<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/1780/hyderabad-news" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>హైదరాబాద్ వార్తలు - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/1780/rss</link>
                <description>హైదరాబాద్ వార్తలు RSS Feed</description>
                
                            <item>
                <title>జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ కొనసాగుతోంది – ఏప్రిల్‌లోనే కొత్త కార్డులు జారీ - కమీషనర్ ప్రియాంక </title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక తెలిపారు.<br />ఇటీవల అక్రిడిటేషన్ దరఖాస్తులపై వస్తున్న వార్తలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే అందిన దరఖాస్తులను ఈ నెల 10న జరగనున్న స్టేట్ లెవల్ అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో పరిశీలించి, అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.<br />అర్హులైన జర్నలిస్టులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను సమర్పించాలని, ఈ ప్రక్రియను ఏప్రిల్ నెలలోనే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు..</p>
<p><br />అలాగే జిల్లా స్థాయిలో కూడా అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలను ఈ నెలలోనే నిర్వహించి, అర్హులైన వారికి కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. అందువల్ల జిల్లా స్థాయిలో ఉన్న జర్నలిస్టులు వీలైనంత త్వరగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.<br />జర్నలిస్టుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10589/the-process-of-accreditation-of-journalists-is-going-on-%E2%80%93"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/fb_img_1775549726579.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక తెలిపారు.<br />ఇటీవల అక్రిడిటేషన్ దరఖాస్తులపై వస్తున్న వార్తలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే అందిన దరఖాస్తులను ఈ నెల 10న జరగనున్న స్టేట్ లెవల్ అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో పరిశీలించి, అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.<br />అర్హులైన జర్నలిస్టులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను సమర్పించాలని, ఈ ప్రక్రియను ఏప్రిల్ నెలలోనే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు..</p>
<p><br />అలాగే జిల్లా స్థాయిలో కూడా అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలను ఈ నెలలోనే నిర్వహించి, అర్హులైన వారికి కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. అందువల్ల జిల్లా స్థాయిలో ఉన్న జర్నలిస్టులు వీలైనంత త్వరగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.<br />జర్నలిస్టుల గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సి.హెచ్. ప్రియాంక తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10589/the-process-of-accreditation-of-journalists-is-going-on-%E2%80%93</link>
                <guid>https://www.prajamantalu.com/article/10589/the-process-of-accreditation-of-journalists-is-going-on-%E2%80%93</guid>
                <pubDate>Tue, 07 Apr 2026 13:50:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/fb_img_1775549726579.jpg"                         length="13245"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్ మార్చ్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.</p>
<p><br />అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260308-wa0011.jpg" alt="IMG-20260308-WA0011" width="1200" height="656" /><br />దేశంలోని కొన్ని ప్రధాన నగరాలు ప్రస్తుతం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ముంబయ్‌లో భారీ వర్షాలు పడితే నగరం అస్తవ్యస్తమవుతుందని, ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని చెప్పారు. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, చెన్నైలో వరదల సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని గుర్తు చేశారు.</p>
<p><br />ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో హైదరాబాద్‌లో తలెత్తకూడదని ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో వాయు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10463/100-electric-rtc-buses-in-hyderabad-by-december-9-2026"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260308-wa0012.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్ మార్చ్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.</p>
<p><br />అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260308-wa0011.jpg" alt="IMG-20260308-WA0011" width="1280" height="656"></img><br />దేశంలోని కొన్ని ప్రధాన నగరాలు ప్రస్తుతం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ముంబయ్‌లో భారీ వర్షాలు పడితే నగరం అస్తవ్యస్తమవుతుందని, ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని చెప్పారు. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, చెన్నైలో వరదల సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని గుర్తు చేశారు.</p>
<p><br />ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో హైదరాబాద్‌లో తలెత్తకూడదని ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో వాయు నాణ్యత ఆరెంజ్ స్థాయికి చేరిందని, భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.</p>
<p><br />నగరంలో చెత్త సమస్య, దోమల సమస్య, మూసీ నదిలో కాలుష్యం వంటి అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఢిల్లీలో యమునా నది అభివృద్ధి, ఉత్తరప్రదేశ్‌లో గంగా నది శుద్ధి, గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల మాదిరిగానే హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పారు.</p>
<p><br />సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం మూసీ నది వెంట బఫర్ జోన్ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు. నాలా ప్రాంతాల్లో 10 మీటర్లు, నదుల వద్ద 50 మీటర్ల బఫర్ జోన్ ఉండాలని నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు అనుమతించబడవని చెప్పారు.</p>
<p><br />మూసీ నది అభివృద్ధి కార్యక్రమం వల్ల ఇళ్లను కోల్పోయే వారికి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైతే వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కూడా కల్పిస్తామని చెప్పారు.</p>
