భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు
8 కోట్ల విలువైన 16 టన్నుల గంజాయి స్వాధీనం
కింద్రాబాద్, సెప్టెంబర్18 (ప్రజామంటలు): ,
సికింద్రాబాద్ రైల్వే పోలీసు(జీఆర్పీ) రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 16.166 కిలోల పొడి గంజాయి (విలువ రూ.8,08,300/-)ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈకేసులో వడాలా ఈస్ట్, అంటాప్హిల్, ముంబయి, మహారాష్ట్ర కు చెందిన అసిరుద్దీన్ తక్విద్దీన్ ఖాన్ అలియాస్ చిన్నా(35) ను అరెస్ట్ చేశారు.
చదువుకున్న అసిరుద్దీన్ కూలీ పనులు చేసేవాడు. గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు అలవాటు పడి, దొంగతనం, దాడి కేసుల్లో ఇంతకుముందే జైలుకు వెళ్లాడు. ఇటీవల జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఒడిశా ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి దొరుకుతుందని ఒక జంట ద్వారా తెలుసుకున్నాడు.అందుకు అనుగుణంగా సెప్టెంబర్ 16న భువనేశ్వర్ చేరుకుని, సుమారు 15.5 కిలోల గంజాయి రూ.1,13,000/-కు కొనుగోలు చేసి, 16 ప్యాకెట్లుగా బ్రౌన్ టేప్లో ప్యాక్ చేసి ట్రాలీ సూట్కేస్లో దాచుకున్నాడు.
అనంతరం ముంబయి వెళ్లేందుకు కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. సెప్టెంబర్ 17న ఉదయం 11:20 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు జరిపిన పోలీసులు అతడిని ప్రశ్నించగా, ట్రాలీ సూట్కేస్లో గంజాయి ఉందని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు 16.166 కిలోల గంజాయి, ఒక కీప్యాడ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్ను జీఆర్పీ ఇన్స్పెక్టర్ బి. సాయి ఈశ్వర్ గౌడ్), ఎస్ఐ ఎస్.వి. సుబ్బారెడ్డి, సిబ్బంది బి. సత్యనారాయణ సింగ్ , ఎ. ఆశీర్వాదం, కె. చంద్రశేఖర్ తో పాటు ఆర్పీఎస్ అధికారి భవాని శంకర్ సారస్వత్ ,సిబ్బంది విజయవంతంగా పూర్తి చేశారు. కేసును రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ చందనా దీప్తి, డీఎస్పీ ఎస్.ఎన్. జావేద్, పర్యవేక్షించారు. రైల్వే & రోడ్ సేఫ్టీ ఐజీపీ కె. రమేశ్ నాయుడు పోలీసుల శ్రద్ధ, కృషిని అభినందించి, వారికి తగిన బహుమతులు అందజేస్తామని ప్రకటించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
