కాసేపు హాయిగా నవ్వుకోండి..చాలా సీరియస్ అంశం?
నేటి సామాజిక ఆలోచనలపై వ్యంగ్య రచన
(జర్నలిస్ట్ నాగ్ రాజ్ FB నుండి)
ఇందాక ఆకలేసి,
దారిలో పంచెకట్టు దోశ సెంటర్ కనిపిస్తే వెళ్లా.
మెనూ చెక్ చేసి,"ఓ ఘీంకారం దోశ.. టోకెన్ ఇవ్వు" అనడిగా.
(అంటే ఏనుగు అరుపు కాదు) -ed
"అది ఘీంకారం కాదు, ఘీ కారం" అన్నాడాయన కోపంగా.
"ఓహ్, ఒకటివ్వు" అన్నాను.
టోకెన్ తీసుకెళ్లి దోశ మాస్టర్ కిచ్చా.
పెనం మీద దోశ పిండిని రాశిగా పోశాడు.
గిన్నెతో పిండిని గుండ్రంగా చేశాడు.
తర్వాత నెయ్యి పోశాడు.
ఆపై దోశ మీద కారం గుజ్జు వేసి చదును చేశాడు.
తర్వాత ఏదో పొడి చల్లాడు.
ఆపై మళ్లీ నెయ్యి పోశాడు.
కాసేపు వేగనిచ్చాడు.
ఆ దోశ రంగు, రూపు చక్కగా ఉంది!!
బహుశా, ఇలాంటి దోశల ఫొటో తీసే, కొంత ప్యాచప్ చేసి,
కొత్త గెలాక్సీలను కనుగొన్నానని చెబుతాడేమో NASA వాడు!!
గెలాక్సీ ఘీంకారం దోశను తీసి
బల్లపరుపుగా ఉన్న ఓ చెక్క ప్లేట్లో వేసి,
ఓ చిన్న ప్లాస్టిక్ కప్పులో పల్లీ చట్నీ వేసిచ్చాడు, సర్వర్.
మరీ చిన్నగా ఉన్న ఆ ప్లాస్టిక్ కప్పును చూస్తే,
మన గెలాక్సీలో ప్లానెట్ హోదా కోల్పోయిన ప్లూటోలాగా అనిపించింది. పోనీయండి!!
దోశ తిందామని రెడీ అవుతుండగా
ఏదో ర్యాండమ్ కాల్ వచ్చింది. ఆన్సర్ చేశా!
"నేను నెహ్రూ మాట్లాడుతున్నా.." అని వినిపించింది.
"సార్ నేను బిజీగా ఉన్నా.
ఓ పావుగంట తర్వాత చేస్తారా.." అనడిగాను.
"5 నిమిషాల్లో ఓ కచేరీ ఉంది గానీ, వన్ మినిట్లో ట్రెండింగ్ న్యూస్ ఏంటో చెప్పు" అన్నారాయన.
అసలే పెద్దాయన, కాల్ కట్ చేస్తే ఫీల్ అవుతారు. చేసేదేం లేక,
"రూపాయ్ వాల్యూ ఘోరంగా పడిపోయింది.
ఇండియాకు, అమెరికాకు మరింత చెడింది.
ఇండిగో వాడు ఫ్లైట్స్, ప్యాసింజర్స్ తో ఫుట్ బాల్ ఆడుకున్నాడు.
మీ పార్టీ మేస్త్రీ, మెస్సీతో ఫుట్ బాల్ ఆడనున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో దిష్టి, భూతశుద్ది నడుస్తోంది.
బాలు స్టాచ్యూపై మళ్లీ మనోభావాలు దెబ్బతిన్నాయి.
మొత్తం వీటన్నింటికీ కారణం..
నెహ్రూనే అనుకుంటున్నారు,
బై, ఉంటా సార్," అని కాల్ కట్ చేయబోయా నేను.
"ఇంతకీ అఖండ 2 ఎందుకు వాయిదా పడింది" అనడిగారు ఆయన.
ఈయనేంటి ఇలా తగులుకున్నారు అనిపించింది.
"అఖండ 2 వాయిదాకు కారణం అప్పట్లో నెహ్రూ అనుసరించిన ఆర్థిక విధానాలే..అంటూ ట్వీట్ చేసి, ఆ సినిమా నిర్మాతలు కనిపించకుండా పోయారు. బాలయ్య త్రిశూలం పట్టుకుని బహుశా మీ దగ్గరకే రావచ్చు..’’ అని చెప్పా; ఇలాగైనా కాల్ కట్ చేస్తారేమోనని!
ఐనా, ఆయన కాల్ కట్ చేయలేదు.
"నీకో నిజం చెప్పనా" అన్నారాయన.
ఆకలితో ఓపిక నశించి
"చెప్పండి సార్" అన్నాను నీరసంగా.
"నీకు ఘీంకారం టోకెన్ ఇచ్చిన వాడు,
పెనం మీద పిండి వేసిన మాస్టర్,
దోశను అందజేసిన సర్వర్..
