<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/271/minister" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>minister - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/271/rss</link>
                <description>minister RSS Feed</description>
                
                            <item>
                <title>ఎపిస్టీన్‌తో లేఖల వ్యవహారం: హరిదీప్ సింగ్ పూరి వివరణపై సందేహాలు</title>
                                    <description><![CDATA[<h6><strong><span style="color:rgb(42,66,239);">హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):</span></strong></h6>
<h6><br /><span style="color:rgb(132,63,161);">జెఫ్రీ ఎపిస్టీన్‌కు సంబంధించిన కేసు డాక్యుమెంట్లు, ఈమెయిల్ రికార్డులపై తాజాగా బయటకొచ్చిన ఫోటోలు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి గతంలో ఇచ్చిన వివరణలపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. అలాగే మాజీ ప్రధాన సమాచార కమీషనర్ యశ్వర్ధన్ సిన్హా పేరు కూడా బయటపడింది.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img_20260206_142015.jpg" alt="IMG_20260206_142015" width="616" height="279" /></span></h6>
<p>మొదటి ఫోటోలో కనిపిస్తున్న ఈమెయిల్ ప్రకారం, 2014 అక్టోబర్ 24న అంబాసిడర్‌గా రిటైర్ అయిన తరువాత కూడా హరిదీప్ సింగ్ పూరి ఒక మహిళకు వీసా సహాయం చేయాలంటూ ఎపిస్టీన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన వ్యక్తులను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రిటైర్డ్ అంబాసిడర్ పరమోద్ బజాజ్ ద్వారా ప్రక్రియ కొనసాగినట్లు ఈమెయిల్‌లో పేర్కొనబడింది.</p>
<p>ఈ నేపథ్యంలో, <strong>“ఎపిస్టీన్‌ను నేను కేవలం ప్రొఫెషనల్ పనుల కోసమే, అది కూడా డిజిటల్ ఇండియా సంబంధిత అంశాలపై మాత్రమే కలిశాను”</strong> అని పూరి గతంలో చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఈ డాక్యుమెంట్లు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10094/doubts-on-harideep-singh-puris-interpretation-of-letters-dealing-with"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img_20260206_141938.jpg" alt=""></a><br /><h6><strong><span style="color:rgb(42,66,239);">హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):</span></strong></h6>
<h6><br /><span style="color:rgb(132,63,161);">జెఫ్రీ ఎపిస్టీన్‌కు సంబంధించిన కేసు డాక్యుమెంట్లు, ఈమెయిల్ రికార్డులపై తాజాగా బయటకొచ్చిన ఫోటోలు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి గతంలో ఇచ్చిన వివరణలపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. అలాగే మాజీ ప్రధాన సమాచార కమీషనర్ యశ్వర్ధన్ సిన్హా పేరు కూడా బయటపడింది.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img_20260206_142015.jpg" alt="IMG_20260206_142015" width="616" height="279"></img></span></h6>
<p>మొదటి ఫోటోలో కనిపిస్తున్న ఈమెయిల్ ప్రకారం, 2014 అక్టోబర్ 24న అంబాసిడర్‌గా రిటైర్ అయిన తరువాత కూడా హరిదీప్ సింగ్ పూరి ఒక మహిళకు వీసా సహాయం చేయాలంటూ ఎపిస్టీన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన వ్యక్తులను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రిటైర్డ్ అంబాసిడర్ పరమోద్ బజాజ్ ద్వారా ప్రక్రియ కొనసాగినట్లు ఈమెయిల్‌లో పేర్కొనబడింది.</p>
<p>ఈ నేపథ్యంలో, <strong>“ఎపిస్టీన్‌ను నేను కేవలం ప్రొఫెషనల్ పనుల కోసమే, అది కూడా డిజిటల్ ఇండియా సంబంధిత అంశాలపై మాత్రమే కలిశాను”</strong> అని పూరి గతంలో చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఈ డాక్యుమెంట్లు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.</p>
