<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/tag/1062/revanth-reddy" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Revanth Reddy - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/tag/1062/rss</link>
                <description>Revanth Reddy RSS Feed</description>
                
                            <item>
                <title>జగిత్య BRS సభ మరో ఉద్యమానికి, కాంగ్రెస్ పతనానికి నాంది - బి ఆర్ ఎస్ నాయకులు </title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ దావా వసంత, మార్క్‌ఫెడ్ లోక బాపురెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.<br />మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాలలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు తెలంగాణ దేశంలో ముందంజలో నిలిచిందని చెప్పారు.<br />రైతు సంక్షేమంపై మాట్లాడిన ఆయన, కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు వంటి పథకాలు అమలు చేయగా, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు పంటలకు రైతు భరోసా హామీని నిలబెట్టలేదని విమర్శించారు. పంటల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10653/jagitya-brs-sabha-marks-the-beginning-of-another-movement-downfall"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260421-wa0012.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ దావా వసంత, మార్క్‌ఫెడ్ లోక బాపురెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.<br />మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాలలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు తెలంగాణ దేశంలో ముందంజలో నిలిచిందని చెప్పారు.<br />రైతు సంక్షేమంపై మాట్లాడిన ఆయన, కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు వంటి పథకాలు అమలు చేయగా, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు పంటలకు రైతు భరోసా హామీని నిలబెట్టలేదని విమర్శించారు. పంటల బీమా, భూమిలేని వారికి ప్రోత్సాహకాలు వంటి హామీలు అమలు కాలేదని అన్నారు.<br />కళ్యాణ లక్ష్మి పథకంలో బంగారం హామీ అమలు కాలేదని, కేసీఆర్ కిట్ పేరును మార్చినా సరే పథకాన్ని కొనసాగించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు.<br />మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై మాట్లాడుతూ, 30 నెలలుగా సమస్య పరిష్కారం కాలేదని, కేవలం రూ.400 కోట్లతో మరమ్మతులు సాధ్యమని నివేదికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కేసీఆర్‌ను దోషిగా చూపేందుకు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.<br />తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణంపై ఎన్నికల హామీ నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణకు విస్తృతంగా నీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.<br />రాష్ట్ర పాలనపై విమర్శలు చేస్తూ, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రేవంత్ రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే ఆయనకు వ్యక్తిగతంగా కీడు కోరడం లేదని చెప్పారు.<br />తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా పార్టీ మారకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నానని చెప్పారు. పదవుల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని, ఆత్మగౌరవం కోసం నిర్ణయాలు తీసుకున్నానని అన్నారు.<br />రాష్ట్రంలో కార్మికులు, రైతులు, బీసీలు, మైనార్టీలు అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఆర్‌టీసీ, సింగరేణి కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అభద్రతలో ఉన్నారని పేర్కొన్నారు.<br />చివరగా, తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వం అవసరమని, మేడిగడ్డ పునర్నిర్మాణం ఆయనతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిస్థితులపై కూడా విమర్శలు గుప్పించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10653/jagitya-brs-sabha-marks-the-beginning-of-another-movement-downfall</link>
                <guid>https://www.prajamantalu.com/article/10653/jagitya-brs-sabha-marks-the-beginning-of-another-movement-downfall</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 16:29:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260421-wa0012.jpg"                         length="218990"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జీహెచ్ఎంసీలో అవినీతికి సీఎం బాధ్యులు: కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టెండర్లకు బదులుగా నామినేషన్ పద్ధతిలో కోట్ల విలువైన కాంట్రాక్టులు సీఎం అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,148 కోట్ల పనులు ఇదే విధంగా ఇచ్చారని తెలిపారు.<br />రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఒత్తిడి తీసుకుని కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారం ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తులు కూడా కమీషన్ల కోసమే చేస్తున్నారని విమర్శించారు.<br />మహిళా రిజర్వేషన్ బిల్లులో 2011 జనాభా లెక్కలు ఆధారంగా తీసుకోవడం అన్యాయమని, 2027 జనగణన తర్వాతే అమలు చేయాలని డిమాండ్ చేశారు.<br />ఈ నెల 25న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్ల కోసం 21 కమిటీలు ఏర్పాటు చేసినట్లు కవిత తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10599/kavita-holds-cm-responsible-for-corruption-in-ghmc"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260410-wa0014.