<p><br />గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కొందరు చెబుతున్నారని, కానీ గాంధీ విగ్రహం కోసం సుమారు 70 కోట్లు, విజ్ఞాన కేంద్రం మరియు అభివృద్ధి పనులకు మొత్తం 200 కోట్లు మాత్రమే ఖర్చవుతాయని వివరించారు.<br />ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 13న ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడిస్తామని చెప్పారు.<br />కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో సుమారు 2800 డీజిల్ బస్సులు ఉన్నాయని, వాటి స్థానంలో 2026 డిసెంబర్ 9 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలిపారు. ఇప్పటికే 500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించినట్లు చెప్పారు.</p>
<p><br />డీజిల్ బస్సులను నగరం బయట ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఈవీ వాహనాలకు జీరో పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నగరంలో సుమారు రెండు లక్షల ఆటోలు ఉన్నాయని, వాటిని కూడా రెట్రోఫిటింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళిక ఉందన్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.</p>
<p><br />కాలుష్యానికి కారణమయ్యే రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను నగరం బయటకు తరలించే ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నారు.<br />తెలంగాణ రాష్ట్రం దేశ జనాభాలో కేవలం 2.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ దేశ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అప్పటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతానికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.</p>
<p><span style="color:rgb(22,145,121);"><strong>డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం</strong></span><br />ఈ లక్ష్య సాధనలో మహిళల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని, మీడియా సంస్థల్లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డెస్క్ జర్నలిస్టుల గుర్తింపులో కూడా ఎవరికీ అన్యాయం జరగదని చెప్పారు.<br />సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను తొలగించాలంటే వారికి సమాన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే దేశం కూడా ఆర్థికంగా బలపడుతుందని పేర్కొన్నారు.</p>
<p><br />ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంకతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు.</p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10463/100-electric-rtc-buses-in-hyderabad-by-december-9-2026</link>
                <guid>https://www.prajamantalu.com/article/10463/100-electric-rtc-buses-in-hyderabad-by-december-9-2026</guid>
                <pubDate>Sun, 08 Mar 2026 17:20:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260308-wa0012.jpg"                         length="184484"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వికటించిన ఐవీఎఫ్ చికిత్స… శంషాబాద్‌లో భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య </title>
                                    <description><![CDATA[శంషాబాద్‌లో ఐవీఎఫ్ చికిత్స వికటించడంతో ఎనిమిదో నెల గర్భిణి శ్రావ్య, గర్భంలోని కవలలు మృతి. షాక్ తట్టుకోలేక భర్త విజయ్ ఆత్మహత్య. కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసిన హృదయ విదారక ఘటన పూర్తి వివరాలు.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8337/aberrant-ivf-treatment-husband-commits-suicide-in-shamshabad-unable-to"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/img-20251118-wa0001.jpg" alt=""></a><br /><h5>:<span style="color:rgb(132,63,161);"><strong>ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాదం</strong></span></h5>
<p><strong>హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):</strong></p>
<p>శంషాబాద్‌లో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన ఒక కుటుంబాన్ని పూర్తిగా కూలదోసింది. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ముత్యాల విజయ్ (40), ఆయన భార్య శ్రావ్య (35) ఎనిమిదో నెల గర్భధారణలో ఉన్న సమయంలో జరిగిన విషాదం గ్రామాన్ని, బంధువులను, పరిచయాలను కన్నీరు మున్నీరయ్యేలా చేసింది.</p>
<h6><span style="color:rgb(132,63,161);"><strong>కవలలు రానున్నారని రెట్టించిన ఆనందం</strong></span></h6>
<p>ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్న విజయ్, శ్రావ్య దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం శంషాబాద్‌కు వచ్చి నివసిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు సంతానం రాకపోవడంతో ఐవీఎఫ్‌ ప్రక్రియ ద్వారా గర్భధారణకు ప్రయత్నించగా, అదృష్టం కలిసి వచ్చింది. కవలలు గర్భంలో పెరుగుతున్నాయని తెలిసిన తర్వాత ఆ కుటుంబం ఆనందానికి హద్దులు లేవు. కొత్త జీవితాన్ని స్వాగతించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.</p>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>హఠాత్తుగా కడుపు నొప్పి… దారుణ నిజం</strong></span></h6>
<p>2025 నవంబర్ 16 రాత్రి శ్రావ్యకు తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను అత్తాపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు చెప్పిన వార్త వారి ప్రపంచాన్ని కుమ్మరేసింది— <strong>కవలలు గర్భంలోనే మృతి చెందారు.</strong> ఈ షాక్‌తో శ్రావ్య అక్కడిక్కడే స్పృహ తప్పింది.</p>
<p>తర్వాత మెరుగైన చికిత్స కోసం గుడిమల్కాపూర్‌లోని మరో ఆసుపత్రికి తరలించగా కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. <strong>చికిత్స అందుకుంటూనే శ్రావ్య కూడా ప్రాణాలు విడిచింది.</strong> గర్భంలో ఉన్న కవల పిల్లలు, ఆ తల్లి మూడు ప్రాణాలు కొన్ని గంటల్లోనే ఆగిపోయాయి.</p>
<h6><span style="color:rgb(120,3,3);"><strong>తట్టుకోలేని బాధ… భర్త ఆత్మహత్య</strong></span></h6>
<p>భార్య మరణం, పుట్టబోయే ఇద్దరు పిల్లల మృతదేహాలు చూసి ముత్యాల విజయ్ తీవ్ర మానసిక వేదనలో మునిగిపోయాడు. తన జీవితమంతా తన భార్యతోనే అనుకున్న ఆయన, ఈ నష్టాన్ని భరించలేకపోయాడు.<br /><strong>సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని ఇంట్లో ఉరేసుకుని విజయ్ కూడా ప్రాణాలు తీసుకున్నాడు.</strong></p>
<p>కొన్ని రోజుల క్రితం కలలతో నిండిన ఆ ఇల్లు… ఈ రోజు నాలుగు ప్రాణాలు కోల్పోయిన శోకసంద్రంగా మారిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఈ విషాదంతో తీవ్రంగా మానసికంగా కుంగిపోయారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/8337/aberrant-ivf-treatment-husband-commits-suicide-in-shamshabad-unable-to</link>
                <guid>https://www.prajamantalu.com/article/8337/aberrant-ivf-treatment-husband-commits-suicide-in-shamshabad-unable-to</guid>
                <pubDate>Tue, 18 Nov 2025 10:10:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/img-20251118-wa0001.jpg"                         length="71179"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        