<p>ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమిటంటే,<br />జెఫ్రీ ఎపిస్టీన్ ఇప్పటికే <strong>2008లో మహిళల అక్రమ రవాణా (women trafficking) కేసులో శిక్ష అనుభవించాడు</strong>. అలాంటి వ్యక్తి నేపథ్యం తెలియదని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఒక సీనియర్ డిప్లొమాట్‌గా పనిచేసిన వ్యక్తికి, అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన ఎపిస్టీన్ నేర చరిత్ర తెలియకపోవడం నమ్మశక్యమా అన్న సందేహం వ్యక్తమవుతోంది.</p>
<p>ఇక రెండవ ఫోటోలో ఉన్న అమెరికా కోర్టు డాక్యుమెంట్‌లో,<br />ఎపిస్టీన్ ఐలాండ్‌కు సంబంధించిన ఒక బాధితురాలి వాంగ్మూలంలో <strong>“YK Sinha”</strong> అనే పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆ డాక్యుమెంట్ ప్రకారం,  <strong class="Yjhzub"><span>యశవర్ధన్ కుమార్ సిన్హా</span> (Y K Sinha - </strong>07-11-2020 నుండి 03-10-2023 వరకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్) ఎపిస్టీన్ నెట్‌వర్క్‌తో ఏదో రూపంలో సంబంధం ఉన్నట్టు బాధితురాలు పేర్కొన్నట్టు ఉంది. అయితే ఇది <strong>ఆమె వాంగ్మూలంలో వచ్చిన ఆరోపణ మాత్రమే</strong>, ఇప్పటివరకు న్యాయపరంగా నిర్ధారణ కాలేదు.</p>
<p>ఈ మొత్తం వ్యవహారంలో రెండు కీలక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి:</p>
<ol>
<li>ఎపిస్టీన్ 2008లోనే నేరస్తుడిగా శిక్ష పొందిన విషయం తెలియదని చెప్పడం ఒక సీనియర్ డిప్లొమాట్‌కు ఎంతవరకు సమంజసం?</li>
<li>వీసా సహాయం లాంటి వ్యక్తిగత అంశాల్లో ఎపిస్టీన్ నెట్‌వర్క్‌ను ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది?</li>
</ol>
<p>ప్రస్తుతం ఈ డాక్యుమెంట్లు పబ్లిక్ డొమైన్‌లోకి రావడంతో,<br />హరిదీప్ సింగ్ పూరి, యశ్వంత్ సిన్హా ఈ అంశాలపై మరింత స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ బలపడుతోంది. ఇది కేవలం వ్యక్తుల పరువు అంశం మాత్రమే కాకుండా, దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయమని రాజకీయ, పౌర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.</p>
<p>ఈ వ్యవహారంపై సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.</p>
<p>గమనిక : ఈ వార్తలో ప్రస్తావించిన అంశాలు ఫోటోలలో కనిపించిన డాక్యుమెంట్లు, ఆరోపణల ఆధారంగా రూపొందించబడ్డాయి. న్యాయస్థానాల్లో తుది నిర్ధారణ అయ్యే వరకు ఇవి ఆరోపణలుగానే పరిగణించాలి.</p>
<hr />
<p>👉 </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International </category>
                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10094/doubts-on-harideep-singh-puris-interpretation-of-letters-dealing-with</link>
                <guid>https://www.prajamantalu.com/article/10094/doubts-on-harideep-singh-puris-interpretation-of-letters-dealing-with</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 14:38:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img_20260206_141938.jpg"                         length="31061"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<h6><strong><span style="color:rgb(120,3,3);">రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి</span></strong></h6>
<p><strong><span style="color:rgb(120,3,3);">రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది</span></strong></p>
<p>జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు):</p>