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టెండర్లకు బదులుగా నామినేషన్ పద్ధతిలో కోట్ల విలువైన కాంట్రాక్టులు సీఎం అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,148 కోట్ల పనులు ఇదే విధంగా ఇచ్చారని తెలిపారు.<br />రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఒత్తిడి తీసుకుని కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారం ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తులు కూడా కమీషన్ల కోసమే చేస్తున్నారని విమర్శించారు.<br />మహిళా రిజర్వేషన్ బిల్లులో 2011 జనాభా లెక్కలు ఆధారంగా తీసుకోవడం అన్యాయమని, 2027 జనగణన తర్వాతే అమలు చేయాలని డిమాండ్ చేశారు.<br />ఈ నెల 25న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్ల కోసం 21 కమిటీలు ఏర్పాటు చేసినట్లు కవిత తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10599/kavita-holds-cm-responsible-for-corruption-in-ghmc</link>
                <guid>https://www.prajamantalu.com/article/10599/kavita-holds-cm-responsible-for-corruption-in-ghmc</guid>
                <pubDate>Fri, 10 Apr 2026 20:05:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260410-wa0014.jpg"                         length="124142"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా… భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)</strong></p>
<p>కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్‌పై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి <strong>జీవన్ రెడ్డి</strong> కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.</p>
<p>ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ —<br /><em>“భవిష్యత్ ఏంటో నాకు గోచరించట్లేదు. అవమానాలు ఇంకెంత కాలం భరించాలి?”</em> అని ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>🔹 <strong>ఎన్నికలే ముగింపు కాదు</strong><br />“ఈ ఎన్నికలతో కథ ముగిసినట్టేం కాదు. జగిత్యాలలో ఎమ్మెల్యేగా <strong>సంజయ్ కుమార్</strong> ఉన్నంతకాలం నాకు వేధింపులు తప్పవు” అని వ్యాఖ్యానించారు.</p>
<ul>
<li><strong><span style="color:rgb(172,5,5);">పార్టీ మారలేదా… రాజకీయాలు మారలేదా</span>?</strong><br /><strong>“స్పీకర్ మాత్రం ఎమ్మెల్యే పార్టీ మారలేదని అంటున్నారు. తెలుగుదేశంతో అంట కాగిన సంజయ్, బి ఆర్ ఎస్ లో చేరి, గెలిచారు. కానీ ఎమ్మెల్యేగా, రాజకీయ సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతోంది” అని ఎద్దేవా చేశారు.</strong></li>
</ul>
<p>🔹 <span style="color:rgb(172,5,5);"><strong>పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికిచ్చారు?</strong></span><br />“జగిత్యాల కాంగ్రెస్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10262/former-minister-jeevan-reddy-is-thinking-about-continuing-in-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260216-wa0877.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)</strong></p>
<p>కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్‌పై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి <strong>జీవన్ రెడ్డి</strong> కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.</p>
<p>ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ —<br /><em>“భవిష్యత్ ఏంటో నాకు గోచరించట్లేదు. అవమానాలు ఇంకెంత కాలం భరించాలి?”</em> అని ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>🔹 <strong>ఎన్నికలే ముగింపు కాదు</strong><br />“ఈ ఎన్నికలతో కథ ముగిసినట్టేం కాదు. జగిత్యాలలో ఎమ్మెల్యేగా <strong>సంజయ్ కుమార్</strong> ఉన్నంతకాలం నాకు వేధింపులు తప్పవు” అని వ్యాఖ్యానించారు.</p>
<ul>
<li><strong><span style="color:rgb(172,5,5);">పార్టీ మారలేదా… రాజకీయాలు మారలేదా</span>?</strong><br /><strong>“స్పీకర్ మాత్రం ఎమ్మెల్యే పార్టీ మారలేదని అంటున్నారు. తెలుగుదేశంతో అంట కాగిన సంజయ్, బి ఆర్ ఎస్ లో చేరి, గెలిచారు. కానీ ఎమ్మెల్యేగా, రాజకీయ సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతోంది” అని ఎద్దేవా చేశారు.</strong></li>
</ul>
<p>🔹 <span style="color:rgb(172,5,5);"><strong>పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికిచ్చారు?</strong></span><br />“జగిత్యాల కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పట్టా రాసిచ్చారా? పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్‌కు ఇచ్చినట్టుగా వ్యవహారం సాగుతోంది” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.</p>
<p> </p>
<p>🔹 <span style="color:rgb(186,55,42);"><strong>అధినాయకత్వానికి విజ్ఞప్తి</strong></span><br />“కాంగ్రెస్ అధినాయకత్వం తప్పకుండా పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవించాలి. జగిత్యాలలో పరిస్థితి ఇలానే ఉంటే, పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలి” అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.</p>
