<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/author/9/sama-satanarayana" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Sama satyanarayana  - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/author/9/rss</link>
                <description>Sama satyanarayana  RSS Feed</description>
                
                            <item>
                <title>తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు.. ప్రజా బడ్జెట్ విడుదల</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, మార్చ్ 19 (ప్రజా మంటలు):</strong><br /><br />శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతో పాటు అనిల్ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు హాజరయ్యారు.</p>
<h6><br /><strong><span style="color:rgb(186,55,42);"><em>రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్</em></span></strong></h6>
<p><br />ఉగాది వేడుకల అనంతరం కవిత తెలంగాణ జాగృతి తరఫున ప్రజా బడ్జెట్‌ను ప్రకటించారు. మొత్తం రూ.2,15,200 కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఉగాది రోజునే జాగృతి ప్రజా బడ్జెట్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు.<br />రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండగా, తాము మాత్రం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ మొత్తంతో సమగ్ర బడ్జెట్ రూపొందించామని చెప్పారు. తమ బడ్జెట్‌లో ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోగతికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10510/traditional-ugadi-celebrations-under-telangana-jagruti-release-public-budget"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260319-wa0016.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, మార్చ్ 19 (ప్రజా మంటలు):</strong><br /><br />శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతో పాటు అనిల్ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు హాజరయ్యారు.</p>
<h6><br /><strong><span style="color:rgb(186,55,42);"><em>రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్</em></span></strong></h6>
<p><br />ఉగాది వేడుకల అనంతరం కవిత తెలంగాణ జాగృతి తరఫున ప్రజా బడ్జెట్‌ను ప్రకటించారు. మొత్తం రూ.2,15,200 కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఉగాది రోజునే జాగృతి ప్రజా బడ్జెట్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు.<br />రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండగా, తాము మాత్రం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ మొత్తంతో సమగ్ర బడ్జెట్ రూపొందించామని చెప్పారు. తమ బడ్జెట్‌లో ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోగతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260319-wa0018.jpg" alt="IMG-20260319-WA0018" width="1456" height="540"></img><br /><span style="color:rgb(185,106,217);">ప్రధాన కేటాయింపులు</span><br />ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు రూపొందించిన ఈ బడ్జెట్‌లో పలు కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేశారు:</p>
<p><span style="color:rgb(22,145,121);"><strong>విద్యారంగం – రూ.30,000 కోట్లు</strong></span><br /><strong>వైద్యం, ఆరోగ్యం – రూ.25,000 కోట్లు</strong><br /><span style="color:rgb(22,145,121);"><strong>యూనివర్సిటీ విద్య – రూ.2,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(185,106,217);"><strong>పింఛన్లు (వృద్ధులు, వికలాంగులు తదితరులు) – రూ.25,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(22,145,121);"><strong>ఇందిరమ్మ ఇళ్లు – రూ.20,000 కోట్లు</strong></span><br /><strong>ఉద్యమకారులు &amp; అమరవీరుల కుటుంబాలు – రూ.5,000 కోట్లుl</strong><br /><span style="color:rgb(22,145,121);"><strong>రైతులు, కౌలు రైతులు &amp; కూలీలు – రూ.35,000 కోట్లు</strong></span><br /><strong>యువత (రాజీవ్ యువ వికాసం) – రూ.5,000 కోట్లు</strong><br /><strong>యువతులకు స్కూటీలు – రూ.5,000 కోట్లు</strong><br /><span style="color:rgb(22,145,121);"><strong>బీసీ సంక్షేమం – రూ.20,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(185,106,217);background-color:rgb(191,237,210);"><strong>ఎస్సీ సంక్షేమం – రూ.18,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(185,106,217);background-color:rgb(191,237,210);"><strong>ఎస్టీ సంక్షేమం – రూ.10,000 కోట్లు</strong></span><br /><span style="color:rgb(185,106,217);background-color:rgb(191,237,210);"><strong>మైనారిటీ సంక్షేమం – రూ.5,000 కోట్లు</strong></span><br /><strong>కళ్యాణ లక్ష్మీ &amp; షాదీ ముబారక్ – రూ.10,000 కోట్లు</strong><br /><strong>ఎంఎస్ఎంఈలు &amp; పారిశ్రామిక వేత్తలు – రూ.10,000 కోట్లు</strong><br /><strong>కళాకారుల పింఛన్లు – రూ.100 కోట్లు</strong><br /><strong>ఆటో డ్రైవర్ల సాయం – రూ.100 కోట్లు</strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">ప్రభుత్వానికి సూచనలు</span></strong><br />ప్రభుత్వం తమ బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కవిత కోరారు. తమ బడ్జెట్ అమలుతో రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని, సంపద సృష్టి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.</p>
<p><br /><span style="color:rgb(22,145,121);"><strong>ఉగాది సందేశం</strong></span><br />ఉగాది కొత్త ఆరంభానికి నాంది అని కవిత పేర్కొన్నారు. ప్రజల కోసం సేవ చేయాలని జాగృతి నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ నేల త్యాగాల పరంపరతో నిలిచిందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం తెలుగు ప్రజలకు శుభఫలితాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10510/traditional-ugadi-celebrations-under-telangana-jagruti-release-public-budget</link>
                <guid>https://www.prajamantalu.com/article/10510/traditional-ugadi-celebrations-under-telangana-jagruti-release-public-budget</guid>