<p>సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా మల్ల రెడ్డి  చాలా కృషి చేశారని అన్నారు.</p>
<p>దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మండలంలో ఇంటర్ స్థాయి విద్య  అవకాశాలు లేని చోట, మండలానికి ఒక కళాశాల ఏర్పాటు చేయాలని భావించి,సారంగాపూర్ మండలంలో 2 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు. బీర్పూర్ మరియు సారంగాపూర్ మండలాలకు గుర్తింపు వచ్చింది అంటే దానికి కారణం కమ్మునూరు కలమడుగు గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై గల బ్రిడ్జి అని అన్నారు.</p>
<p>మన ప్రాంతానికి వాణిజ్యపరంగా మేలు కలిగితే,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వుట్నూరు కడెం జన్నారం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/7606/former-minister-jeevan-reddy-has-continuously-worked-for-the-development"><img src="https://www.prajamantalu.com/media/400/2025-10/img-20251027-wa0013.jpg" alt=""></a><br /><h6><strong><span style="color:rgb(120,3,3);">రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి</span></strong></h6>
<p><strong><span style="color:rgb(120,3,3);">రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది</span></strong></p>
<p>జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు):</p>
<p>సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా మల్ల రెడ్డి  చాలా కృషి చేశారని అన్నారు.</p>
<p>దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మండలంలో ఇంటర్ స్థాయి విద్య  అవకాశాలు లేని చోట, మండలానికి ఒక కళాశాల ఏర్పాటు చేయాలని భావించి,సారంగాపూర్ మండలంలో 2 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు. బీర్పూర్ మరియు సారంగాపూర్ మండలాలకు గుర్తింపు వచ్చింది అంటే దానికి కారణం కమ్మునూరు కలమడుగు గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై గల బ్రిడ్జి అని అన్నారు.</p>
<p>మన ప్రాంతానికి వాణిజ్యపరంగా మేలు కలిగితే,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వుట్నూరు కడెం జన్నారం ప్రాంత గిరిజనులకు ఆదివాసులకు విద్య వైద్య సదుపాయాలకు ఉత్తర ద్వారం తలుపులు తెరిచినట్టయిందని అన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2025-10/img-20251027-wa0014.jpg" alt="IMG-20251027-WA0014" width="1280" height="960"></img></p>
<h6><strong><span style="color:rgb(120,3,3);">రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి</span></strong></h6>
<p> రాజుల చెరువు (రోల్లవాగు) ను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కాల్వల ఏర్పాటు సమయంలో బీర్పూర్ ప్రాంతంతో పాటుగా ధర్మపురి మండలానికి సాగునీటి ఎద్దటి కలగకుండా చూడాలని ఈ రాజుల చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 0.25 TMC నిలువ సామర్థ్యంతో రోళ్లవాగు ప్రాజెక్టుగా రూపొందించి ఎస్సారెస్పీలో ఇది అంతర్భాగంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా దీన్ని రూపొందించడం జరిగిందాని తెలిపారు.</p>
<p>జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా ఇలా తెలిపారు:</p>
<p>సాగునీటితో పాటుగా త్రాగునీరు కూడా అందించాలని రక్షిత మంచినీటి సరఫరా చేయాలని  ఈ ఫిల్టర్ బెడ్ సౌకర్యం ఎక్కడ లేకుండే కానీ బీర్పూర్ లో ఏర్పాటు చేశాం .</p>
<p> తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ కరీంనగర్ కు మొట్టమొదటిసారి పర్యటనకు వచ్చినప్పుడు, నేను శాసన సభ్యునిగా ఉన్న సమయంలో రాయికల్ మండలం బోర్నపల్లి మరియు కడెం మండలం బెల్లాల గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై వంతెన నిర్మిస్తే ఈ ప్రాంతానికి భవిష్యత్తు వేసినట్టు అవుతాం అని కెసిఆర్ గారికి విజ్ఞప్తి చేయడంతో వెంటనే 70 కోట్లు మంజూరు చేసినారు. </p>