<p>ఈ వ్యాఖ్యలు జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో <strong>తీవ్ర కలకలం</strong> రేపుతున్నాయి. మాజీ మంత్రి అసంతృప్తి పార్టీ అధిష్టానం వరకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10262/former-minister-jeevan-reddy-is-thinking-about-continuing-in-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10262/former-minister-jeevan-reddy-is-thinking-about-continuing-in-the</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 18:42:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260216-wa0877.jpg"                         length="152896"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత </title>
                                    <description><![CDATA[<h6>  <strong><span style="color:rgb(186,55,42);">న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత</span></strong></h6>
<p><strong>బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అమరవీరుల స్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించారు. <span style="color:rgb(11,91,235);"><strong>తొలి విడత ఉద్యమకారుడు పెద్ది శ్రీరాములు గారిని సత్కరించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260212-wa0823.jpg" alt="IMG-20260212-WA0823" width="416" height="277" /></strong></span></p>
<p>ఈ సభకు పదికి పైగా ఉద్యమ సంఘాలు, పెద్ద సంఖ్యలో ఉద్యమ నాయకులు హాజరయ్యారు.</p>
<h5>“ఉద్యమకారులకు న్యాయం జరగలేదు”</h5>
<p>కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.<br />“మీరు బయట ఉండి బాధపడితే, నేను బీఆర్ఎస్ లో ఉండి బాధపడ్డాను” అని వ్యాఖ్యానించారు.</p>
<p>కేసీఆర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10195/we-will-do-another-movement-for-the-activists-%E2%80%93-kalvakuntlas"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/img-20260212-wa1010.jpg" alt=""></a><br /><h6> <strong><span style="color:rgb(186,55,42);">న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత</span></strong></h6>
<p><strong>బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అమరవీరుల స్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించారు. <span style="color:rgb(11,91,235);"><strong>తొలి విడత ఉద్యమకారుడు పెద్ది శ్రీరాములు గారిని సత్కరించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/img-20260212-wa0823.jpg" alt="IMG-20260212-WA0823" width="416" height="277"></img></strong></span></p>
<p>ఈ సభకు పదికి పైగా ఉద్యమ సంఘాలు, పెద్ద సంఖ్యలో ఉద్యమ నాయకులు హాజరయ్యారు.</p>
<h5>“ఉద్యమకారులకు న్యాయం జరగలేదు”</h5>
<p>కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.<br />“మీరు బయట ఉండి బాధపడితే, నేను బీఆర్ఎస్ లో ఉండి బాధపడ్డాను” అని వ్యాఖ్యానించారు.</p>
<p>కేసీఆర్ గారిని విమర్శించాలనే ఉద్దేశం లేదని చెప్పినా, పదేళ్లు అవకాశం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులకు పూర్తి న్యాయం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.</p>
<h5><strong><span style="color:rgb(186,55,42);">రేవంత్ రెడ్డి పై విమర్శలు</span></strong></h5>
<p>ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.<br />“ఉద్యమ సోయి లేని వ్యక్తి సీఎం కావటం మన దౌర్భాగ్యం” అన్నారు.</p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల్లో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ, సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశాలను చేర్చాలని డిమాండ్ చేశారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">“త్వరలో కొత్త రాజకీయ పార్టీ”</span></strong></h6>
<p>ఉద్యమకారుల అజెండాతోనే ముందుకు సాగే కొత్త రాజకీయ పార్టీని త్వరలో ప్రకటిస్తామని కవిత వెల్లడించారు.<br />“మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ” అని స్పష్టం చేశారు.</p>
<p>ఉద్యమకారుల పిల్లలకు అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">చారిత్రక ప్రస్తావనలు</span></strong></h6>
<p>సభలో తెలంగాణ చరిత్రను ప్రస్తావించిన కవిత,</p>
<ul>
<li><strong>రామ్ జీ, కొమురం భీమ్ పోరాటాలు</strong></li>
<li><strong>దొడ్డి కొమురయ్య త్యాగం</strong></li>
<li><strong>1969 తెలంగాణ ఉద్యమం</strong></li>
<li><strong>వరంగల్ డిక్లరేషన్</strong></li>
<li><strong>2001లో కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమం</strong></li>
</ul>
<p>వంటి సంఘటనలను గుర్తు చేశారు.</p>
<p>ఉద్యమంలో పోరాడిన వారికి గౌరవం, అధికారిక గుర్తింపు ఇంకా లభించలేదని అన్నారు.</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);">యాప్ ద్వారా ఉద్యమకారుల గుర్తింపు</span></strong></h6>
<p>ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. యాప్‌లో నమోదు చేసుకున్న ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి తెలంగాణ జాగృతి తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని చెప్పారు.</p>
<p>“తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల వైపే ధర్మం ఉంది. వారి కోసం మరో ఉద్యమం చేయాల్సిందే” అంటూ కవిత సభను ముగించారు.</p>
<p>ఈ సభతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. త్వరలో ప్రకటించబోయే కొత్త రాజకీయ పార్టీపై ఆసక్తి నెలకొంది. సభలో  ఉద్యమ నాయకులు మురళీధర్ దేశ పాండే, కాచం సత్యనారాయణ, sajida సికిందర్ బేగం లతో పాటు జాగృతి కార్యదర్శి నవీనా చారి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10195/we-will-do-another-movement-for-the-activists-%E2%80%93-kalvakuntlas</link>