                <pubDate>Thu, 19 Mar 2026 20:38:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260319-wa0016.jpg"                         length="310027"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు – దావ వసంత సురేష్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, మార్చ్ 18 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.<br />ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దావ వసంత సురేష్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. రంజాన్ తోఫా, షాదీ ముబారక్ వంటి పథకాలతో పాటు అధికారికంగా ఇఫ్తార్ విందులను కూడా ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.<br />పేద మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10508/iftar-is-a-symbol-of-communal-harmony-%E2%80%93-daava-vasantha"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260318-wa0010.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, మార్చ్ 18 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.<br />ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దావ వసంత సురేష్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. రంజాన్ తోఫా, షాదీ ముబారక్ వంటి పథకాలతో పాటు అధికారికంగా ఇఫ్తార్ విందులను కూడా ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.<br />పేద మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.<br />ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు, కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, అవారి శివ, కేసరి బాబు, హరీష్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మైనారిటీ నాయకులు రియాజ్ ఖాన్, ఆసిఫ్, జునైద్, అసీం, సవన్, కమల్, జబెర్, ఫయాజ్, చాంద్, ఆరిఫ్, సాజిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు శీలం ప్రవీణ్, అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్, బండారి విజయ్ రెడ్డి, ప్రశాంత్ రావు, చింతల గంగాధర్, బండి వంశీ బాబు, సన్నిత్, నక్క గంగాధర్, గాజుల శ్రీనివాస్, గంగిపెల్లి వేణుమాధవ్, సంతోష్ గంగాధర్, అనురాధ, మల్లీశ్వరి, మానస తదితరులు హాజరయ్యారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10508/iftar-is-a-symbol-of-communal-harmony-%E2%80%93-daava-vasantha</link>
                <guid>https://www.prajamantalu.com/article/10508/iftar-is-a-symbol-of-communal-harmony-%E2%80%93-daava-vasantha</guid>
                <pubDate>Wed, 18 Mar 2026 23:25:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260318-wa0010.jpg"                         length="131414"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.<br />జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి వారి దీక్షను విరమింపజేశారు. అనంతరం విశారదన్ మహారాజ్, జస్టిస్ ఈశ్వరయ్యలతో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు.</p>
<p><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలుగుమట్ల ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసిందన్నారు. అర్ధరాత్రి సమయంలో బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చివేయడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలిగించే విధంగా ఉందని విమర్శించారు. బాధితుల ఇళ్లను కూల్చివేసిన తరువాత వారికి భూమిపై హక్కులు లేవని చెప్పడం మరింత అవమానకరమని అన్నారు.<br />వెలుగుమట్ల బాధితులను కలిసినప్పుడు పరిస్థితి చూసి మనం భారత్‌లో ఉన్నామా లేదా అఫ్గానిస్తాన్‌లో ఉన్నామా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10484/kavitha-deeksha-ceases-as-houses-are-announced-for-the-victims"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260311-wa0008.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.<br />జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి వారి దీక్షను విరమింపజేశారు. అనంతరం విశారదన్ మహారాజ్, జస్టిస్ ఈశ్వరయ్యలతో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు.</p>
<p><br />ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలుగుమట్ల ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసిందన్నారు. అర్ధరాత్రి సమయంలో బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చివేయడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలిగించే విధంగా ఉందని విమర్శించారు. బాధితుల ఇళ్లను కూల్చివేసిన తరువాత వారికి భూమిపై హక్కులు లేవని చెప్పడం మరింత అవమానకరమని అన్నారు.<br />వెలుగుమట్ల బాధితులను కలిసినప్పుడు పరిస్థితి చూసి మనం భారత్‌లో ఉన్నామా లేదా అఫ్గానిస్తాన్‌లో ఉన్నామా అనే అనుమానం కలిగిందని వ్యాఖ్యానించారు. పేదలను కొట్టి వారి భూములను కొందరు ప్రభావశీలులకు అప్పగించే కుట్ర జరుగుతోందనే అనుమానం తమకు కలిగిందన్నారు.</p>
<p><br />అన్ని అర్హతలు ఉన్న పేదల ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది అని ప్రశ్నించిన ఆమె, ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్లి ఇళ్లను కూల్చివేయడం తీవ్రమైన చట్టవిరుద్ధ చర్య అని అన్నారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఈ ఘటనపై బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వంపై గట్టి చర్యలు తీసుకోవాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.<br />మొన్నటివరకు ఆక్రమణలు జరిగాయని చెప్పిన మంత్రులు ఇప్పుడు అక్కడ అర్హులు ఉన్నారని చెప్పడం విరుద్ధ వ్యాఖ్యలని కవిత విమర్శించారు. పోలీసు కమిషనరే ల్యాండ్ ఓనర్లను ఖాళీ చేయించి ఇళ్లు కూల్చేశామని ట్వీట్ చేసినప్పుడు ఆ అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><br />ప్రభుత్వం బాధితులకు ఇచ్చిన టోకెన్లపై ఇంకా అనుమానం ఉందని, పూర్తి లేఅవుట్ తీసి ప్రతి కుటుంబానికి వారి స్థలం ఎక్కడుందో స్పష్టంగా చూపించాలని ఆమె కోరారు. కొందరు పది లక్షలు, కొందరు ఇరవై లక్షలు, మరికొందరు ముప్పై లక్షలు ఖర్చు చేసి ఇళ్లు నిర్మించుకున్నారని, వారికి కేవలం ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పడం సరిపోదన్నారు.<br />వెలుగుమట్ల ఘటనపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగిందా లేదా పరిశీలిస్తామని కవిత తెలిపారు. జస్టిస్ ఈశ్వరయ్య సమక్షంలో బాధితులతో మళ్లీ మాట్లాడి పూర్తి నివేదిక తీసుకుంటామని చెప్పారు.<br />రాష్ట్రంలోని లక్షా 74 వేల ఎకరాల భూదాన్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని కవిత ఆరోపించారు. వెలుగుమట్లలో జరిగిన కూల్చివేతలు ఒక ట్రయల్ మాత్రమేనని, ఎలాంటి వ్యతిరేకత రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూములను కాజేసే ప్రయత్నం జరిగేదని అన్నారు.</p>