<p>కొప్పుల ఈశ్వర్ ధర్మపురి శాసనసభ్యులుగా ఉన్న సమయంలో రోళ్లవాగు ఆధునికరణ అనేది తెరమీదకి తీసుకువచ్చి 60 కోట్లతో మంజూరై 153 కోట్లకు వెళ్ళింది ఇప్పుడు.</p>
<p>బోర్నపల్లి వంతెన దాదాపుగా రెండు మూడు సంవత్సరాలలో పూర్తి చేసుకుని వినియోగంలోకి తెచ్చాం.రాజకీయ ప్రాతినిధ్యం ఎవరిది ఉన్న నిర్మాణంలో మాత్రం అలసత్వం. ఈ నిర్మాణ అలసత్వ కారణంగా మత్స్యకారుల కోట్లాది రూపాయల మత్స్య సంపద కోల్పోయింది. </p>
<p>బీర్పూర్ మండలం నర్సింహులపల్లి, తుంగూరు, తాళ్ల ధర్మారం గ్రామాల భూముల్లో ఇసుక మేటలు వేయగా రైతులు వాటిని తొలగించడానికి భూమి దరకు సమానంగా ఖర్చయింది </p>
<p><strong><span style="color:rgb(120,3,3);">రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది</span></strong></p>
<p>అప్పటి అలసత్వాన్ని ప్రభుత్వ వైపల్యమా లేక  ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులను అనడమా? ఎవరిని  అనడమో కానీ ఆ అలసత్వంతో నిర్మాణం జాప్యం కావడంతో ఇటు మత్స్యకారులు తీవ్ర నష్టపోయినారు. పది సంవత్సరాల నుండి అక్కడ చేపల పెంపకం అవకాశం కోల్పోయారు.</p>
<p>కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్న సమయంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో బీర్పూర్ లో మేము నాలుగు గంటలు ధర్నా చేశాం. ఎస్సారెస్పీ అధికారులు దిగివచ్చి రెండో పంటకు నీరు విడుదల చేస్తామని చెప్పడంతో మేము ధర్నా విరమించాం </p>
<p>ఉమ్మడి రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని మా బాధ్యతగా భావించి చేశాంటిఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా మేము ఆ రోజు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మా బాధ్యత మేము నిర్వహించాం</p>
<p>వాస్తవంగా పనులు నిలిచిపోవడానికి కారణం పెండింగ్ బిల్స్ చెల్లింపు లేకపోవడం.తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్ళగానే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 30 కోట్ల బిల్లులను చెల్లింపు చేశాం</p>
<p>.25 TMC నిల్వకు అదనంగా 1 TMC ప్రతిపాదన ఉన్నదో అదనపు నిల్వ సామర్థ్యానికి రెవెన్యూ ల్యాండ్ ముంపుకు గురవుతుంది దానికి అదనంగా ఫారెస్ట్ ల్యాండ్ ముంపుకు దాదాపు 800 ఎకరాలు ముంపుకు గురవుతుంది</p>
<p>రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ముంపుకు గురవుతున్నదో దానికి ప్రతిగా రెవెన్యూ ల్యాండ్ ఇవ్వాలి ప్రతిపాదించడం లోపల అప్పటి ప్రాతినిధ్యం చొరవ చూపెట్టక లేకపోవడంతోని ఈ జాప్యం జరిగింది</p>
<p>కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్స్ తో పాటుగా అటవీ శాఖకు చెందిన భూమి ముంపుకు గురవుతుందో దానికి ప్రతిగా పెగడపల్లి మండల నంచర్ల గొల్లపల్లి మండల చందోలి దట్నూర్ ప్రాంతం నుండి సబ్ స్యూడ్ ల్యాండ్ రెవెన్యూకు ప్రతిపాదించడంతో పాటుగా ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ నుండి ఢిల్లీకి ప్రతిపాదన పోతుంది దాని అనుమతి కేంద్ర ప్రభుత్వం నుండి రావాలి</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/7606/former-minister-jeevan-reddy-has-continuously-worked-for-the-development</link>
                <guid>https://www.prajamantalu.com/article/7606/former-minister-jeevan-reddy-has-continuously-worked-for-the-development</guid>
                <pubDate>Mon, 27 Oct 2025 13:49:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-10/img-20251027-wa0013.jpg"                         length="143900"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        