వీరు ముగ్గురూ ఎవరనుకుంటున్నావ్?
మారువేశంలో ఉన్న 14 Reels ఓనర్స్,
అప్పుల్లో ఉన్న అఖండ 2 నిర్మాతలే.." అని చెప్పి
కాల్ కట్ చేశారు ఆయన.
దోశ తినకుండానే
దబేల్మని పడిపోయా, నేను!!
ఇలాంటి అతి క్లిష్ట పరిస్థితుల్లో,
మీరు ముందుగా,
108కి కాల్ చేస్తారా? లేక,
బాలయ్యకు కాల్ చేస్తారా?
సరైన సమాధానం తెలిసీ చెప్పకపోయారో...
మీకు "ట్రంప్ దిష్టి" తగులుతుంది, ఖబడ్దార్!! 🤧😜
More News...
<%- node_title %>
<%- node_title %>
మోంబాసా సాటర్ డే క్లబ్ ఫండ్ రైజింగ్లో MOMTA సభ్యుల ప్రదర్శన
సికింద్రాబాద్, డిసెంబర్ 07 ( ప్రజామంటలు) :
కెన్యా లోని మోంబాసా తెలుగు అసోసియేషన్ ( MOMTA) ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కొరకు "సాటర్ డే క్లబ్" నిర్వహించిన అసోసియేషన్ సభ్యుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. బోర్ వెల్లుల ఏర్పాటు, విద్యార్థుల విద్యా సహాయం, భారీ నీటి నిల్వ ట్యాంకుల విరాళం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు... కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సత్యసాయి సేవా సమితి చేయూత
కొండగట్టు, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):స్థానికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 20 మంది చిరు వ్యాపారుల షాపులు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. పరిస్థితి తెలుసుకున్న భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల తరఫున తక్షణ సహాయం అందించారు.
సామ శ్రీనాథ్ కుటుంబ సభ్యులు, మహేష్ మొదలైన వారు... కాసేపు హాయిగా నవ్వుకోండి..చాలా సీరియస్ అంశం?
నేటి సామాజిక ఆలోచనలపై వ్యంగ్య రచన
(జర్నలిస్ట్ నాగ్ రాజ్ FB నుండి)
ఇందాక ఆకలేసి, దారిలో పంచెకట్టు దోశ సెంటర్ కనిపిస్తే వెళ్లా.
మెనూ చెక్ చేసి,"ఓ ఘీంకారం దోశ.. టోకెన్ ఇవ్వు" అనడిగా.
(అంటే ఏనుగు అరుపు కాదు) -ed
"అది ఘీంకారం కాదు, ఘీ కారం" అన్నాడాయన కోపంగా.
"ఓహ్,... జగిత్యాలలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షల పరంపర
జగిత్యాల డిసెంబర్ 07 (ప్రజా మంటలు):
కన్వెన్షన్ హాల్లో శృంగేరి శారద పీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి మహాభారత ప్రవచన మహాయజ్ఞం రెండో రోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రవచన... ఇండిగో సీఈఓ కు dgca నోటీస్
న్యూ ఢిల్లీ డిసెంబర్ 06;
ఇండిగో flights ఆలస్యాలు, క్రూ కొరత, ప్రయాణీకుల అసౌకర్యంపై దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో, డీజీసీఏ నేరంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. “మీపై తగిన అమలు చర్య ఎందుకు ప్రారంభించకూడదు?” అనే ప్రశ్నకు సంబంధించి, ఎల్బర్స్ 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని... IND vs SA: జైస్వాల్ తొలి వన్డే సెంచరీ – భారత్కు ఘన విజయం, సిరీస్ కైవసం
విశాఖపట్నం డిసెంబర్ 06:
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డేల్లో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో బోచ్ బౌలింగ్లో సింగిల్ తీసుకుని శతకం పూర్తి చేశాడు.
ఆరంభంలో రోహిత్ శర్మ (75) వేగంగా రాణించినా మహరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. కోహ్లీ (33*)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.... తెలంగాణ ను దేశంలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి
నల్లగొండ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే వరి ఉత్పత్తి, శాంతి భద్రతలు, విద్య, వైద్య రంగం, మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలో నంబర్ వన్గా నిలిచిందని తెలిపారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,... తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే :జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే జైలు శిక్ష జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వృద్ధుల నిరాధరణ కేసులను విచారించారు.
జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట... తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి
మెటుపల్లి డిసెంబర్ 06:మెట్పల్లి అంబేద్కర్ పార్క్లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ కుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
తెలంగాణ గ్రామాలను వేధిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించగల అభ్యర్థులనే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (జై కిసాన్) విజ్ఞప్తి చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను... రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
రాయికల్ డిసెంబర్ 6(ప్రజా మంటలు)*గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి*
అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం రాయికల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి
ఈ... అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్టుపల్లి డిసెంబర్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
భారత రత్న డా. బి. ఆర్. ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన... 