                <guid>https://www.prajamantalu.com/article/10195/we-will-do-another-movement-for-the-activists-%E2%80%93-kalvakuntlas</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 17:00:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/img-20260212-wa1010.jpg"                         length="50156"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీ-హబ్‌ స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />టీ-హబ్‌ను పూర్తిగా <strong>స్టార్టప్‌ల కేంద్రంగా మాత్రమే కొనసాగించాలని</strong> ముఖ్యమంత్రి <strong>ఎ. రేవంత్ రెడ్డి</strong> అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చనున్నారన్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు.</p>
<p>అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి <strong>రామకృష్ణారావుతో</strong> ఫోన్‌లో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అద్దె భవనాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను <strong>ఇతర అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలకు</strong> మార్చాలని సూచించారు.</p>
<p>టీ-హబ్‌ను <strong>ఇంక్యుబేటర్‌, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా</strong> స్టార్టప్‌ల కోసం ఏర్పాటు చేసిన కేంద్రంగా గుర్తించాలని, అక్కడ <strong>ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఎలాంటి అవకాశం లేదని</strong> సీఎం స్పష్టం చేశారు. టీ-హబ్ స్వరూపాన్ని మార్చే ఆలోచనలుంటే వెంటనే విరమించుకోవాలని అధికారులకు ఆదేశించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9892/cm-revanth-reddy-should-continue-to-be-the-center-of"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260124-wa1722.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />టీ-హబ్‌ను పూర్తిగా <strong>స్టార్టప్‌ల కేంద్రంగా మాత్రమే కొనసాగించాలని</strong> ముఖ్యమంత్రి <strong>ఎ. రేవంత్ రెడ్డి</strong> అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చనున్నారన్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు.</p>
<p>అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి <strong>రామకృష్ణారావుతో</strong> ఫోన్‌లో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అద్దె భవనాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను <strong>ఇతర అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలకు</strong> మార్చాలని సూచించారు.</p>
<p>టీ-హబ్‌ను <strong>ఇంక్యుబేటర్‌, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా</strong> స్టార్టప్‌ల కోసం ఏర్పాటు చేసిన కేంద్రంగా గుర్తించాలని, అక్కడ <strong>ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఎలాంటి అవకాశం లేదని</strong> సీఎం స్పష్టం చేశారు. టీ-హబ్ స్వరూపాన్ని మార్చే ఆలోచనలుంటే వెంటనే విరమించుకోవాలని అధికారులకు ఆదేశించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9892/cm-revanth-reddy-should-continue-to-be-the-center-of</link>
                <guid>https://www.prajamantalu.com/article/9892/cm-revanth-reddy-should-continue-to-be-the-center-of</guid>
                <pubDate>Sat, 24 Jan 2026 19:29:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260124-wa1722.jpg"                         length="59873"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ</title>
                                    <description><![CDATA[<p><strong>జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />గత ప్రభుత్వం పాలమూరు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలను మోసం చేసిందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.</p>
<p>మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.</p>
<p>ఎన్నికల సమయంలో వేదికపై ఉన్నవారంతా తన ఓటమికి గట్టిగా పనిచేశారని, అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. పాలమూరు అభివృద్ధికి కేంద్రం తరపున పూర్తి సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.</p>
<p>కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమన్వయంతో ఉపయోగించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేయాలని కోరారు. పాలమూరు అభివృద్ధి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని డీకే అరుణ స్పష్టం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9719/previous-government-ignored-palamuru-%E2%80%93-dk-aruna"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260117-wa1022.jpg" alt=""></a><br /><p><strong>జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />గత ప్రభుత్వం పాలమూరు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలను మోసం చేసిందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.</p>
<p>మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.</p>
<p>ఎన్నికల సమయంలో వేదికపై ఉన్నవారంతా తన ఓటమికి గట్టిగా పనిచేశారని, అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. పాలమూరు అభివృద్ధికి కేంద్రం తరపున పూర్తి సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.</p>
<p>కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమన్వయంతో ఉపయోగించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేయాలని కోరారు. పాలమూరు అభివృద్ధి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని డీకే అరుణ స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajamantalu.com/article/9719/previous-government-ignored-palamuru-%E2%80%93-dk-aruna</link>