<p><br />భూదాన్ భూముల లెక్కలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ భూములు పేదలకు చెందేవేనని, వాటిని వారికి పంపిణీ చేయాలని, లేకపోతే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పంచుతామని తెలిపారు.<br />ప్రస్తుతం ఈ పోరాటానికి విరామం మాత్రమేనని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైతే మళ్లీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు.<br />ఈ సందర్భంగా తమ దీక్షకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, జాగృతి కార్యకర్తలు మరియు ఇతర ప్రగతిశీల శక్తులకు కవిత కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10484/kavitha-deeksha-ceases-as-houses-are-announced-for-the-victims</link>
                <guid>https://www.prajamantalu.com/article/10484/kavitha-deeksha-ceases-as-houses-are-announced-for-the-victims</guid>
                <pubDate>Wed, 11 Mar 2026 20:53:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260311-wa0008.jpg"                         length="138881"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు</title>
                                    <description><![CDATA[<p><strong>మెట్‌పల్లి, మార్చ్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />సమాజంలో సానుకూల మార్పులు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత సాధ్యమవుతుందని మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.<br />ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ, సమాజంలో మార్పులు వచ్చినప్పుడే మహిళల స్థానం మరింత బలపడుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు ముందడుగు వేస్తున్నప్పటికీ, కొన్నిచోట్ల ఇంకా లైంగిక వేధింపులు ఎదుర్కోవడం దురదృష్టకరమన్నారు. అలాంటి సందర్భాల్లో మహిళలు చట్టపరమైన రక్షణ కోసం మండల న్యాయసేవా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.<br />పురుషుల కంటే తాము తక్కువ కాదనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10480/senior-civil-judge-nageshwar-rao-said-that-womens-empowerment-is"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/image-(2)-(1).jpg" alt=""></a><br /><p><strong>మెట్‌పల్లి, మార్చ్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />సమాజంలో సానుకూల మార్పులు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత సాధ్యమవుతుందని మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.<br />ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ, సమాజంలో మార్పులు వచ్చినప్పుడే మహిళల స్థానం మరింత బలపడుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు ముందడుగు వేస్తున్నప్పటికీ, కొన్నిచోట్ల ఇంకా లైంగిక వేధింపులు ఎదుర్కోవడం దురదృష్టకరమన్నారు. అలాంటి సందర్భాల్లో మహిళలు చట్టపరమైన రక్షణ కోసం మండల న్యాయసేవా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.<br />పురుషుల కంటే తాము తక్కువ కాదనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.</p>
<p><br />ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్, అదనపు ప్రజా అభియోగ అధికారి చెర్లపల్లి ఆనంద్ గౌడ్, సహాయ ప్రజా అభియోగ అధికారి జి. ప్రణయ్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, కోశాధికారి పడిగెల శ్రీనివాస్, క్రీడా కార్యదర్శి బిగుల్లా శంకర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా న్యాయవాదులు మామిడిపల్లి విజయలక్ష్మి, కాజీపేట స్రవంతి, మెడిచెల్మల సుమలత, మాలేపు సంధ్యా రాణి, లొకిని హరిచందనతో పాటు కోర్టు సిబ్బంది వసంత, ఇందిర, విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, మనీషా, సుష్మ, స్వాతి, సరిత, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260310-wa0044.jpg" alt="IMG-20260310-WA0044" width="1600" height="738"></img></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>సావిత్రిబాయి పూలే కు నివాళులు </strong></span><br /> మహిళా విద్యోద్యమ పితామహి సావిత్రిబాయి ఫూలే 129వ వర్ధంతి సందర్భంగా మెట్‌పల్లి బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10480/senior-civil-judge-nageshwar-rao-said-that-womens-empowerment-is</link>
                <guid>https://www.prajamantalu.com/article/10480/senior-civil-judge-nageshwar-rao-said-that-womens-empowerment-is</guid>
                <pubDate>Tue, 10 Mar 2026 20:07:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/image-%282%29-%281%29.jpg"                         length="162137"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల రూరల్,  మార్చ్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న విషయంపై తాను ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.<br />జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల రోజే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం గురించి తాను ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అప్పుడే స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. ఆ సందర్భంలో చెప్పిన మాటలు ఇప్పటికీ మారలేదని, అయితే ఇప్పటివరకు తాను ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.<br />పార్టీలోని పరిస్థితులు, జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా ఆలోచింపజేశాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పని చేసిన తనలాంటి నాయకులను పక్కన పెట్టే పరిస్థితులు రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.<br />ఇప్పటికీ తాను తొందరపడి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేనని, కాంగ్రెస్ పార్టీలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10479/thinking-about-continuing-in-congress-ex-minister-jeevan-reddys-extreme"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/images-(13).jpeg" alt=""></a><br /><p><strong>జగిత్యాల రూరల్,  మార్చ్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న విషయంపై తాను ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.