ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్
గొల్లపల్లి జూలై 20 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో కేంద్రంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలతో మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘము అధ్యక్షులు. కొప్పుల ఈశ్వర్ నివాళ్లు అర్పించారు.
దేశానికి అంబేద్కర్ అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను, ఆదర్శల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందటంతో పాటు స్మరించుకోవాలని ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నామని నల్ల శ్యామ్ తెలిపారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,భారతదేశనికి అంబేద్కర్ అందించిన ఆలోచన విశ్వవ్యాప్తం అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు, వెనుక బడిన వర్గాలు, మైనారిటీస్ కోసం అనేక పోరాటాలు మహనీయులు చేసారని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని రక్షణలు చాలా వెనుక బడిన వర్గాలు తెలుసుకోకుండా ఉన్నారు. ప్రతి ఆదివారం నిమ్న వర్గాలకు సంబందించిన ఒక ముఖ్యమైన ఆర్టికల్ పై వివరణ చెప్పువాల్సిందిగా సూచించారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్నా ఇట్టి కార్యక్రమం ప్రతి మండల కేంద్రంలో నిర్వహించాలని ఆకాన్షించారు.రాజ్యాంగం పరిరక్షణ చేసుకోవాలని రాజ్యాంగన్ని మార్చే కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర బొగ్గుగని కార్మిక సంఘము అధ్యక్షులుగా నియామకం పొందిన నేపత్యంలో నల్ల శ్యామ్ కొప్పుల ఈశ్వర్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఓరగంటి రమణారావు, మేనేని రవిందర్ రావు, గోస్కుల జలందర్, మాధవరావు, బొల్లం రమేష్, నేరెళ్ల గంగారెడ్డి, ఆనంతుల కాంతారావు తెలంగాణ శక్తి ఎడిటర్, తక్కళ్ళ దేవయ్య మద్దెల నారాయణ, నకుమల్ల లక్ష్మీనారాయణ, కాయితి శ్రీనివాసు , బొల్లం ప్రభాకర్, జవ్వాజి శంకర్, బత్తుల ప్రదీప్ రావు, ప్రవీన్, ఐలేని ఆనందరావు,తూము పూర్ణ చందర్, బొంకంటి రవి, కడమండ వెంకటి, ఆవారి చందు, భీమ సత్తయ్య, బలభక్తుల కిషన్, బత్తుల రాజేందర్, మహిళలుతదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
