<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/3307/bjp" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>బిజెపి - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/3307/rss</link>
                <description>బిజెపి RSS Feed</description>
                
                            <item>
                <title>కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలతో తెలంగాణలో మార్పు – కవిత ప్రకటన</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ భవిష్యత్‌ను, చరిత్రను మార్చే రోజుగా ఈ నెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ రోజు ప్రకటించబోయే కొత్త పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని వెల్లడించారు.<br />బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. కవిత వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260408-wa0010-(1).jpg" alt="IMG-20260408-WA0010 (1)" width="1040" height="693" /><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రజల కోసం ప్రశ్నించే, పోరాడే, పరిష్కారాలను అందించే కొత్త తరహా రాజకీయాలు తీసుకురాబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో అధికార పక్షమైన Indian National Congress మరియు ప్రతిపక్షం Bharat Rashtra Samithi ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై మాట్లాడేది జాగృతి మాత్రమే అన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోందని తెలిపారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10596/change-in-telangana-with-new-blood-and-new-politics-%E2%80%93"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260408-wa0005.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ భవిష్యత్‌ను, చరిత్రను మార్చే రోజుగా ఈ నెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ రోజు ప్రకటించబోయే కొత్త పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని వెల్లడించారు.<br />బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. కవిత వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260408-wa0010-(1).jpg" alt="IMG-20260408-WA0010 (1)" width="1040" height="693"></img><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రజల కోసం ప్రశ్నించే, పోరాడే, పరిష్కారాలను అందించే కొత్త తరహా రాజకీయాలు తీసుకురాబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో అధికార పక్షమైన Indian National Congress మరియు ప్రతిపక్షం Bharat Rashtra Samithi ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై మాట్లాడేది జాగృతి మాత్రమే అన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోందని తెలిపారు.</p>
<p><br />దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి నిలబడి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు స్వయంపాలన వచ్చిందని భావించిన ప్రజలకు ఢిల్లీకి గులాంగిరి చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.<br />రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్రంపై కూడా స్పందించకుండా నరేంద్ర మోదీ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోందని విమర్శించారు.</p>
<p><br />గద్వాల్ ప్రాంతంలో గడీల ప్రభావం తొలగి ఉద్యమకారుల జెండా ఎగరాలని, చేనేత కార్మికులు, సీడ్ పత్తి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రానున్న మూడు సంవత్సరాలు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.<br />రంజిత్ కుమార్ మాట్లాడుతూ, కవిత కమిట్ అయితే ఎంత కష్టమైనా వెనుకడుగు వేయరని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఆమెదేనని పేర్కొన్నారు. జాగృతి జెండాను ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10596/change-in-telangana-with-new-blood-and-new-politics-%E2%80%93</link>
                <guid>https://www.prajamantalu.com/article/10596/change-in-telangana-with-new-blood-and-new-politics-%E2%80%93</guid>
                <pubDate>Wed, 08 Apr 2026 17:41:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260408-wa0005.jpg"                         length="194127"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..?  ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.</title>
                                    <description><![CDATA[<p>జగిత్యాల, జనవరి 24 (ప్రజా మంటలు)</p>
<p>40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడాన్ని జగిత్యాల బిజెపి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు.</p>
<p>శనివారం బిజెపి సీనియర్ నేతలు సీపెళ్లి రవీందర్, అంకార్ సుధాకర్, బాసెట్టి ప్రభాకర్, వెంకట్రాజం, రత్నాకర్ రెడ్డి, ఎర్ర శ్రీనివాస్,నవ్వోతు  సురేష్, మహేందర్ తదితరులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసిన ధర్మపురి అరవింద్ గెలుపు కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన బిజెపి సీనియర్ కార్యకర్తలను పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతూన్నారని విమర్శించారు.</p>
<p>పరాయి పార్టీ నాయకుల పై ఎంపీ సానుభూతి ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల జిల్లాలో పార్టీని ఎంతవరకు బలోపేతం చేశాడో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9894/jeevan-reddys-love-for-bjp-workers-or-mp-arvind-onteddu"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260124-wa1770.jpg" alt=""></a><br /><p>జగిత్యాల, జనవరి 24 (ప్రజా మంటలు)</p>
<p>40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడాన్ని జగిత్యాల బిజెపి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు.</p>
<p>శనివారం బిజెపి సీనియర్ నేతలు సీపెళ్లి రవీందర్, అంకార్ సుధాకర్, బాసెట్టి ప్రభాకర్, వెంకట్రాజం, రత్నాకర్ రెడ్డి, ఎర్ర శ్రీనివాస్,నవ్వోతు  సురేష్, మహేందర్ తదితరులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసిన ధర్మపురి అరవింద్ గెలుపు కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన బిజెపి సీనియర్ కార్యకర్తలను పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతూన్నారని విమర్శించారు.</p>
<p>పరాయి పార్టీ నాయకుల పై ఎంపీ సానుభూతి ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల జిల్లాలో పార్టీని ఎంతవరకు బలోపేతం చేశాడో చెప్పాలని నిలదీశారు.</p>
<p>గత 40 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని  జగిత్యాలలో ప్రాణాలకు తెగించి పనిచేసిన అనేకమంది సీనియర్ నాయకులను, కార్యకర్తలను పార్టీకి దూరం చేసి ఎలాంటి ప్రజాదరణ లేని నాయకులను వెంటేసుకొని అడపాదడపా  జగిత్యాలలో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళడమే తప్పా పార్టీ బలోపేతం కోసం అరవింద్ చేసిందేమీ లేదన్నారు. ఎంపిగా ఉన్న ధర్మపురి అరవింద్ గత మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం ఒక్కసారి కూడా జగిత్యాలలో అడుగుపెట్టలేదని, కార్యకర్తలమంతా కృషిచేసి పట్టణంలో  13వేల పై చిలుకు ఓట్లను సాధించామని తెలిపారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసిన భోగ శ్రావణి కోసం ఎంపీ తో పాటు రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ప్రచారం నిర్వహించినప్పటికీ జగిత్యాల పట్టణంలో కేవలం 15 వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా బిజెపి ఇన్చార్జి భోగ శ్రావణి హైదరాబాదు కే పరిమితం కావడం, ఎంపీ అరవింద్ జగిత్యాలముఖం కూడా చూడకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కనీసం కార్యకర్తలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న సీనియర్ పార్టీ కార్యకర్తలను కాదని ప్రజాదరణ లేని తమ అనుయాయులకు బీ ఫాం లు కట్టపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల మున్సిపాలిటీలో అన్ని క్షేత్రాలను సమన్వయపరిచి, గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇచ్చి నాయకులంతా కష్టపడితే కనీసం 15 కౌన్సిలర్ సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికైనా ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ జిల్లా  అధ్యక్షుడు మోర పెళ్లి సత్యనారాయణ రావు, భోగ శ్రావణి లు తమ ఒంటెద్దు పోకడలను మానుకోవాలని, లేనట్లయితే రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం జగిత్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి పార్టీని ప్రక్షాళన చేయాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9894/jeevan-reddys-love-for-bjp-workers-or-mp-arvind-onteddu</link>
                <guid>https://www.prajamantalu.com/article/9894/jeevan-reddys-love-for-bjp-workers-or-mp-arvind-onteddu</guid>
                <pubDate>Sat, 24 Jan 2026 20:13:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260124-wa1770.jpg"                         length="199240"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        