<br />జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల రోజే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం గురించి తాను ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అప్పుడే స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. ఆ సందర్భంలో చెప్పిన మాటలు ఇప్పటికీ మారలేదని, అయితే ఇప్పటివరకు తాను ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.<br />పార్టీలోని పరిస్థితులు, జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా ఆలోచింపజేశాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పని చేసిన తనలాంటి నాయకులను పక్కన పెట్టే పరిస్థితులు రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.<br />ఇప్పటికీ తాను తొందరపడి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేనని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన మిత్రులు, కార్యకర్తలు, అనుచరులతో చర్చించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటిస్తానని చెప్పారు.<br />పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన తదుపరి నిర్ణయం ఏంటన్నది జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆసక్తికరంగా మారింది.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10479/thinking-about-continuing-in-congress-ex-minister-jeevan-reddys-extreme</link>
                <guid>https://www.prajamantalu.com/article/10479/thinking-about-continuing-in-congress-ex-minister-jeevan-reddys-extreme</guid>
                <pubDate>Tue, 10 Mar 2026 19:40:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/images-%2813%29.jpeg"                         length="29376"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా ఖమెనీ నియామకం –</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(186,55,42);">ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా కామెనీ నియామకం</span></strong></p>
<p><br />మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో అత్యున్నత మత-రాజకీయ అధికారం అయిన సుప్రీం లీడర్ పదవికి మోజ్తభా కామెనీను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.<br />మోజ్తభా కామెనీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా అలీ కామెనీ కుమారుడు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రముఖ మత పండితులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసే అధికారం కలిగి ఉంటుంది. అదే ప్రక్రియలో మోజ్తభా కామెనీని ఈ పదవికి ఎన్నుకున్నట్లు సమాచారం.</p>
<p><br /><span style="color:rgb(186,55,42);"><strong>ఇరాన్ రాజకీయాల్లో మోజ్తభా కామెనీ పాత్ర</strong></span><br />మోజ్తభా కామెనీ గతంలో అధికారికంగా ఎలాంటి ఎన్నికల పదవిలో లేకపోయినా, ఇరాన్ మత మరియు రాజకీయ వ్యవస్థలో ప్రభావశీల వ్యక్తిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఇరాన్ శక్తివంతమైన భద్రతా సంస్థ అయిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10468/appointment-of-mojtabha-khamenei-as-supreme-leader-of-iran-%E2%80%93"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img_20260309_185054.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(186,55,42);">ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా కామెనీ నియామకం</span></strong></p>
<p><br />మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో అత్యున్నత మత-రాజకీయ అధికారం అయిన సుప్రీం లీడర్ పదవికి మోజ్తభా కామెనీను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.<br />మోజ్తభా కామెనీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా అలీ కామెనీ కుమారుడు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రముఖ మత పండితులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసే అధికారం కలిగి ఉంటుంది. అదే ప్రక్రియలో మోజ్తభా కామెనీని ఈ పదవికి ఎన్నుకున్నట్లు సమాచారం.</p>
<p><br /><span style="color:rgb(186,55,42);"><strong>ఇరాన్ రాజకీయాల్లో మోజ్తభా కామెనీ పాత్ర</strong></span><br />మోజ్తభా కామెనీ గతంలో అధికారికంగా ఎలాంటి ఎన్నికల పదవిలో లేకపోయినా, ఇరాన్ మత మరియు రాజకీయ వ్యవస్థలో ప్రభావశీల వ్యక్తిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఇరాన్ శక్తివంతమైన భద్రతా సంస్థ అయిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.<br />ఇరాన్ రాజకీయ వ్యవస్థలో సుప్రీం లీడర్‌కు అత్యంత కీలక అధికారాలు ఉంటాయి. దేశ సైన్యం, భద్రతా వ్యవస్థ, విదేశాంగ విధానం మరియు అణు కార్యక్రమాలపై తుది నిర్ణయాధికారం ఈ పదవికే చెందుతుంది.</p>
<p><br /><strong><span style="color:rgb(186,55,42);">వారసత్వ రాజకీయాలపై చర్చ</span></strong><br />1979లో జరిగిన ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌లో సుప్రీం లీడర్ పదవి వారసత్వంగా మారిందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. తండ్రి తర్వాత కుమారుడు ఈ పదవిని చేపట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం.<br />ఈ నేపథ్యంలో కొందరు విశ్లేషకులు ఇరాన్ రాజకీయ వ్యవస్థలో కుటుంబ ప్రభావం పెరుగుతోందని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది రాజ్యాంగ ప్రక్రియలో భాగమేనని అంటున్నారు.</p>
<p><br /><strong><span style="color:rgb(186,55,42);">అంతర్జాతీయ ప్రతిస్పందనలు</span></strong><br />మోజ్తభా కామెనీ నియామకంపై ప్రపంచ దేశాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనకు అభినందనలు తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు అమెరికా మరియు ఇజ్రాయెల్ వర్గాలు ఈ పరిణామాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి.<br />మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో కొత్త నాయకత్వం ప్రాంతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణలు కొనసాగుతున్నాయి.</p>
<h6><br /><strong><span style="color:rgb(186,55,42);">ఇరాన్ సుప్రీం లీడర్ అధికారాలు</span></strong></h6>