                <guid>https://www.prajamantalu.com/article/9719/previous-government-ignored-palamuru-%E2%80%93-dk-aruna</guid>
                <pubDate>Sat, 17 Jan 2026 20:04:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260117-wa1022.jpg"                         length="145241"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లక్ష్యం ఉన్నతంగా ఉండాలి – చదువే జీవితాన్ని మార్చుతుంది – సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />లక్ష్యం ఉన్నతంగా పెట్టుకుని కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు.</p>
<p>మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో సీఎం పాల్గొని, అనంతరం విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు.</p>
<p>విద్యారంగ అభివృద్ధినే ప్రభుత్వ టాప్ ప్రాధాన్యంగా తీసుకున్నామని, ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఐఐఐటీతో పాటు ఇంజినీరింగ్, లా, మెడికల్ కళాశాలల స్థాపన జరుగుతుందని తెలిపారు. యూపీఎస్సీ అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.</p>
<p>ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప సంపద విద్యేనని, విద్య ఒక్కటే జీవితాన్ని మార్చగలదని సీఎం అన్నారు. ఏడాది కాలంలో ఐఐఐటీ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9717/the-aim-should-be-high-%E2%80%93-studying-changes-life-%E2%80%93"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260117-wa1026.jpg" alt=""></a><br /><p><strong>జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />లక్ష్యం ఉన్నతంగా పెట్టుకుని కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు.</p>
<p>మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో సీఎం పాల్గొని, అనంతరం విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు.</p>
<p>విద్యారంగ అభివృద్ధినే ప్రభుత్వ టాప్ ప్రాధాన్యంగా తీసుకున్నామని, ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఐఐఐటీతో పాటు ఇంజినీరింగ్, లా, మెడికల్ కళాశాలల స్థాపన జరుగుతుందని తెలిపారు. యూపీఎస్సీ అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.</p>
<p>ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప సంపద విద్యేనని, విద్య ఒక్కటే జీవితాన్ని మార్చగలదని సీఎం అన్నారు. ఏడాది కాలంలో ఐఐఐటీ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9717/the-aim-should-be-high-%E2%80%93-studying-changes-life-%E2%80%93</link>
                <guid>https://www.prajamantalu.com/article/9717/the-aim-should-be-high-%E2%80%93-studying-changes-life-%E2%80%93</guid>
                <pubDate>Sat, 17 Jan 2026 19:56:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260117-wa1026.jpg"                         length="125188"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కిట్ నాణ్యతపై రాజీ వద్దు : సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు):</p>
<p><br />ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్ విషయంలో నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు స్పష్టం చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి ప్రతి విద్యార్థికి కిట్ అందేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.</p>
<p>విద్యార్థులకు యూనిఫామ్‌తో పాటు బెల్ట్, టై, షూస్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్ సహా మొత్తం 21 ఇతర వస్తువులతో కూడిన కిట్‌ను అందించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఖర్చుకు వెనకాడవద్దని, నాణ్యతే ప్రధాన ప్రమాణంగా ఉండాలని సూచించారు.</p>
<p>ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంపై నిర్వహించిన ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9639/cm-revanth-reddy-does-not-want-to-compromise-on-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-01/img-20260113-wa00411.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు):</p>
<p><br />ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్ విషయంలో నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు స్పష్టం చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి ప్రతి విద్యార్థికి కిట్ అందేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.</p>
<p>విద్యార్థులకు యూనిఫామ్‌తో పాటు బెల్ట్, టై, షూస్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్ సహా మొత్తం 21 ఇతర వస్తువులతో కూడిన కిట్‌ను అందించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఖర్చుకు వెనకాడవద్దని, నాణ్యతే ప్రధాన ప్రమాణంగా ఉండాలని సూచించారు.</p>
<p>ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంపై నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్ గారు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు గారు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9639/cm-revanth-reddy-does-not-want-to-compromise-on-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/9639/cm-revanth-reddy-does-not-want-to-compromise-on-the</guid>
