలకలం రేగింది.</p>
<p>వివరాల్లోకి వెళ్తే…<br />హాస్టల్‌లో మధ్యాహ్న భోజనంగా అందించిన <strong>మిల్ మేకర్ కర్రీలో పురుగులు ఉండటం</strong> విద్యార్థినులు గమనించారు. అయినప్పటికీ భోజనం చేసిన కొద్ది గంటల్లోనే పలువురు విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో హాస్టల్ సిబ్బంది హడావుడిగా విద్యార్థినులను <strong>బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి</strong> తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థినులకు చికిత్స కొనసాగుతోంది.</p>
<h6><strong><span style="color:rgb(224,62,45);">ఇది మొదటిసారి కాదు… మూడోసారి పునరావృతం</span></strong>!</h6>
<p>అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే…<br />ఈ హాస్టల్‌లో <strong>ఇది మూడోసారి ఫుడ్ పాయిజనింగ్ ఘటన జరగడం.</strong> గతంలో కూడా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10113/40-female-students-in-akhrila-annam-hospital-for-dalit-students"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img_20260207_184525.jpg" alt=""></a><br /><p><strong>మంచిర్యాల ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):</strong></p>
<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న <strong>ఎస్సీ బాలికల వసతి గృహంలో</strong> అమానుష ఘటన చోటుచేసుకుంది. వసతి గృహంలో భోజనం చేసిన <strong>సుమారు 40 మంది దళిత విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు.</strong> ఒక్కసారిగా విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పులతో తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో హాస్టల్‌లో కలకలం రేగింది.</p>
<p>వివరాల్లోకి వెళ్తే…<br />హాస్టల్‌లో మధ్యాహ్న భోజనంగా అందించిన <strong>మిల్ మేకర్ కర్రీలో పురుగులు ఉండటం</strong> విద్యార్థినులు గమనించారు. అయినప్పటికీ భోజనం చేసిన కొద్ది గంటల్లోనే పలువురు విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో హాస్టల్ సిబ్బంది హడావుడిగా విద్యార్థినులను <strong>బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి</strong> తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థినులకు చికిత్స కొనసాగుతోంది.</p>
<h6><strong><span style="color:rgb(224,62,45);">ఇది మొదటిసారి కాదు… మూడోసారి పునరావృతం</span></strong>!</h6>
<p>అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే…<br />ఈ హాస్టల్‌లో <strong>ఇది మూడోసారి ఫుడ్ పాయిజనింగ్ ఘటన జరగడం.</strong> గతంలో కూడా నాణ్యతలేని ఆహారం, పరిశుభ్రత లోపాలపై విద్యార్థినులు, తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.</p>
<p>కిచెన్‌లో శుభ్రత లేకపోవడం, పాడైన సరుకులతో వంటలు చేయడం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">తల్లిదండ్రుల ఆవేదన</span></strong></h6>
<p>సంఘటన విషయం తెలియగానే ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.<br />“<strong>మా పిల్లలు చదువుకుంటారని నమ్మి హాస్టళ్లకు పంపిస్తే, పురుగుల అన్నం పెట్టి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇది చదువా? లేక శిక్షనా?</strong>” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సరియైన వైద్యం కూడా అందట. లేదని ఆరోపిస్తున్నారు.</p>
<p>పేద, దళిత కుటుంబాల పిల్లలపైనే ఇలాంటి నిర్లక్ష్యం ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు.</p>
<h6><strong><span style="color:rgb(132,63,161);">కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు</span></strong></h6>
<p>విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది <strong>దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వమే</strong>నని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.<br />వసతి గృహాల పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందని, కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం కనీసం <strong>పిల్లలకు తినే ఆహారం నాణ్యతను కూడా చూడలేకపోతుందా?</strong> అని ప్రశ్నిస్తున్నారు.</p>
<p>వంటి చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.పేదల పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడే ఈ వ్యవస్థపై ప్రభుత్వం <strong>ఎప్పుడు కళ్లు తెరుస్తుందో చూడాలి.</strong></p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10113/40-female-students-in-akhrila-annam-hospital-for-dalit-students</link>
                <guid>https://www.prajamantalu.com/article/10113/40-female-students-in-akhrila-annam-hospital-for-dalit-students</guid>
                <pubDate>Sat, 07 Feb 2026 18:53:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img_20260207_184525.jpg"                         length="165643"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        