<h6><strong>ఇరాన్ సుప్రీం లీడర్‌కు ఉన్న ప్రధాన అధికారాలు ఇవి:</strong><br /><strong>దేశ సైన్యానికి పరమాధికారి</strong><br /><strong>అణు కార్యక్రమాలపై తుది నిర్ణయం</strong><br /><strong>విదేశాంగ విధానాలపై ప్రభావం</strong><br /><strong>న్యాయవ్యవస్థ, భద్రతా వ్యవస్థలపై నియంత్రణ</strong><br /><strong>కీలక ప్రభుత్వ సంస్థల నియామకాలపై అధికారం</strong><br /><strong>ప్రస్తుతం మోజ్తభా కామెనీ నాయకత్వం ఇరాన్ రాజకీయాలు, మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితులపై ఎలా ప్రభావం చూపుతుందో ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి.</strong><br /><br /></h6>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10468/appointment-of-mojtabha-khamenei-as-supreme-leader-of-iran-%E2%80%93</link>
                <guid>https://www.prajamantalu.com/article/10468/appointment-of-mojtabha-khamenei-as-supreme-leader-of-iran-%E2%80%93</guid>
                <pubDate>Mon, 09 Mar 2026 18:57:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img_20260309_185054.jpg"                         length="60614"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖమ్మంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ – మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టుపై వివాదం</title>
                                    <description><![CDATA[<p><strong><img src="https://www.prajamantalu.com/media/2026-03/img_20260309_183833.jpg" alt="IMG_20260309_183833" width="594" height="713" />ఖమ్మం, మార్చి 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.<br />కవితతో పాటు పలువురు మహిళలను మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే పోలీసులు అరెస్ట్ చేశారని తెలంగాణ జాగృతి నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>
<p><br />అరెస్ట్ అనంతరం కల్వకుంట్ల కవితను ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను రఘునాథపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.<br />ఈ ఘటనలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి నాయకులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10467/kavita-arrest-of-kalvakuntla-in-khammam-%E2%80%93-controversy-over-arrest"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260309-wa0036.jpg" alt=""></a><br /><p><strong><img src="https://www.prajamantalu.com/media/2026-03/img_20260309_183833.jpg" alt="IMG_20260309_183833" width="594" height="713"></img>ఖమ్మం, మార్చి 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.<br />కవితతో పాటు పలువురు మహిళలను మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే పోలీసులు అరెస్ట్ చేశారని తెలంగాణ జాగృతి నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>
<p><br />అరెస్ట్ అనంతరం కల్వకుంట్ల కవితను ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను రఘునాథపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.<br />ఈ ఘటనలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి నాయకులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10467/kavita-arrest-of-kalvakuntla-in-khammam-%E2%80%93-controversy-over-arrest</link>
                <guid>https://www.prajamantalu.com/article/10467/kavita-arrest-of-kalvakuntla-in-khammam-%E2%80%93-controversy-over-arrest</guid>
                <pubDate>Mon, 09 Mar 2026 18:40:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260309-wa0036.jpg"                         length="119874"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోంది: కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><br /><strong>ఖమ్మం, మార్చ్ 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయల్దేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.<br />పిల్లల పరీక్షల సమయంలోనే పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడం అమానుషమని ఆమె విమర్శించారు. ఇళ్లు కూల్చిన తరువాత చాలా మంది రాజకీయ నాయకులు బాధితుల బాధను ఎగ్జిబిషన్‌లా చూసి వెళ్లారని, కొందరు రాజకీయ పార్టీలకు ఈ బాధ ఒక ప్రదర్శనగా మారిందని అన్నారు.<br />తాను కేవలం బాధితులను చూసి వెళ్లటానికి రాలేదని, వారి సమస్యలను పూర్తిగా విని ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం సాధించేందుకు వచ్చానని కవిత స్పష్టం చేశారు. మహిళలు, పేదల పక్షాన ఎప్పుడూ నిలుస్తానని ఆమె తెలిపారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img_20260309_142359.jpg" alt="IMG_20260309_142359" width="1080" height="603" /><br />వెలుగుమట్ల బాధితుల పక్షాన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10465/draft-add-your-title-kalvakuntlas-poem-is-stomach-churning-when"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img_20260309_142423.jpg" alt=""></a><br /><p><br /><strong>ఖమ్మం, మార్చ్ 09 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయల్దేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.<br />పిల్లల పరీక్షల సమయంలోనే పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడం అమానుషమని ఆమె విమర్శించారు. ఇళ్లు కూల్చిన తరువాత చాలా మంది రాజకీయ నాయకులు బాధితుల బాధను ఎగ్జిబిషన్‌లా చూసి వెళ్లారని, కొందరు రాజకీయ పార్టీలకు ఈ బాధ ఒక ప్రదర్శనగా మారిందని అన్నారు.<br />తాను కేవలం బాధితులను చూసి వెళ్లటానికి రాలేదని, వారి సమస్యలను పూర్తిగా విని ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం సాధించేందుకు వచ్చానని కవిత స్పష్టం చేశారు. మహిళలు, పేదల పక్షాన ఎప్పుడూ నిలుస్తానని ఆమె తెలిపారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img_20260309_142359.jpg" alt="IMG_20260309_142359" width="1080" height="603"></img><br />వెలుగుమట్ల బాధితుల పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలు మరియు తెలంగాణ జాగృతి కలిసి పోరాటం చేస్తాయని ఆమె చెప్పారు. సమస్యకు పరిష్కారం వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.<br />ప్రస్తుతం బాధితులను సరైన సదుపాయాలు లేకుండా ఒకేచోటకు తరలించారని, మహిళలకు ప్రత్యేక వసతి కూడా లేదని కవిత అన్నారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు కనీసం హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమని విమర్శించారు.<br />గతంలో ఇళ్ల కూల్చివేతకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు భోజనాలు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారని, వారు చేసిన పాపాలను కడుక్కునే ప్రయత్నమే అది అని ఆమె వ్యాఖ్యానించారు.</p>