                <pubDate>Tue, 13 Jan 2026 08:57:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-01/img-20260113-wa00411.jpg"                         length="159046"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్… కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్ డిసెంబర్ 15</strong></p>
<p>నిన్న ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మెస్సీ – రేవంత్ టీమ్‌ల ఫుట్‌బాల్ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.</p>
<p>ఈ ప్రయాణ సమయంలో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తెలంగాణలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపై కీలకంగా మాట్లాడినట్లు సమాచారం.</p>
<p>అలాగే ఇటీవల నిర్వహించిన <strong>తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్</strong> విజయం గురించి సీఎం రేవంత్ రాహుల్ గాంధీకి వివరించారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి సుమారు <strong>రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు</strong> రావడం విశేషమని తెలిపారు.</p>
<p>అంచనాలను మించి సమ్మిట్ అత్యంత విజయవంతంగా జరిగిందని సీఎం వివరించగా, రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9109/rahul-gandhi-cm-revant-to-delhi-in-a-special-flight"><img src="https://www.prajamantalu.com/media/400/2025-12/img-20251214-wa0018.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్ డిసెంబర్ 15</strong></p>
<p>నిన్న ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మెస్సీ – రేవంత్ టీమ్‌ల ఫుట్‌బాల్ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.</p>
<p>ఈ ప్రయాణ సమయంలో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తెలంగాణలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపై కీలకంగా మాట్లాడినట్లు సమాచారం.</p>
<p>అలాగే ఇటీవల నిర్వహించిన <strong>తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్</strong> విజయం గురించి సీఎం రేవంత్ రాహుల్ గాంధీకి వివరించారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి సుమారు <strong>రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు</strong> రావడం విశేషమని తెలిపారు.</p>
<p>అంచనాలను మించి సమ్మిట్ అత్యంత విజయవంతంగా జరిగిందని సీఎం వివరించగా, రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించినట్లు తెలిసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9109/rahul-gandhi-cm-revant-to-delhi-in-a-special-flight</link>
                <guid>https://www.prajamantalu.com/article/9109/rahul-gandhi-cm-revant-to-delhi-in-a-special-flight</guid>
                <pubDate>Sun, 14 Dec 2025 12:59:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-12/img-20251214-wa0018.jpg"                         length="94559"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్‌ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):</p>
<p>ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి, ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.</p>
<p>మ్యాచ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఒక గోల్‌ సాధించగా, మెస్సీ రెండు గోల్స్‌తో తన ప్రతిభను చాటుకున్నారు. గోల్స్‌తో పాటు మెస్సీ ఆటతీరుకు స్టేడియం మార్మోగింది. మ్యాచ్ సందర్భంగా మెస్సీ అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకపోయాయి.</p>
<p>మ్యాచ్ అనంతరం ఇరు జట్లతో కలిసి మెస్సీ, సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా క్రీడాభిమానులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.</p>
<p>మ్యాచ్ ముగిసిన తరువాత మెస్సీ హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్న మెస్సీ, రేపు ఉదయం ముంబైకి బయల్దేరనున్నట్లు సమాచారం.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/9096/excitement-among-fans-of-messi-revanth-football-match-at-uppal-stadium"><img src="https://www.prajamantalu.com/media/400/2025-12/img_20251213_215728-(1).jpg" alt=""></a><br /><p>హైదరాబాద్‌ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):</p>
<p>ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి, ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.</p>
<p>మ్యాచ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఒక గోల్‌ సాధించగా, మెస్సీ రెండు గోల్స్‌తో తన ప్రతిభను చాటుకున్నారు. గోల్స్‌తో పాటు మెస్సీ ఆటతీరుకు స్టేడియం మార్మోగింది. మ్యాచ్ సందర్భంగా మెస్సీ అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకపోయాయి.</p>
<p>మ్యాచ్ అనంతరం ఇరు జట్లతో కలిసి మెస్సీ, సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా క్రీడాభిమానులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.</p>
<p>మ్యాచ్ ముగిసిన తరువాత మెస్సీ హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్న మెస్సీ, రేపు ఉదయం ముంబైకి బయల్దేరనున్నట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Sports</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/9096/excitement-among-fans-of-messi-revanth-football-match-at-uppal-stadium</link>
                <guid>https://www.prajamantalu.com/article/9096/excitement-among-fans-of-messi-revanth-football-match-at-uppal-stadium</guid>