<p><br />జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎవరూ బాధితుల సమస్యపై స్పందించలేదని కవిత అన్నారు. ముఖ్యమంత్రి మరియు జిల్లా మంత్రులు వెంటనే ఈ సమస్యపై మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ వెంటనే బాధితులను కలవాలని కోరారు.<br />బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చివేశారో అదే చోట వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేరే ప్రాంతాలకు తరలించాలనే ప్రయత్నాలను ప్రజలు అంగీకరించరని తెలిపారు.<br />రాష్ట్రంలో పేదలపై జులుం నడుస్తోందని, పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారని కవిత విమర్శించారు. పెద్దల అక్రమ నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.<br />పేదల హక్కులను కాపాడేందుకు మరియు బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.<br />SEO ట్యాగ్స్:<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10465/draft-add-your-title-kalvakuntlas-poem-is-stomach-churning-when</link>
                <guid>https://www.prajamantalu.com/article/10465/draft-add-your-title-kalvakuntlas-poem-is-stomach-churning-when</guid>
                <pubDate>Mon, 09 Mar 2026 14:25:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img_20260309_142423.jpg"                         length="153871"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్ మార్చ్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.</p>
<p><br />అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260308-wa0011.jpg" alt="IMG-20260308-WA0011" width="1200" height="656" /><br />దేశంలోని కొన్ని ప్రధాన నగరాలు ప్రస్తుతం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ముంబయ్‌లో భారీ వర్షాలు పడితే నగరం అస్తవ్యస్తమవుతుందని, ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని చెప్పారు. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, చెన్నైలో వరదల సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని గుర్తు చేశారు.</p>
<p><br />ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో హైదరాబాద్‌లో తలెత్తకూడదని ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో వాయు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10463/100-electric-rtc-buses-in-hyderabad-by-december-9-2026"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260308-wa0012.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్ మార్చ్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.</p>
<p><br />అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260308-wa0011.jpg" alt="IMG-20260308-WA0011" width="1280" height="656"></img><br />దేశంలోని కొన్ని ప్రధాన నగరాలు ప్రస్తుతం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ముంబయ్‌లో భారీ వర్షాలు పడితే నగరం అస్తవ్యస్తమవుతుందని, ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని చెప్పారు. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, చెన్నైలో వరదల సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని గుర్తు చేశారు.</p>
<p><br />ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో హైదరాబాద్‌లో తలెత్తకూడదని ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో వాయు నాణ్యత ఆరెంజ్ స్థాయికి చేరిందని, భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.</p>
<p><br />నగరంలో చెత్త సమస్య, దోమల సమస్య, మూసీ నదిలో కాలుష్యం వంటి అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఢిల్లీలో యమునా నది అభివృద్ధి, ఉత్తరప్రదేశ్‌లో గంగా నది శుద్ధి, గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల మాదిరిగానే హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పారు.</p>
<p><br />సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం మూసీ నది వెంట బఫర్ జోన్ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు. నాలా ప్రాంతాల్లో 10 మీటర్లు, నదుల వద్ద 50 మీటర్ల బఫర్ జోన్ ఉండాలని నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు అనుమతించబడవని చెప్పారు.</p>
<p><br />మూసీ నది అభివృద్ధి కార్యక్రమం వల్ల ఇళ్లను కోల్పోయే వారికి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైతే వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కూడా కల్పిస్తామని చెప్పారు.</p>
<p><br />గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కొందరు చెబుతున్నారని, కానీ గాంధీ విగ్రహం కోసం సుమారు 70 కోట్లు, విజ్ఞాన కేంద్రం మరియు అభివృద్ధి పనులకు మొత్తం 200 కోట్లు మాత్రమే ఖర్చవుతాయని వివరించారు.<br />ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 13న ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడిస్తామని చెప్పారు.<br />కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో సుమారు 2800 డీజిల్ బస్సులు ఉన్నాయని, వాటి స్థానంలో 2026 డిసెంబర్ 9 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలిపారు. ఇప్పటికే 500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించినట్లు చెప్పారు.</p>
<p><br />డీజిల్ బస్సులను నగరం బయట ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఈవీ వాహనాలకు జీరో పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నగరంలో సుమారు రెండు లక్షల ఆటోలు ఉన్నాయని, వాటిని కూడా రెట్రోఫిటింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళిక ఉందన్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.</p>
<p><br />కాలుష్యానికి కారణమయ్యే రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను నగరం బయటకు తరలించే ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నారు.<br />తెలంగాణ రాష్ట్రం దేశ జనాభాలో కేవలం 2.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ దేశ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అప్పటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతానికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.</p>