                <pubDate>Sat, 13 Dec 2025 22:00:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-12/img_20251213_215728-%281%29.jpg"                         length="38042"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):</p>
<p>డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే <strong>తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్</strong> పూర్తిగా <strong>ఆర్థిక సదస్సు</strong> అని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశను తెలిపే <strong>‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్</strong> ఈ సదస్సులో ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.</p>
<p>ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్ రూమ్‌లో సదస్సు ఏర్పాట్లు, విజన్ డాక్యుమెంట్‌పై అధికారులు ఇచ్చిన వివరాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేమ నరేందర్ రెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు.<img src="https://www.prajamantalu.com/media/2025-12/img-20251206-wa0004.jpg" alt="IMG-20251206-WA0004" width="1200" height="853" /></p>
<p>అధికారులు సమ్మిట్ రెండు రోజుల కార్యక్రమ ప్రణాళిక, వేదిక ఏర్పాట్లను సీఎం కు వివరించారు. డిజిటల్ రూపంలో పారదర్శకంగా, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలని సీఎం సూచించారు.</p>
<p>ఈ సమ్మిట్ లక్ష్యాలు, ప్రభుత్వ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8882/telangana-rising-global-summit-%E2%80%94-from-december-8-at-bharat"><img src="https://www.prajamantalu.com/media/400/2025-12/img-20251206-wa0002.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):</p>
<p>డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే <strong>తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్</strong> పూర్తిగా <strong>ఆర్థిక సదస్సు</strong> అని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశను తెలిపే <strong>‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్</strong> ఈ సదస్సులో ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.</p>
<p>ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్ రూమ్‌లో సదస్సు ఏర్పాట్లు, విజన్ డాక్యుమెంట్‌పై అధికారులు ఇచ్చిన వివరాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేమ నరేందర్ రెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు.<img src="https://www.prajamantalu.com/media/2025-12/img-20251206-wa0004.jpg" alt="IMG-20251206-WA0004" width="1280" height="853"></img></p>
<p>అధికారులు సమ్మిట్ రెండు రోజుల కార్యక్రమ ప్రణాళిక, వేదిక ఏర్పాట్లను సీఎం కు వివరించారు. డిజిటల్ రూపంలో పారదర్శకంగా, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలని సీఎం సూచించారు.</p>
<p>ఈ సమ్మిట్ లక్ష్యాలు, ప్రభుత్వ దార్శనికత ప్రపంచ ఆర్థిక వేదిక (WEF – Davos) ముందుంచే స్థాయిలో ఉండాలని ఆయన అన్నారు.</p>
<p>ఇండిగో సహా దేశవ్యాప్తంగా విమాన రద్దుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, సమ్మిట్‌కు వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా <strong>పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని</strong> సీఎం అధికారులను ఆదేశించారు.</p>
<p>ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం రోజున <strong>మినిట్ టు మినిట్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు</strong>.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/8882/telangana-rising-global-summit-%E2%80%94-from-december-8-at-bharat</link>
                <guid>https://www.prajamantalu.com/article/8882/telangana-rising-global-summit-%E2%80%94-from-december-8-at-bharat</guid>
                <pubDate>Sat, 06 Dec 2025 01:59:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-12/img-20251206-wa0002.jpg"                         length="829255"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు: కూటమి ప్రభుత్వానికి రేవంత్ నాయకుడా?</title>
                                    <description><![CDATA[<h6><strong><span style="color:rgb(140,9,9);">నిజంగా కొత్త సమీకరణలకు తెర లేస్తుందా? కర్ణాటక తరువాత తెలంగాణ నేనా? </span></strong></h6>
<h6><span style="color:rgb(22,145,121);">తెలంగాణ రాజకీయాలలో రాముడెవరు? విభూషణుడెవరు?</span></h6>
<p><strong><span style="color:rgb(37,43,242);">(సిహెచ్.వి.ప్రభాకర్ రావు)</span></strong></p>
<p>తెలంగాణ రాజకీయాలు ఇవాళ గట్టిగా కాచిన హైదరాబాదీ బిర్యానీ లాంటివి—పైన మసాలాలు, లోపల చికెన్ ముక్కలా కుట్రలు, మధ్యలో దాగిన ఎముకలా పార్టీ మార్పులు!</p>
<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత రాజకీయ చలనచిత్రంలో హీరోనా, విలనో, లేక ‘హీరోలా నటించే విలనో’ అన్నది ఢిల్లీ పెద్దలకు కూడా క్లారిటీ లేకపోతే—తెలంగాణ ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? కాంగ్రెస్ జెండా చేతిలో ఉన్నా, రాజకీయ డీఎన్‌ఏ మాత్రం తెలుగుదేశం రూట్స్, ప్రస్తుత నడకలో బీజేపీ జీపీఎస్, దూరంలో చంద్రబాబు నాయుడు షాడో, పైగా ఎప్పుడో ఒకసారి పవన్ కళ్యాణ్ క్లాప్!</p>
<h6><strong><span style="color:rgb(186,55,42);background-color:rgb(248,202,198);">మిత్రమండలి రాజకీయాలా?</span></strong></h6>
<p>దేశంలో ఎక్కడా లేని రాజకీయ మిక్సర్ గ్రైండర్ తెలంగాణలోనే ఉంది—<br />కాంగ్రెస్‌లో ఉండే నాయకుడు, బీజేపీతో డీల్, TDPతో ఫీలింగ్స్, సినిమా వాళ్లు ఫండింగ్!</p>