<p><span style="color:rgb(22,145,121);"><strong>డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం</strong></span><br />ఈ లక్ష్య సాధనలో మహిళల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని, మీడియా సంస్థల్లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డెస్క్ జర్నలిస్టుల గుర్తింపులో కూడా ఎవరికీ అన్యాయం జరగదని చెప్పారు.<br />సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను తొలగించాలంటే వారికి సమాన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే దేశం కూడా ఆర్థికంగా బలపడుతుందని పేర్కొన్నారు.</p>
<p><br />ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంకతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు.</p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10463/100-electric-rtc-buses-in-hyderabad-by-december-9-2026</link>
                <guid>https://www.prajamantalu.com/article/10463/100-electric-rtc-buses-in-hyderabad-by-december-9-2026</guid>
                <pubDate>Sun, 08 Mar 2026 17:20:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260308-wa0012.jpg"                         length="184484"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మెట్రో ఛానల్ వద్ద మమతా బెనర్జీ ధర్నా – సింగూర్ ఉద్యమం జ్ఞాపకాలతో ఎన్నికల సమరానికి సంకేతం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>బెంగాల్ రాజకీయాలపై ప్రత్యేక కథనం </strong></span><br /><br />పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి Mamata Banerjee మరోసారి కోల్‌కతాలోని Metro Channel వద్ద ధర్నా చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు నిరసనలు నిర్వహించే ప్రదేశంగా ఈ స్థలం ప్రసిద్ధి పొందింది. కానీ మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.</p>
<p><br /><span style="color:rgb(186,55,42);"><strong>సింగూర్ ఉద్యమానికి ఆరంభం</strong></span><br />రెండువేల ఆరు సంవత్సరంలో సింగూర్ ప్రాంతంలో రైతుల భూములపై కారు కర్మాగారం నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. రైతుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారనే ఆరోపణలతో మమతా బెనర్జీ మెట్రో ఛానల్ వద్ద నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు.</p>
<p><br />ఈ ఉద్యమం తరువాత రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ప్రజా పోరాటంగా మారింది. చివరకు కారు కర్మాగారం ప్రణాళికను అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. అదే ఉద్యమం మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో కీలక మలుపు తీసుకొచ్చింది.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10462/mamata-banerjees-dharna-at-metro-channel-%E2%80%93-a-sign-of"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/newindianexpress_2026-03-07_01tykfuw_pti03072026000097a.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>బెంగాల్ రాజకీయాలపై ప్రత్యేక కథనం </strong></span><br /><br />పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి Mamata Banerjee మరోసారి కోల్‌కతాలోని Metro Channel వద్ద ధర్నా చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు నిరసనలు నిర్వహించే ప్రదేశంగా ఈ స్థలం ప్రసిద్ధి పొందింది. కానీ మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.</p>
<p><br /><span style="color:rgb(186,55,42);"><strong>సింగూర్ ఉద్యమానికి ఆరంభం</strong></span><br />రెండువేల ఆరు సంవత్సరంలో సింగూర్ ప్రాంతంలో రైతుల భూములపై కారు కర్మాగారం నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. రైతుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారనే ఆరోపణలతో మమతా బెనర్జీ మెట్రో ఛానల్ వద్ద నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు.</p>
<p><br />ఈ ఉద్యమం తరువాత రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ప్రజా పోరాటంగా మారింది. చివరకు కారు కర్మాగారం ప్రణాళికను అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. అదే ఉద్యమం మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో కీలక మలుపు తీసుకొచ్చింది.</p>
<p><br /><strong><span style="color:rgb(22,145,121);">అధికారంలోకి ఎదుగుదల</span></strong><br />సింగూర్ ఉద్యమం తర్వాత మమతా బెనర్జీకి రాష్ట్రంలో భారీ ప్రజా మద్దతు లభించింది. దాని ఫలితంగా రెండువేల పదకొండు సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మమతా బెనర్జీ తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా మూడు సార్లు అధికారంలో కొనసాగుతున్నారు.</p>
<p><br /><strong><span style="color:rgb(22,145,121);">ఎన్నికల ముందు రాజకీయ వ్యూహం</span></strong><br />ఇప్పుడు మళ్లీ అదే మెట్రో ఛానల్ వద్ద ధర్నా చేయడం యాదృచ్ఛికం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజల్లో మళ్లీ ఉద్యమాత్మక వాతావరణం సృష్టించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారని చెబుతున్నారు.</p>
<p><br /><span style="color:rgb(224,62,45);"><strong>ప్రతిపక్ష సవాలు</strong></span><br />ఇటీవలి సంవత్సరాల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఎదుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గణనీయమైన సీట్లు సాధించడం వల్ల రాష్ట్రంలో రాజకీయ పోటీ మరింత తీవ్రంగా మారింది.</p>
<p><strong><span style="color:rgb(224,62,45);">నాలుగోసారి అధికారంలోకి వస్తారా?</span></strong><br />మెట్రో ఛానల్ వద్ద మమతా బెనర్జీ చేపట్టిన ఈ ధర్నా మరోసారి ప్రజల మద్దతు తెచ్చిపెడుతుందా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఇదే ప్రదేశం నుంచి ప్రారంభమైన ఉద్యమం ఆమెను ముఖ్యమంత్రి స్థాయికి చేర్చింది.<br />ఇప్పుడు అదే వేదిక నుంచి ప్రారంభమైన ఈ రాజకీయ పోరాటం ఆమెకు నాలుగోసారి అధికారాన్ని అందిస్తుందా లేదా అన్నది రాబోయే ఎన్నికల ఫలితాలు నిర్ణయించనున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10462/mamata-banerjees-dharna-at-metro-channel-%E2%80%93-a-sign-of</link>
                <guid>https://www.prajamantalu.com/article/10462/mamata-banerjees-dharna-at-metro-channel-%E2%80%93-a-sign-of</guid>