<p><strong><span style="color:rgb(186,55,42);">ఇక ఢిల్లీ</span></strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/8655/new-equations-in-telangana-politics-revanth-is-the-leader-of"><img src="https://www.prajamantalu.com/media/400/2025-11/1764292986507.jpg" alt=""></a><br /><h6><strong><span style="color:rgb(140,9,9);">నిజంగా కొత్త సమీకరణలకు తెర లేస్తుందా? కర్ణాటక తరువాత తెలంగాణ నేనా? </span></strong></h6>
<h6><span style="color:rgb(22,145,121);">తెలంగాణ రాజకీయాలలో రాముడెవరు? విభూషణుడెవరు?</span></h6>
<p><strong><span style="color:rgb(37,43,242);">(సిహెచ్.వి.ప్రభాకర్ రావు)</span></strong></p>
<p>తెలంగాణ రాజకీయాలు ఇవాళ గట్టిగా కాచిన హైదరాబాదీ బిర్యానీ లాంటివి—పైన మసాలాలు, లోపల చికెన్ ముక్కలా కుట్రలు, మధ్యలో దాగిన ఎముకలా పార్టీ మార్పులు!</p>
<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత రాజకీయ చలనచిత్రంలో హీరోనా, విలనో, లేక ‘హీరోలా నటించే విలనో’ అన్నది ఢిల్లీ పెద్దలకు కూడా క్లారిటీ లేకపోతే—తెలంగాణ ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? కాంగ్రెస్ జెండా చేతిలో ఉన్నా, రాజకీయ డీఎన్‌ఏ మాత్రం తెలుగుదేశం రూట్స్, ప్రస్తుత నడకలో బీజేపీ జీపీఎస్, దూరంలో చంద్రబాబు నాయుడు షాడో, పైగా ఎప్పుడో ఒకసారి పవన్ కళ్యాణ్ క్లాప్!</p>
<h6><strong><span style="color:rgb(186,55,42);background-color:rgb(248,202,198);">మిత్రమండలి రాజకీయాలా?</span></strong></h6>
<p>దేశంలో ఎక్కడా లేని రాజకీయ మిక్సర్ గ్రైండర్ తెలంగాణలోనే ఉంది—<br />కాంగ్రెస్‌లో ఉండే నాయకుడు, బీజేపీతో డీల్, TDPతో ఫీలింగ్స్, సినిమా వాళ్లు ఫండింగ్!</p>
<p><strong><span style="color:rgb(186,55,42);">ఇక ఢిల్లీ వ్యూహకర్తల ప్రకారం:</span></strong><br />“BJPకి తెలంగాణలో నేతలు లేక ఇబ్బంది లేదు… ఇతర పార్టీల్లో ఉన్నవారే బయటికి రావడానికి క్యూ లో ఉన్నారు!”<img src="https://www.prajamantalu.com/media/2025-11/lucid_origin_revanth_reddy_chandra_babu_naidu_pawan_kalyan_and_0-(1).jpg" alt="Lucid_Origin_Revanth_Reddy_Chandra_Babu_Naidu_Pawan_Kalyan_and_0 (1)" width="300" height="300"></img></p>
<p>ఇటీవల రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న కొత్త ఆపరేషన్ పేరు:<br />“ఆపరేషన్ చక్రవ్యుహం – రేవంత్ ఎడిషన్”<br />దీని మెయిన్ గోల్:<br />– కాంగ్రెస్‌ని లోపల నుంచి పగులగొట్టాలి<br />– BRS ని బయట నుంచి కొట్టాలి<br />– చివరికి BJPతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి<br />– నాయకత్వం? పబ్లిక్ కి తెలియాల్సిన అవసరం లేదు… “టాప్ సీక్రెట్”!</p>
<h6><strong><span style="color:rgb(107,5,5);">ఆంధ్ర స్థిరాస్తి వ్యాపారులు</span></strong></h6>
<p>ఇప్పుడు అసలు మజా ఏంటంటే—ఈ రాజకీయ హోల్సేల్ ప్రాజెక్టుకు ఫండింగ్ నడుపుతున్నది…<br />హైదరాబాద్‌లో ఇప్పటికే పీఠాలు వేసుకున్న ఆంధ్ర బిగ్ ల్యాండ్‌లార్డ్స్!<br />వారి లాజిక్ అద్భుతం:<br />“సర్కారు స్థిరంగా ఉండాలంటే మా స్థిరాస్తి ధరలు ముందుగా పెరగాలి!”<br />సూటిగా అనిచెప్పితే:<br />“పాలనా మార్పులు ఏవైనా… స్క్వేర్-యార్డ్ రేట్లు పెరిగితే చాలు!”</p>
<h6><strong><span style="color:rgb(22,145,121);background-color:rgb(241,196,15);">ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు?</span></strong><br />సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పుడు రాజకీయాలు హిట్ అవుతాయని తెలిసి, వాళ్లంతా కూడా స్క్రిప్ట్ రైటర్లలా కార్డులు కలపడానికి సిద్ధం. ఒక స్టార్ మాట:<br />“మా సినిమా కలెక్షన్లు దేవుడికి తెలుసు… కానీ మా రాజకీయ పెట్టుబడులు మాత్రం ఖచ్చితంగా రాబడులు ఇస్తాయి!”</h6>
<p>ఇది చూస్తున్న సామాన్య ప్రజలు మాత్రం చెబుతున్నారు:<br />“తమాషా పెద్దది అవుతోంది… కానీ చివరికి బిల్లు మాత్రం మేమే చెల్లించాలి!”</p>
<p><span style="color:rgb(22,145,121);"><strong>కాంగ్రెస్ లో భూకంపం…</strong></span><br />BRS లో భయం…<br />BJP లో పార్టీ ర్యాంక్స్ లో సైలెంట్ సెలబ్రేషన్స్…<br />మధ్యలో రేవంత్ రెడ్డి మాత్రం షో మాన్‌లా ఇలా అంటున్నారు అన్నట్లుగా ఫీల్:<br />“పార్టీలు మారినా, పథకం మారినా, చివరికి సీన్ నాది… ఇంకా అసలు ఎంట్రీ మిగిలి ఉంది!”</p>
<p>తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒంటరిగా వెళ్లే లిఫ్ట్ లాంటివి—ఎక్కడ ఆగుతుందో, ఎవరు లోపలికి వస్తారో, ఎవరు బయటికి పడతారో ఎవరికీ తెలీదు!</p>
<p>కర్ణాటకం తరువాత, తెలంగాణలో ఏమైనా జరగవచ్చునని ఆశపడే వారు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీనీ నమ్ముకొన్న వారి పరిస్థితే అయోమయంగా మారింది? అవునా? చూడాలి సంక్రాంతికి ఎలాంటి సినిమా వస్తుందో? </p>
<p>--- </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Comment</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/8655/new-equations-in-telangana-politics-revanth-is-the-leader-of</link>
                <guid>https://www.prajamantalu.com/article/8655/new-equations-in-telangana-politics-revanth-is-the-leader-of</guid>
                <pubDate>Fri, 28 Nov 2025 07:10:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2025-11/1764292986507.jpg"                         length="53340"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Spl.Correspondent ]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        