                <pubDate>Sun, 08 Mar 2026 16:04:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/newindianexpress_2026-03-07_01tykfuw_pti03072026000097a.jpg"                         length="75963"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేచపల్లి లో  బావిలో బాలుడి మృతదేహం</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల రూరల్, మార్చ్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />    రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ (10) సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు.<br />పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గ్రామం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.</p>
<p><br />ఇదిలా ఉండగా ఆదివారం గ్రామ సమీపంలోని బావిలో బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సారంగాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.<br />ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన బాలుడి మృతదేహం లభించడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10461/boys-body-in-a-well-in-rechapally"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img_20260308_104004.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల రూరల్, మార్చ్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />  రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ (10) సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు.<br />పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గ్రామం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.</p>
<p><br />ఇదిలా ఉండగా ఆదివారం గ్రామ సమీపంలోని బావిలో బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సారంగాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.<br />ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన బాలుడి మృతదేహం లభించడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10461/boys-body-in-a-well-in-rechapally</link>
                <guid>https://www.prajamantalu.com/article/10461/boys-body-in-a-well-in-rechapally</guid>
                <pubDate>Sun, 08 Mar 2026 10:47:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img_20260308_104004.jpg"                         length="13882"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల మార్చ్ 07 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు.<br />జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తనపై తప్పుడు సమాచారం ఆధారంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు.</p>
<p><br />ఎంపీ మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.<br />కేంద్రీయ విద్యాలయం విషయంపై పూర్తి ఆధారాలు ఉన్నాయి<br />కేంద్రీయ విద్యాలయం స్థలం విషయంలో తాను చేసిన ప్రతి చర్యకు పూర్తి ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. 2025 నవంబర్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాసినట్లు చెప్పారు. మంత్రి ఎండార్స్ చేసిన పత్రాలు కూడా ఉన్నాయని, అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించవచ్చని అన్నారు.<br />చల్గల్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10460/development-of-world-is-my-aim-%E2%80%93-mla-dr-sanjay"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260307-wa0038.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల మార్చ్ 07 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు.<br />జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తనపై తప్పుడు సమాచారం ఆధారంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు.</p>
<p><br />ఎంపీ మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.<br />కేంద్రీయ విద్యాలయం విషయంపై పూర్తి ఆధారాలు ఉన్నాయి<br />కేంద్రీయ విద్యాలయం స్థలం విషయంలో తాను చేసిన ప్రతి చర్యకు పూర్తి ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. 2025 నవంబర్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాసినట్లు చెప్పారు. మంత్రి ఎండార్స్ చేసిన పత్రాలు కూడా ఉన్నాయని, అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించవచ్చని అన్నారు.<br />చల్గల్ వాలాంతరి ప్రాంతంలో సుమారు 80 ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలిపారు. కేంద్రీయ విద్యాలయం కోసం ఆర్డీవో ద్వారా సర్వే చేసి 5 ఎకరాల స్థలం పంపినట్లు చెప్పారు.</p>
<p><br /><strong><span style="color:rgb(186,55,42);">నవోదయ పాఠశాలపై విమర్శ</span></strong></p>
<p>జగిత్యాల ప్రజలు ఓట్లు వేయలేదనే కారణంతోనే ఎంపీ చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. అందువల్లనే నవోదయ పాఠశాలను కోరుట్లకు కేటాయించారని అన్నారు.</p>
<p><br /><span style="color:rgb(186,55,42);"><strong>బ్రిడ్జిలు, గిరిజన నిధులపై ప్రశ్న</strong></span><br />జగదల్పూర్ – నిజామాబాద్ జాతీయ రహదారిపై అనంతారం బ్రిడ్జి మరియు రాయికల్ సింగరావుపేట బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు.<br />అలాగే ఆర్టికల్ 275 కింద గిరిజనులకు రావాల్సిన నిధులు కూడా ఇప్పటివరకు మంజూరు కాలేదని తెలిపారు.<br />వ్యక్తిగత విమర్శలు రాజకీయాలకు మంచివి కావు<br />ముఖ్యమంత్రి చదువు లేదని ఎంపీ విమర్శించడం సరికాదని అన్నారు. అదే విధంగా ప్రధానమంత్రి ఎంత వరకు చదివారో కూడా చెప్పాలని ప్రశ్నించారు.<br /><span style="color:rgb(186,55,42);"><strong>“మోడీ జీని చాయ్ వాలా అని మేము పిలవము. మేము హుందాగా ఉంటాం” అని వ్యాఖ్యానించారు.</strong></span><br />ఎన్నికల వరకు రాజకీయాలు సహజమని, ఆ తరువాత ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలని సూచించారు. అవసరమైతే కేంద్ర నిధుల కోసం ఎంపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.</p>
<p><br />ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ పర్వీన్ మున్నా, యువ కాంగ్రెస్ అధ్యక్షుడు భీరం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10460/development-of-world-is-my-aim-%E2%80%93-mla-dr-sanjay</link>
                <guid>https://www.prajamantalu.com/article/10460/development-of-world-is-my-aim-%E2%80%93-mla-dr-sanjay</guid>
                <pubDate>Sat, 07 Mar 2026 21:22:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260307-wa0038.jpg"                         length="84384"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        